ప్రవర్తన - పరివర్తన, భావం - స్వభావం

నేను ఈ మధ్య చదివిన ఒక బ్లాగు పుటలో, సదురు స్వంతదారుడు తన అభిప్రాయాన్ని చక్కగా అందమయిన భాష్యంలో తెలియజేసినారు. ఆది ఏ బ్లాగు, ఏ విషయమది అనునటువంటి విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అసలు విషయమల్లా.. ఆ పుటకు స్పందించిన వ్యక్తులలో నేను ఉన్నాను. నాతో పాటుగా మరొక వ్యక్తి.. ఈ క్రింది విధంగా స్పందించారు.

... టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య *** అని ఒ లం* కొ** (naa కొ**ది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లం* కొ** (ఆ లం* కొ**ది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొ** BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లం* కొ**లందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు ..

కొన్ని విషయాలను ఆ బ్లాగు రచయత తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆ బ్లాగు ప్రచురించిన రచయతకు ఈ స్పందన చదివిన తరువాత ఎటువంటి భావన కలిగినట్లు లేదు.. చక్కగా ఉన్నదున్నట్లుగా publish చెసేసారు, కొంచం కూడా moderate చెయ్యకుండా. ఇది చదివిన తరువాత, నా మనసుకు కొంచం భాధ కలిగి, సదురు స్పందించిన వ్యక్తికి విడిగా ఆయన వ్యక్తిగత మెయిల్‍కి క్రింది విధంగా ఒక విన్నపాన్ని తెలియజేసాను.

నా పేరు చక్రవర్తి, నేను మీరు స్పందించిన తీరుపై, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మీకు ప్రత్యెకంగా ఉత్తరం వ్రాయుచుంటిని. మీ స్పందనకు ముందు నేను స్పందించాను, గమనించగలరు. మీ పదజాలం లోని కొన్ని అసంమజసంగా ఉన్నవి. దయచేసి, ఇక మీదట తమరు అటువంటి పదజాలం వాడరని ఆశిస్తున్నాను. మీరు ఉదహరించిన సదరు *** అనేటటువంటి వ్యకి మంచి వాడు కాదనుకుందాం, అతను చేసిన తప్పుకి అతని తల్లిని 'లం*' అని సంభోదించడం ఏ మాత్రం వివేకం .. మీకు కచ్చి ఉంటే అతనిని తిట్టండి అంతేకాని అతని తల్లి తండ్రులను అనవసరంగా అపార్దం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో ఆలోచించగలరు.
అన్యధా మంచిగా ఆలోచిస్తారని, నన్ను + నా అభిప్రాయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తూ..

దీనికి ఎంత త్వరగా బదులు వచ్చిందంటే.. బహుశా.. ఒక రెండు గంటల వ్యవధిలో ఈ క్రింది విధంగా తిరుగుటపా వచ్చింది.

నమస్కారం, మహా కవి శ్రీ శ్రీ, ఇంకా చాల మంది చాలా, చాలా పుస్తకాలలో , సినిమాలలో వాడారు. నేను కొత్తగా ఈ పదాలు వాడ లేడు- కనిపెట్టలేదు . గమనిచగలరు. SORY. నేను అటువంటి పదాలను వాడకుండా ఉండలేను.
BEST REGARDS

ఈ తిరుగు టపా చదివిన తరువాత నాకు నోటివెంట మాటలేదు. ఏమిటిది?? ఎవ్వరితో పోలిక??? మహాకవి శ్రీ శ్రీ గారు వాడారు కదా అని మనం నిరబ్యంతరంగా ఇట్లాంటి పదాలను వల్లించ వచ్చా??? మనలో ఉండవలసిన తెలివి తేటలేమయినట్లు?? మనలో ఉండవలసిన వివేకమేమయినట్లు?? పెద్దవాళ్ళు ఎదో తప్పుచేసారనుకోండి, అటువంటి తప్పు మనంకూడా తప్పకుండా, తప్పు చేయవలెనా??? కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువునైనా గౌరవించాలని చెప్పిన మంచికి ఎటువంటి విలువలేదా??

ఇవన్నీ ఒక ఎత్తైతే, వయస్సుతో పాటు పెరగవలసిన పెద్దరికమేమయినట్లు?? కొంచమయినా హుందాగా బ్రతకాలి అన్న ఆలోచనలేకుండా, 3rd grade people లా ప్రవర్తించిన ఇట్టి మనుషులను ఏమి చేయ్యాలో అర్దం కావడంలేదు. వీరు మంచిగా.. మర్యాదగా మారతారని నేను కలలో కూడా ఊహించలేను. వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.. దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా .. ఏమీ చెయ్యలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.. మా తాతగారు బ్రతికున్నరోజులలో చెప్పిన మాట ఒకటి వీరిలాంటి వారికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది..

దుశ్టులు, దుర్మార్గులు,స్త్రీలను గౌరవించడం చేతకానివారు, అమర్యాదగా ప్రవర్తించే వారు.. ఇలా కొంచం పెద్ద లిస్టే ఉంది.. వీరంతా మనం విసర్జించేటటువంటి మల మూత్రాలతో సమానం. పెంట మీద రాయి వేశామనుకోండి ఏమి జరుగుతుందో తెలుసుకదా.. అటువంటప్పుడు, అట్లాంటి వారితో మనకి పనేమిటి?? దూరంగా ఉంటే పోలా.. మనకూ మంచిది.. వారికీ మంచిది.

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

అర్దం, పరమార్దం - అపార్దం

కొత్తపాళీగారు ఈమద్య, మీ జీవిత పరమార్దమేమిటని సూటిగా ముక్కు పగిలేటట్టు ఒక్కటిచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయాల్ని పొందుపరిచే ముందుగా, ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

  • రాకేశ్వరరావుగారెమో.. బ్రతుకు పోరాటంలో గెలిచి, వంశాభివృద్ది చేసుకోవడమన్నారు
  • రమణిగారేమో.. మనసులోనిమాటని చల్లగా, మెల్లగా.. బ్రతికినంతకాలం ఆనందంగా జీవించేయగలగడం అన్నారు
  • నెటిజన్‍గారెమో.. తన అర్దభాగం దురమయినప్పుడు అంటూ ఎదో చెప్పారు.. నేనేమో తెలుగు వాడినాయే.. మనదా అంత అంత మాత్రం ఆంగ్ల పరిఙ్ఞానమాయే.. ఎదో అర్దం అయ్యి అవ్వనట్లుంటే.. ఎందుకయినా మంచిదని తలకెక్కించుకోలేదు.
  • దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారేమో విశాఖతీరాన కూర్చుని, ఏమి తెలియదంటూ తెలుకోవాలన్నారు. అంతేగాక, తనను తాను తగ్గించుకుంటూ, ఎదుటివారిలో మనల్ని చూసుకోవడమేకాక, కొంచం .. మరికొంచం.. ఇంకొంచం.. అనుకుంటూ మంచితనాన్ని పెంచుకోవడమే మన అందరి పరమావిధి అంటూ ముగించారు.
  • చావా కిరణ్ గారెమో.. ఇప్పుడంత అవసరమా అంటూ చురకేసారు
  • అప్పిచ్చువాడు.. అదేనండీ.. వైద్యుడు .. డా:రాములుంగారు.. (అయ్యా!! అన్యధా భావించకండి) ఇచ్చిపుచ్చుకోవడంలోనే అంతా ఉందన్నారు
  • సాలభజింకలు పేరుతో బ్లాగ్ చేసే పప్పు నాగరాజుగారేమో.. జీవితమంతా ఒక అనంతమయిన కార్పెట్ (తెలుగులో ఏమంటారో తెలియ లేదు..) లాంటిది, అది విప్పుతూ పోవడం అనేది ఒక వ్యర్ద ప్రయాస అనడమేకాక.. జీవిత పరమార్దం తెలియజేయడమంటే.. అసాద్యాయానికి కొంచం అటూ.. ఇటూ.. గా అంతేనన్నారు.
  • నాగ మురళిగారేమో.. తన గత స్మృతులు తలచుకుంటూ.. జీవితం అంటే ఒక గొప్ప అద్బుతం అంటూ.. దాని పరమార్దమేమిటో దాటవేశేశారు.
  • గార్లపాటి ప్రవీణ్‍గారు, దాదాపు సంవత్సరం క్రిందట తనకూ ఇట్లాంటి ఆలోచన వచ్చిందనీ.. ఆకాలంలో తాను ప్రచురించిన పుటనే, తన ఆత్మ శోధించే ప్రశ్నగా పేర్కొన్నారు. దానికి ఎందరో మహానుభావులు తదనుగుణంగా స్పందించారు. ఆ పుట ఆధారంగా.. ఆనాటికి, ప్రవీణ్‍గారి చిట్టాలో వారి పెండ్లి (ఆలోచన, క్షమించాలి..) లక్ష్యం లేదన్నట్లు తెలియజేసారు.. ప్రస్తుతానికి ఓ ఇంటివాడై అంతేకాకుండా సతీసమేతంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం
  • బ్లాగాడించేస్తా నంటున్న రవిగారేమో.. ఇలాంటి ఆలోచనలు తనకెప్పుడొచ్చినా, జిడ్డుకృష్ణ మూర్తిగారి రచనలు చదివేస్తానంటూ.. ఏది ఏమైనా సాధారణంగా గడపడమే ఉత్తమం అన్నారు.
  • వికటకవిగా ప్రచురించే శ్రీనివాసు గారేమో తనకూ అప్పుడప్పుడు ఇలాంటి స్థితే వస్తుందనీ.. అందులో పెద్దగా పట్టించుకోవడానికి ఏమిలేదంటూనే.. ఎవ్వరో మహానుభావుడన్నట్లు.. పరోపకార్ధం మిదం శరీరం అని స్పందించారు.
  • ఓనమాలుగా ప్రచురించే లలితగారు.. జీవిత పరమార్దం జీవించడమే తప్ప మరొకటి కాదన్నారు.
  • చెరశాల రేణుకా ప్రసాద్ గారేమో మొదటగా స్పందించిన రాకేశ్వరవుగారితో ఏకీభవిస్తూనే.. తన అంతరంగంలోని మాటని, నలుగురన్నట్లుగా.., నిస్వార్ధ ప్రేమ + సుఖాన్ని (మాత్రమే) పంచుకోవడం + వగైరా.. వగైరాగా తెలియజేసారు.
  • రె లైటనింగ్ గా ప్రచురిస్తున్న కిరణ్‍కి.. అస్సలు జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయితే.. దాని పరమార్దం మరో చిక్కు వీడని.. లేదా చిక్కు తియ్యలేని మరో ప్రశ్న కాబట్టి.. వేటి గురించి ఆలోచించుకుండా.. జీవితమే ఒక ఆట అనుకుంటూ ఆడేయ్యంటున్నారు.
  • గిరీష్ గారేమో కొంచం వేదాంతంగా.. ఎటువంటి ఆశలు / కోరికలు లేకుండా జీవించేయ్యడమే ఈ జీవిత పరమార్థం మంటూ .. నదులను జలాసాయాలను ఉదహరిస్తూ ఒక పుటని ప్రచురించారు
  • శ్రీనివాస్ గారికేమో జీవితాశయానికి మరియు జీవిత పరమార్థానికి తేడా అంతగా లేదంటూనే, మన ప్రమేయం లేనిది అంతేకాక తప్పకుండా ఉండి తీరాల్సినదే జీవిత పరమార్ధమని స్పందిచారు
  • గార్ల నవీన్ గారికి అనుకోకుండా గత శ్మృతులు గుర్తుకొచ్చి, ఆనాటి నుంచి తానూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరితపిస్తున్నానంటూ.. అందరిలోనూ మంచే చూస్తూ జీవించేస్తే అంతా ఆనందమయమవుతుందంటున్నారు.
  • దైవానిక గారేమో సంతృప్తిగాఅ జీవించడమే జీవితపరమార్ధం అంటున్నారు
  • సుజాతగారేమో తన మనసులోని మాటను సున్నితంగా, పరోక్షంగా... పరోపకారానికే ఓటేశెసారు

హమ్మయ్య..!! ఇప్పటికి రెండు రోజులుగా చేసిన ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఇక ఇప్పుడు నా వంతు.

ఒక రకంగా నేను చావా కిరణ్ గారితో ఏకీభవిస్తాను. మనకిప్పుడు ఈ విషయం అవసరమా..?!!#$%^&*.. ఎదో కడుపు నిండుగా.. ఇంటి పట్టున తిన్నగా.. ఉధ్యోగ వేళలలో చల్లగా బ్రతికేస్తున్న మనకు ఈ ఆలోచన అవసరమా??? ఈ విషయానికి సమాధానం వెతికేముందు, అస్సలు ఈ ప్రశ్న మొలకెత్తడానికు గల కారణాలు సోధిద్దాం

మొదటిది : ఇట్లాంటి ఆలోచనలు, పని లేని వేళలలో మొలకెత్తుతాయి.. ఆంగ్లంలో చెప్పినట్లు.. Idle man's brain is devil's workshop. ఎదో పనిలో పడ్డామనుకోండి, ఇలాంటి విషయాల వైపు అస్సలు దృష్టి సారించము.

రెండవది : పొట్ట కూటి కోసం రోజంతా కష్ట పడే కూలీలు ఇలాంటివి ఆలోచించరు, ఎందుకంటే.. పగలంతా పనిచేసిన మీదట, రెండు సారా చుక్కలు గొంతులోకి దిగిన తరువాత ఒళ్ళు నెప్పులు కాస్తా మత్తులో లెక్కచెయ్యరు. తదుపరి, కడుపు నిండా కలో.. గంజో.. కంటి నిండా నిద్ర.. ఇలా పనిచేసుకుంటూ, బ్రతకడానికే సమయం లేనివాడు ఇలాంటి ఆలోచనలు చెయ్యడు. ఇలాంటి ఆలోచనలు... "నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. " అంటూ పాడుకునే మధ్య తరగతి వాళ్ళకు తప్ప మరింకెవరికీ రావని మనం గుర్తించాలి.

మూడవది : ఆత్మావలోకనం చేసుకునే చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని అనిపిస్తుందనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.. ఇలాంటి వారు పేద, మధ్య , ధనికులే కానక్కరలేదు. స్వయం ప్రత్తిపత్తి కలిగి, కరిగి పోయే కాలాన్ని ఏవిధంగా వినియోగించు కోవాలనే తాపత్రయం కలిగిన వాళందరూ ఈ వ్యాధిఘ్రస్తులే..

ఈ ప్రశ్న సమాధానికోస్తే.. ఏనాడో, ఒక మహానుభావుడన్నట్లు.. మానవసేవయే మాధవ సేవగా భావించుకుంటూ.. పరోపకారం మిదం శరీరం అని భావించడమే కాకుండా, ఉన్నంతలో (వీలు) కలిగి నంత పంచుకుంటూ పోవడమే అని తెలుసు కోగలరు. ఇక్కడ మరొక విషయం తనకు మాలినది ధర్మం పనికిరాదని కూడా మర్చిపోరాదు.

ఇంతే సంగతులు..

భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

నాతెలుగు తల్లికి (వాడిన) మల్లెపూదండ

నేను ప్రస్తుతం ఉంటున్నది మన రాష్ట్రరాజధాని, హైదరాబాదులో. మన రాష్ట్ర భాష తెలుగు. అట్టి తెలుగుకి ఎంత దుస్తితి పట్టిందో ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

భాషాప్రయుక్త భావనపై వేరు పడి, తెలుగును ఒక వెలుగు తెచ్చిన వారందరూ ఈనాటి మన హైదరాబాదు నగర స్ంచారానికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానని భావించి.. మన హైదరాబాదు జనాల్ని పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడని తెలుకుని, మీళ మధ్య బ్రతకడం కన్నా చావడమే మేలనుకుంటారు.

నండూరి సుబ్బారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమసేఖర శర్మ గారు, కొంపల్లి జనార్దన రావు గారు, ఆధునిక తెలుగు పితామహుడిగా పేరుగాంచిన గురజాడ వేంకట అప్పారావు గారు, పైన చెప్పిన వారికి ఏమాత్రం తీసిపోని శ్రీరంగం శ్రీనివాసరావు గారు, వీరందరినీ మించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, కవికొండల వెంకట రావు గారు, చింతా దీక్షితులు గారు అబ్బురి రామకృష్ణ రావు గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు .. ఎందరో మరెందరో మహానుభావులు కనుకా ఈరోజుల్లోని పిల్లలని చూసి ఉంటే.. మనభాషకి పట్టిన గతికి చింతించడమే కాక, తాము పడ్డ కష్టానికి.. చేసిన కృషికి లభిస్తున్న ఆదరణకి ఎంత భాధ పడేవారో ఒక్క సారి ఊహించుకోండి.

అస్సలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా?? నిన్నటి సాక్షి పత్రికలో చదివిన వ్యాసం కిక్కు ఇవ్వాళ్టికి నషాళానికి ఎక్కింది. ఈ మధ్య మన ప్రస్తుత అధికార ప్రబుత్వం చిన్నపిల్లలకు ఒకటవ తరగతి నుంచి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందట. పిల్లలకి చిన్నవయస్సు నుంచే తెలుగుని దూరం చేస్తే.. వారికి మన మాత్రు భాషపై మమకారం ఎలా పెరుగుతుంది? అభం శుభం తెలియని పిల్లలు.. అందునా పసి మొగ్గలు.. వాళ్ళు, వాళకేం తెలుస్తుంది ఏ భాష నేర్చుకోవాలి అని??? అన్నెం పుణ్యం తెలిసిన మన భుద్దికేం అయ్యింది?? ఎదో పెద్దయిన తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాబట్టి ఇప్పటినుంచే పెద్ద పెద్ద పాఠశాలలో చిన్న చిన్న చదువులు చదివించేస్తే సరిపోతుందని అలోచిస్తున్న నేటి తల్లి తండ్రులు తప్పు చేస్తున్నారా.. లేక వాళని చూసుకుని వారు వేసే ఓట్లకోసం ఈ ప్రభుత్వం ఇంతకు బరి తెగించిందా??

ఏదైనా భాషపై పట్టు రావాలంటే మూడు మాధ్యమాల ద్వారా మాత్రమే కుదురుతుంది. అవి, మాట్లాడగలగడం మెదటిదైతే.. చదవగలగడం రెండవ దస. ఆఖరున వ్రాయగలగడం. మాట్లాడడానికైతే ఇంట్లో తల్లి తండ్రులు.. స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ తెలుగుని చదవడానికి మరియు వ్రాయడానికి ఉన్న ఒకె ఒక్క అవకాశం .. పాఠశాల మాత్రమే. అట్టి పాఠశాలలోనే మనం తెలుగుని విస్మరిస్తున్నామంటే... ఇక పిల్లలకు తెలుగుదనం యొక్క ఉనికి ఒక్క మాటలకి మాత్రమే మిగిలిపోతుంది. ఈ రోజుల్లోని తల్లి తండ్రులు తమ తమ పిల్లల్ని చక్కగా.. అమ్మా .. నానగారు .. అనేటటువంటి పిలుపులకు దూరంచేసి.. మమ్మీ డాడి వంటి అరువు తెచ్చుకున్న పిలుపులకు దగ్గర చేస్తున్న వైనం ఏమాత్రం హర్షణీయం??

ఇవన్నీ ఒక ఎత్తైతే.. మన రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న టికెట్ కండక్టర్లకు ఎంతమందికి తెలుగు వచ్చో ఎప్పుడైనా మాట్లాడి చూసారా?? అప్పుడప్పుడు మేము విజయవాడనుంచి వచ్చేటప్పుడు తెల్లవారుఝాము వేళలో బాగుంటుంది కదా అని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాము. నాకు ఆశ్చర్యం వేసే విషయమేమిటంటే.. వాళు అనేటటు వంటి మొట్ట మొదటి మాట.. కహా జానెకా.. (హిందిలో, ఎక్కడికి వెళాలి?). ఒకటి రెండుసార్లు భాషపై ఉన్న మమకారం చంపుకోలేక, వాళు మారరని తెలిసీ నావంతు కృషిగా వారితో మాట మాట కలిపి,వారికి అస్సలు తెలుగు వచ్చో.. రాదో.. తెలుసుకునే ప్రయత్నంలో, వాళకి తెలుగు తెలుసు అన్న చేదు నిజం తెలిసిన తరువాత నాగొంతుక మూగబోతుంది. కొంత మందైతే, తెలుగు తెలిసినా రానట్లు నటించడం చూస్తుంటే, వాళను ఏమి చెయ్యలేని నా నిస్సహాతకు నామీద నాకే అసహ్యమేస్తుంది. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి, హమ్ కో తెలుగు నహి అతాహై.. తుమ్ హిందీ మే బోల్.. అంటూ తిరిగి, రివర్స్‍లో నన్నే గదమాయిస్తూంటారు. మన ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తే, ఇట్లాంటి వాళు అలాంటి ఉద్యోగాలు చెసేవారా??? ఏమి చేస్తాం.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ కూర్చోవటం తప్ప. దేవుడా.. నా తెలుగు తల్లిని రక్షించు.

ఎల్‍వీ ప్రసాద్ గారిపై నా అభిప్రాయం

మెదటి విషయం.. ముఖ్యంగా.. నేను తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూస్తాను.. తక్కువగా అనేకన్నా, అరుదుగా అంటే బాగుంటుందేమో.. ఏది ఏమైనా.. ఇక్కడ నేను ప్రస్తావించే విషయాలు పూర్తిగా నాస్వగతం.

రెండవది.. ఇన్నాళ్ళు, ఎల్‍వీ ప్రసాద్ గారంటే.. ఒక నేత్ర చికిత్సాలయం యొక్క స్వంతదారుడిగానో లెక హక్కుదారుడుగా మాత్రమే అనుకునేవాణ్ణి.. నేనింత వరకూ ఈ మహానుభావుడు ఎదో పెద్ద వైద్యుడై ఉండి ఉంటాడు.. అనుభవంతో వచ్చిన ఙ్ఞానాన్ని, తనకు వీలున్నంతలో సాధారణ ప్రజానీకానికి తనవంతు కర్తవ్యంగా తనకు కలిగినంత సేవ చేస్తున్నాడు అనుక్కున్నా.. తీరా ఈరోజు, నవతరంగంలో ఈయన మీద ప్రచురితమయిన వ్యాసాన్ని ఆసాంతం చదివిన తరువాత అస్సలు కధ ఏమిటో తెలిసింది.

ఇక ఆ వ్యాసాన్ని చదివిన తరువాత, ఎల్‍వి ప్రసాద్ గారిపై ఉన్న గౌరవం కాస్తా మంటలో కలిసింది. పాతరోజుల్లో చెప్పినట్లు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు.. తన కుటుంబం అప్పుల పాలై.. తండ్రి మరణించి.. అభం శుభం తెలియని మేనమామ కూతురు, ఊహ తెలియని వయస్సులో .. వచ్చీ రానీ వయస్సులో .. తెలిసీ తెలియని పెళ్ళి చేసుకుని .. త్వరలోనే పిల్లకి తల్లై .. పరిపక్వతలేని స్తితిలో ఉన్నపుడు.. ఈయనగారు, తల్లిని.. కట్టుకున్న ఆలిని.. కడుపున పుట్టిన పిల్లనూ వదిలి .. ఏదో సాధిద్దామని, ఇంట్లో ఎవ్వరికి చెప్పాపెట్ట కుండా బొంబాయి చెక్కేస్తారా.. కనీసం చుట్టూ ఉన్న సమాజం తల్లిని గానీ, కట్టుకున ఆలిని గానీ.. "ఏమ్మా మీ అబ్బయి కనబడటం లేదు.. మీ ఆయన ఊళ్ళో ఉన్నాడా!! " వంటి ప్రశ్నలు వేస్తే, ఏమి సమాధానం చెబుతారో అన్న ఆలోచన లేకుండా.. అందరిని గాలికొదిలేసి.. భాధ్యతలకు దూరంగా "బొంబాయి పారిపోయాడు..", అని చదివిన తరువాత, మనసుకి చాలా కష్టం కలిగింది. ఇంతే కాకుండా.. ఈయనగారికి చదువుమీద ఏమాత్రం శ్రద్ద లేదంట. మన పిల్లలు చదువు విషయంలో శ్రద్ద వహించక పోతేనే మనం సహించమే.. అట్లాంటిది, ఇంత పెద్దాయనకి మాత్రం "శ్రద్ద లేదు" అని తెలుసుకున్నా మనమేం పట్టించుకోం. పైగా, ఈయన ఇంత పోడిచాడు.. అంత పీకాడు.. అంటూ ప్రసంగాలిస్తూంటాం.. చ చ.. తల్లిని, పెళ్ళాన్ని అంతేకాక కన్న కూతురిని కష్టాలో ఉన్నప్పుడు గాలికొదిలేసి, తన స్వంత ప్రయొజనాలకే విలువనిచ్చే వ్యక్తీ ఒక వ్వక్తేనా.. ఇదేమయినా స్వాతంత్ర్య పోరాటమా.. దేశం కోశం, త్యాగం చేసాను అని సర్ది చెప్పు కోవడానికి .. పూర్తిగా వ్యక్తిగత అభిరుచి..

నిజ్జంగా చెప్పాలంటే.. ఆ ఇద్దరు స్త్రీ మూర్తులకు చేయెత్తి నమస్కరించవచ్చు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయినప్పుడు, తల్లి పడే భాధ వర్ణనాతీతం.. అటువంటి సమయంలో ప్రతీ స్త్రీ, కట్టుకున్న భర్త దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అటువంటి సమయంలో ముఖం చాటువేసినా, తిరిగి వస్తున్నానని టెలిగ్రాం వచ్చినప్పుడు, కూతురు చనిపోయిందనే విషయాన్ని ఈయనకు ఎలా తెలియ జేయాలా అని వారిద్దరు పడ్డ భాధ గురించి చదివినప్పుడు.. ఆ పుణ్య మూర్తులకు సాష్టాంగ పడాలనిపించింది. బ్రతికి ఉన్నాడో లేడో అనేటి సంసయావస్తలో ఉన్న తల్లికి కొడుకు వస్తున్నాడు అన్న విషయం పోయే ప్రాణం లేచొచ్చేటటు వంటి వార్తే.. కానీ, సుమారు రెండు సంవత్సరాలు ఆమె అనుభవించిన సందిగ్దావస్త ఏ తల్లికీ రాకూడదు అని నేను భావిస్తున్నాను. ఇంత మందిని ఇబ్బంది పెట్టి సాధించింది ఏమిటి..

ఒప్పుకుంటాను.. అటువంటి మహానుభావుడే లేకపోతే.. ఎన్నో మంచి మనోరంజక మయిన చిత్రాలు రాకపోయేవి అంటారు.. ఎవ్వరికి కావాలండీ ఇవన్నీ.. మేమేమయినా అడిగామా.. తన స్వంత ప్రయోజనాలకు, ధన సంపాదనకు మాత్రమే చేసారా లేదా?? ఫలాపేక్షణ కోసంచేసి, పెద్ద.. ఎదో.. సమాజాన్ని ఉద్దరించామంటారేమిటి?? ఒక వ్యక్తిత్వం అంటూ లేని వ్యక్తి.. దానికి తోడు లాభాపేక్షణ .. వీటన్నింటినీ మించి.. పులితోలు కప్పి.. మహానుభావుడు అనేటటువంటి పెద్ద పదాలు .. ఏమిచేస్తాం .. సమస్య మనలోనే ఉంది.. మనం ఇంకొకళ్ళను అనుకునేం లాభం.. ఈ సినిమా వాళ్ళంతా ఇంతే..

అదేదో సినిమాలో హీరోయిన్, నటించే చాన్సు కోసం పడుపు వృత్తికి కూడా వెనుకాడదు .. మళ్ళీ తను చేసేది తప్పుకాదన్నట్లు / సరైనట్లు డైలాగు .. "ఒక్క ఛాన్సు.. ఒకే ఒక్క ఛాన్సు ..", వీళందరినీ పెద్ద స్టార్‍లుగా మనం గుర్తించేయ్యడం. మనం గుర్తింస్తున్నాం కదా అని వాళ్ళు కనీస విలువలను గంగలో తుక్కి, మానవతా విలువలకు తిలోదకాలిచ్చి ఇదిగో ఇలా గొప్ప వాళై పోతారు. మన నవతరం ఇలాంటి వాళని తమ తమ గాడ్ ఫాదర్‍గా అనేసుకుని, ఇంకే .. ఇంకేముంది, నేను కూడా అంత వాడినై పోతాను అని ఒక తాడు బొంగరం లాగా తిరిగేస్తూ ఉంటారు.

ఇక్కడ, ఇప్పుడు మరొక ప్రస్తుత పెద్ద నటుడు విషయం తలవని తలంపుగా మదిలోకొచ్చింది. పేరు అప్రస్తుతం.. కానీ విషయం చాలా సున్నితం. ఈ పెద్ద హీరో గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బయి. పెద్ద పిల్ల వివాహం ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఒకరితో నిత్సయ తాంబూలాలు తెగతెంపులు.. వేరొకరితో వివాహం. చిన్నకూతురు, అస్సలు చెప్పాపెట్టాకుండా పారిపోయి వివాహం. ఆరోజుల్లో.. చిన్న కూతురు వివాహం పెద్ద వార్తా విషయం. అట్టి మన ప్రభుద్దుడు, ప్రస్తుతం మన రాజకీయాల్లోకి అడుగుడతాడు అనే ఊహాగానాలకు చిలువలు పలువలుగా ఎవ్వరికిష్టమొచ్చినట్లు వారు తమ తమ స్టేట్‍మెంట్ల్.. ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారో .. వాళ్ళ అభిరుచులేమిటో .. వాళ్ళను అదుపులో పెట్టలేక విఫలమయినటు వంటి వ్యక్తి.. రాజకీయాల్లోకి రావడమేమిటో.. మనమందరం కలసి, ఆయనకు ఓట్లు వేసి ఆయన్ను మనల్ని పాలించే అధికారం కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనేమిటో.. వీటన్నింటికి మనం గొర్రెల్లాగా .. తానా అంటే తానె తందానా అనడం ఏమిటో.. నాకయితే అర్దం కావటం లేదు ..

ఇక ముగించేముందు, తేలిందేమిటంటే.. సినిమావాళందరూ ఇంతే.. స్వప్రయోజనలే తప్ప పరోపకారం ఏమాత్రం లేనివారు అని... వీళందరినీ చూస్తుంటే.. పర భాష వాడైనా .. షారుక్ ఖాన్ .. అదేదో కార్యక్రమంలో నిఖచ్చితంగా అన్నాడట.. నేను చేసేది అచ్చంగా వ్యాపారం .. నేను రాజకీయాలలోకి పనికిరాను అని. తెలివయిన వాడు అనిపించింది. నిజాన్ని నిజంగా ఒప్పుకోవడానికి ధైర్యంకావాలి.

 
Clicky Web Analytics