Showing posts with label మహానుభావులు. Show all posts
Showing posts with label మహానుభావులు. Show all posts

మహిళా ప్లస్సర్ల సమావేశం .. భాగ్యనగరంలో..

నిన్న యాదృశ్చికంగా ఏదో సినిమా టైటిల్ నా చెవిన పడింది. సీతా రాముల కళ్యాణం, లంకలో .. అన్న పట్టాన పెట్టాను ఈ పుటకి శీర్షిక.

ఓ సంవత్సరం క్రిందట ఇలాంటిదానిని భవదీయుఁడు అనే బ్లాగులో పెట్టినట్లు గుర్తు. అప్పుడేమో మహిళలు అంతా కలసి, మహిళా బ్లాగర్ల సమావేశం అని పేరు పెడితే, ఈ సారి ఆ సమావేశాన్ని ప్లస్సర్ల సమావేసంగా పేరు మార్చారు. రాజకీయ నాయకులకి అలాగే మహిళలకు పేర్లతో పనేంమిటి?

ఆ!!! మహిళలను రాజకీయ నాయకులతో పోల్చడమా !!!

రాజకీయ నాయకులకు దోచుకోవడానికి ఏ పధకం పేరైతేనేమిటి? వాళ్ళకు కావలసినది దోచుకోవడమే, నాకెంత? నీకెంత? అనే కదా అనుకునేది. అదే విధంగా మహిళలకు వారి సమావేశాలకు పేర్లతో పని ఉందా?? ఏ పేరైతే నేమిటి, తలా ఒక వంటకం చేసి తీసుకొచ్చి ఓ చోట పేర్చుకుని కూర్చుని, అప్పట్లో నేనేమి చేసానో తెలుసా.. నువ్వేంమి చేసావు .. అంటూ బాతాకానీ కొట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి కదా!!

ఈ తతంగం అంతా నాలాంటి ఒంటి కాయ సొంటి కొమ్ము లాంటి వాడు ఖండిస్తున్నాడు. చరిత్ర పునరావృత్తం అవుతుంది అంటే ఏమిటో అనుకున్నా, ఇవ్వాళ కూడా మా ఇంట్లో బెండకాయ కూరే!! Sad smile  అక్కడ వాళ్ళేమో రకరకాల వంటలతో భోజనమా!! నాకేమో బెండకాయ కూర, నీళ్ల చారా.. తూచ్ .. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను..

నిజం వ్రాయాలంటే, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు నాకు భలే సంతోషం వేస్తుంది. ఏదో విధంగా మహిళా లోకం అంతా కాకపోయినా, కొందరైనా వీలు చేసుకుని మరీ కలుస్తున్నారు. పాతరోజుల్లో వనభోజనాలు జరిగేవి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా నేను వనభోజనాలలో పాల్గొన్నట్లు ఙ్ఞప్తి లేదు. కారణాలు లేకుండా, మరొకరి హితవు కోరుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ చుట్టం చూపుగానైనా వీరందరూ కలుస్తుంటే, ఎంతో ఆనందం కలుగుతుంది. చుట్టాలతో కొన్ని సార్లు ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ, వారింటికి మనల్ని ఆహ్వానించినా, లేక, మన ఇంటికి వారిని ఆహ్వానించిన సమయాన ఈ క్రింది డైలాగ్ సాధారణంగా వినబడుతుంది..

“ .. .. మీ ఇంట్లొ ఏదైనా ఫంక్షన్ పెట్టుకోండి, ఆ వంకనైనా మనం కలుద్దాం .. .. ”

కానీ ఈ మహిళలు కలవడానికి ఓ సాకుని ఎన్నుకుని కలుస్తున్నారే, అది హర్షించదగ్గ విషయం. మనకు ఎలాంటి చుట్టరికం లేని మఱో మహిళను మన ఇంటికి ఆహ్వానించడం లేదా వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారింటికి వెళ్ళడాని ఎదుటి వారితో మనకి ఎంతో సాన్నిహిత్యం ఉండాలి. అలాంటి భావన ఇలాంటి ఘటనల ద్వారా ఈ మహిళలు వ్యక్తపరుస్తున్నారు. కావున ఇలాంటివి మరింత తక్కువ సమయంలో మరిన్ని ఎక్కువసార్లు కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళా ప్లస్సర్లూ!! వింటున్నారా!! సారి, చదువుతున్నారా నా మనోభిష్టాన్ని?

 

[[ష్ .. ష్ .. గప్ చిప్.. గూఢాచారిగా నా భార్య వెళుతోంది, అక్కడ ఏమి జరిగింది, ఎవ్వరెవ్వరు ఏమేమి తెచ్చారు, ఎవ్వరెవ్వరు ఏమేమి మాట్లాడుకున్నారు, వగైరా .. వగైరా.. వంటి మరిన్ని వివరాలు త్వరలో..]]

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.

మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.

వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.

రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.

స్టీవ్ జాబ్స్ – ఆపిల్ సంస్థ మూలం

స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.

steve_jobs

నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ. అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా. ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే. అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం. ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని కారణాలలో మొదటిది ఏమిటంటే..

.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి, అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.

ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా, ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా, నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు, కలలు కనండి, కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ, సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.

వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట) ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు. ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.

నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు. అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు. అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.

దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి. అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే, IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే, IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.

అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత వ్యాపారం తోడైంది.

ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి (అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే బుఱ ఇకలేదు. ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి

కెలుకుడు బ్యాచ్ – ఇక మీ ఇష్టం

ఈ మధ్య కొన్ని వ్యక్తి పరమైన అలాగే వ్యాపర పరమైన ఘటనలు నలుగురిలో ఉంచి నన్ను అమర్యాద చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని ప్రయత్నం జరిగింది. ఆ పంచాయితీకి నేను దూరంగా ఉన్నందు వల్ల పంచాయితీ పెట్టిన పెద్దల ఇగో దెబ్బతింది. వారి అహం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఎంతటి నీచానికి పాల్పడుతున్నారంటే, తలచుకోవడానికే అసహ్యం వేస్తోంది. అలాంటిది వ్రాయడాని అక్షరాలు రావటం లేదు.

నేను స్వతహాగా కొందరికి దూరంగా ఉంటాను, అలాంటి వారిలో పద్దతిగా మాట్లాడటం రానివారు, గౌరవించడం తెలియని వారు, ఎంత చదువు చదువుకున్నా నోరు తెరిస్తే బూతులు తప్ప మాట్లాడని వారు.. వగైరా వగైరా. ఆ జాబితాలోకి ఈ మధ్య మఱో వ్యక్తి చేరారు. ఈ వ్యక్తి ఎలాంటి హేయమైన చర్యలు పాల్పడుతున్నారంటే, తలచుకున్నప్పుడల్లా నాలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోంది. అలా చేరుకున్న ప్రతీ సారి నాకు నేను ఏవిధంగా స్పందిస్తున్నానో అవగతం అవుతోంది. ఇది ఒక విధంగా నాకు మంచిదే అవుతోంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు, నిన్ను నీవు తెలుసుకో.. అన్న వాక్యం యొక్క అర్దం ఇలాంటి సంఘటనల వల్ల నాకు నేను ఎంత ఆవేశ పరుడినై నాకుండాల్సినటువంటి ఇంగిత ఙ్ఞానాన్ని ఎలా కోల్పోతున్నానో అవగతం అవుతోంది.

నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టలనుకునే కెలుకుడు బ్యాచ్ వారందరికో ఇదే నా ఆహ్వానం. మీరు ఎంత దిగజారి ఎంత హేయమైన ప్రవర్తన చూపించుకోవాలనుకుంటున్నారో అంత ప్రయత్నించండి. మీ శక్తి వంచన లేకుండా మీ సత్తా ఏమిటో చూపించండి. మీరు ఎంత పోటీ ఇస్తే నేను అంత గట్టివాడనౌతాను. చూద్దాం, ఈ యుద్దంలో మీరు గెలుస్తారో నేను గెలుస్తానో తేలే వరకూ నేను వెనక్కు తగ్గను.

నచ్చింది

ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదు. ఎందుకని అంటే, ఏవేవో కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ విషయం వ్రాయడానికి ఎందుకో వెనకాడకుండా అనుకున్నదే తడవుగా వ్రాసేస్తున్నాను. దాని కారణం సంగీతం. నా పెళ్ళికి ముందు నేను నా భార్యని అడిగిన మొట్ట మొదటి పని ఏమిటో తెలిస్తే మీరు నవ్వు కుంటారు. అప్పట్లో నేను బెంగళూర్ నగరంలో పని చేసే వాడిని. సెలవలకి విజయవాడ వస్తున్నానని అందునా నాకు విజయవాడలో చాలా పనులున్నాయి కావున వీలైతే పంచ రత్న కీర్తలన సీడీ దొరుకుతుందేమో అని వెతక మని చెప్పాను. అలా నా భార్యనుంచి నేను అందుకున్న మొట్ట మొదటి కానుక పంచ రత్న కీర్తనల సీడి.

నాకు ఉన్న కొన్ని బల హీనతలలో ఒకటి సంగీతం. దీనియందు నన్ను నేను కోల్పోతుంటాను. ఇప్పుడే ఓ సన్నిహితుడు నాకు ఈ క్రింద చూపబడిన వీడియో గురించి తెలియ జేసారు. ఈ సంగీతంలో చివ్వరలో వచ్చే గమకాలు, ఉదృతంగా సాగుతూ ఆఖరికి ప్రశాంతంగా అంతం అయ్యే విధానం భలే నచ్చిందనుకోండి.

ఇలాంటి సంగీతాన్నిచ్చిన ఈ సంగీత కారుల గురించి వ్రాయకుండా అలాగే వారిని మెచ్చుకోలేకుండా ఉండలేను. ఈ సంగీత సరస్వతీ పుతృలు ఇలాగే మరికొన్ని అభుత కీర్తనకు సమకూర్చి ఇంతకింతకు ఎదిగి సంగీత ప్రపంచంలో కీర్తిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

సృజనాత్మకత ఎక్కడ లేదు?

IMG_0043

అప్పుడెప్పుడో వెంకటేష్ గారి సినిమాలో హీరోయిన్ చేసింది అని విన్నాను ఇదిగో ఇవ్వాళ్ళ అనుభవిస్తున్నాను. పైన శీర్షికకి ఇక్కడ వ్రాసిన మొదటి వాక్యానికి పొంతన లేదనుకుంటున్నారా? పైన చిత్రంలో కనబడుతున్నవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

చదివే వారికి ఓ క్లూ కూడా ఇచ్చేసాను. వెంకటేష్ చేసిన సినిమాలలో స్నేహం అనే ఇతివృత్తం ఆధారంగా తీసిన సినిమాలోని హీరోయిన్ చద్దన్నం పారేయ్యకుండా పిండి ఒడియాలు చేస్తుంది. అదిగో అలాగునే మా అమ్మ ఇవ్వాళ్ళ మధ్యాహ్నం వేళకి ఓ ఫలహారం చేసింది. ఏమిటో అనుకుంటే, ఇదిగో ఇలా పకోడీలు వచ్చాయి. పకోడీలు శనగపిండితో చేస్తారు కదా వద్దులే నేను తినను కాలికి చీము పడుతుందేమో అని దాటేయ్యబోతే, ఒరేయ్ భడవాయ్ ఇవి శనగపిండి పకోడీలు కాదు, ఇందాక మనం తిన్న తరువాత మిగిలిన అన్నాని ముద్ద చేసి ఇలా వేయించాను అని నెత్తిమీద ఓ మొట్టికాయ్ వేసింది.

నిజం చెప్పొలంటే, మా అమ్మ పెద్దగా చదువుకోలేదు కానీ వంట మాత్రం బాగానే చేస్తుంది. క్రొత్తగా ఏదైనా చేసే విషయాన్ని సృజనాత్మకత అని అంటే, మా అమ్మ లాంటి వారిని చూచిన తరువాత సృజనాత్మకత ఎక్కడ లేదు అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలి అన్న ఆలోచన రావడమే ముఖ్యం.

ప్రేమ మరియు వయస్సు

ఓ రోజు షేక్‍స్పియర్‍ని ఓ చమత్కారి ఇలా అడిగాడు..

మీరు మీకన్నా పెద్ద వయస్సులో ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కదా, ఎందుకలా?

అందుకు మన వీర ప్రేమికుడు కాలెండర్ చూపిస్తూ ఇలా తిరిగి ప్రశ్నించాడంట

అదిగో అక్కడ కనబడుతున్న కాలెండర్లో ఏడు రోజులున్నాయి కదా, వాటిలో వయస్సులో ఏది పెద్దది ఏది చిన్నది? ఆది వారమా లేక శనివారమా? ఇది నిర్ణయించడం ఎంత కష్టమో అలాగే ప్రేమని వయస్సుని జత చేయడం కూడా అంతే కష్టం. ప్రేమ అనేది గుండె లోతుల్లోంచి ఉదయిస్తుంది అంతే కాని వయస్సు నుంచి కాదు. కాబట్టి ప్రేమకి వయస్సుతో సంబందం లేదు

దీనిని బట్టి మనకు అర్దం అయిన నీతి ఏమిటి, వయస్సులో మన కన్నా పెద్ద అయిన సీనియర్ గర్ల్ అందరూ జూనియర్ బాయ్స్ కి అందుబాటులో ఉన్నట్టే. కాబట్టి జూనియర్స్, మీరు ఒక్క్ మీ క్లాస్ లోని అమ్మాయిలకే కాక సీనియర్స్ అందరికీ లైన్ వెయ్యొచ్చు.


ఇంతకీ అసలు సంగతి చెప్పలేదు కదా, పైన చెప్పిన కధంతా నాకు మరో ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వచ్చింది. దాని ఆంగ్ల పాఠ్యం యధావిధిగా ఇక్కడ ఉంచుతాను. నా అనువాదం ఎంతవరకూ బాగుందో చెప్పండి.


Some1 asked Shakespeare “U married a girl elder to u, y?”, he showed a calendar and said “A week has 7 days, can u say which one is younger, either sunday or saturday ..? So love comes 4m heart not in age Love has no age ..”

Morel : Senior girls r also available 4f junior boys..

సెహ్వాగ్ సెంచరి చెయ్యలేడు

 

VS

భారత మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య నాగపూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మాచ్ మూడవరోజు ఓపెనర్ సెహ్వాగ్ సెంచరీ చేశాడు. బాగుంది. కానీ నా ఈ శీర్షిక ఏమి చెబుతోందంటే, మన సదురు దుడుకు బ్యాట్స్ మెన్ బాగా బౌలింగ్ వేశే దేశాలన్నింటినీ ఉతికి ఆరేశాడు కానీ, పసికూనలైన బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై మాత్రం ఒక్క సెంచరీ చెయ్యలేక పోయ్యాడు. ఎందుకంటారు?

నా ఉద్దేశ్యంలో అతనొక అద్బుత ఆటగాడు. ఆటలోని మెళుకువలు తెలిసిన వాడు. తెలివైన బౌలర్లు వారి అనుభవమంతా వారి బౌలింగ్ లో చూపిస్తారు. అలా వారి నైపుణ్యాన్ని వైవిధ్యమైనటువంటి బంతుల ద్వారా వారు విసురుతూ ఉంటారు. అలాంటి బంతులు విసరడంలో చేయి తిరిగిన మహా మహాలును అవలీలగా ఎదుర్కొన్న మన హీరో గారు అనుభవరాహిత్యంతో ఉన్న బంగ్లాదేశ్ లేదా జింబాబ్వే ఆటగాళ్ళపై ఎందుకని చేయ్యలేకపోయ్యాడంటే, బౌలర్లు తెలివిగా బంతులు విసరకపోవడమే..

మీరేమంటారు .. ??

రక్షించండి .. మమ్మల్ని కాపాడండి

ముందుగా మన ముఖ్యమంత్రి డా. వై. ఏస్. ఆర్ మృతికి రెండులైన్ల సంతాపం
.
.
ఇక విషయానికి వస్తా.

ఇదిగో ఇక్కడ చూస్తున్న చిత్రం మేముండే ప్రదేశం. పేరంటారా!! బ్రాహ్మణవాడ. ఇది నాలుగు వైపులా మూసేసి ఉన్న ఒక ప్రదేశం. ఎక్కడ ఉందంటారా!! అదేనండి, బాగ్యనగరంలో బేగం పేటలో ఉంది. మా వాడకి ఒక వైపు ఎప్పుడూ పారే మురికి కాలువ మరోవైపు లోకల్ రైళ్ళు వెళ్ళడానికి అనువుగా ఏర్పరచిన రైల్వే లైన్. కనబడుతోంది కదా. మరి మేము బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే మాకు ఉన్నవి రెండే రెండు దార్లు. అవే మీకు చిత్రంలో ఎర్ర రంగులో వేసిన బాణం గుర్తుతో సూచించ బడ్డాయి. మీరెప్పుడైనా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్ళారా.. అయితే మీకు ఓ ప్రక్కగా వరుణ్ మోటర్స్ వారి బోర్డు తపని సరిగా కనబడి ఉంటుంది అలాగే మరోప్రక్కగా అమ్మవారి గుడి కూడా చూసే ఉంటారు. వీటిల్లో రెండు వన్ వే దార్లే.

ఇంత సోదెందుకు అంటారా!! అదిగో అక్కడికే వస్తున్నా. మన ముఖ్యమంత్రి పార్దివ శరీరం ప్రస్తుతం వారి ఇంటి దగ్గర ఉంది. అలాగే వీరికి శ్రధ్ధాంజలి ఇవ్వడానికి వచ్చే మంత్రులు, ప్రముఖులు అందరూ చక్కగా బేగం పేట విమానశ్రయంలో దిగి వీరింటికి వెళుతున్నారు. ఇలా వచ్చిన వాళ్ళలో ప్రధాని మన్ మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గార్లు ఉన్నారు. వీరందరికీ ఉన్న ఒకే ఒక దారి సదురు లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. అందువల్ల చాలా టైట్ సెక్యూరిటి. అంతే కాకుండా మా దార్లు రెండూ పోలీసోళ్ళ కభ్జా. మేము బాహ్య ప్రపంచాన్ని చేరుకోవాలంటే ఈ పోలీసోళ్ళను దాటుకుని వెళ్ళాలి. ఏమైనా అంటే లాఠీ ఛార్జీ చెయ్యడమే కాకుండా కాల్పులు కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ చేతుల్లోని రివాల్వర్లను చూసిన జనాలకి మాట పడిపోయి మూగోళ్ళై పోయారు. ఏమైనా అంటే టప్పుక్కున కాల్చేసి విధ్వంసానికి కారణమౌతున్నాడు అందుకే కాల్చేసాం అంటే, అడిగే వాడెవ్వడూ ఉండడు.

పైగా అందరూ z కాటగిరీ ప్రముఖులే. అన్నంత మాత్రాన మా రోజువారి కార్యక్రమాల పరిస్థితేమిటి? మేము బాహ్య ప్రపంచానికి అకర్లేదా .. మాకు బయటి ప్రపంచంతో సంబందాలు అక్కర్లేదా.. మేము ఎక్కడికీ వెళ్ళకూడదా.. మాయింటికి ఎవ్వరు రావాలన్నా వారి పరిస్థితేమిటి? సామాన్య జనం ఈ దారిన వెళ్ళకూడదా?? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?? చెప్పే నాధుడెవ్వడు?

 

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కలవరమాయే పాటలు .. నా అభిప్రాయం

ఈ మధ్య వస్తున్న పెద్ద పెద్ద సినిమాలతో పోల్చుకుంటే, కలవరమాయే సినిమా పాటలు నాకు బాగానే నచ్చాయి. నాకు హితుడు సన్నిహితుడు అయిన గారు ప్రచురించినట్లుగా అని నేను ఒప్పుకోను. ఇక్కడ నా రుచి వీరి రుచి ఒక్కటవ్వాలని రూలు ఎక్కడ లేదు కానీ, సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే కలవరమాయే పాటలు చాల రిచ్ గా ఉన్నాయి. కానీ జోష్ పాటలలో అంతటి సంగీత ధోరణి కనబడ లేదు.

సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ .. అందువల్ల కమర్షియల్ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉన్నాయి జోష్ పాటలు. ఈ బాటలోకే వస్తాయి మగధీర పాటలు కూడా. కొన్ని పాటలు వ్యాపార ధృక్పధం లేకుండా జనాలలోకి చొచ్చుకుని పోతాయి. అలాంటి వాటి కోవలోనిదే, మగధీరా లోని బంగారు కోడి పెట్ట పాట. కానీ మగధీరా పాటలు కూడ నాకు అంతగా నచ్చలేదు.

అదేదో నానుడి చెప్పినట్లు, విశ్వనాద్ గారి సినిమాలు కళ్ళుతో కాదు చూడాల్సింది. మనసుతో చూడాలి అలా అన్నట్లు, సినిమాని సినిమాగా చూడాలి అలాగే మనకు ఎంత గిట్టింది మాత్రమే చూడాలి తప్ప అందులో రసం ఙ్ఞానం(సాంబారు, పులుసు, వగైరా వగైరా..) ఉందా లేదా అని చూడకూడదు. ఆ కోవలోలే, అభిమానులు ఉన్నారు కదా అని మన నాగార్జున గారి కొడుకుని మోసేయ్యడమో.. లేక ప్రజారాజ్యం అధిపతి కొడుకు కాబట్టి చెరణ్ బాగా చేశాడు అని నేను చెప్పలేక పోతున్నాను.

వీరిద్దరి అభిమానులు, నన్ను మన్నించండి. నాకు జోష్ పాటలకన్నా మగధీరా పాటలు బాగున్నాయి. అలాగే మగధీరా పాటలకన్నా కలవరమాయె పాటలు బాగున్నాయి

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

Life అంటే..


మొన్నామధ్య ఓ పెద్దాయనతో మాట్లాడుతూ ఉంటే, ఎదో ఆశువుగా ఇలా దొర్లించారు..

Birth is the start of life..

Beauty is the art of life..

Duty is the part of life..

Death is the last of life..

Responsibility is the source of life..

But, Love is

heart and hope of life

మరి మీరేమంటారు.. ఆ పెద్దాయన లెక్క బాగుందే..

బ్లాగు ప్రపంచం లోకి మరో విశిష్ట వ్యక్తి

ఇదిగో ఈ మధ్యనే మరో రాజకీయ నాయకుడు, "ఒక్క రోజైనా ప్రధాన మంత్రి కావాలన్నదే ధ్యేయంగా రాజకీయ్యాని నడుపుతున్నారు.." అని పిలవబడే మరో విశిష్టమైన వ్యక్తి బ్లాగు ప్రపంచం లోకి ప్రవేశించారు.  ఎవ్వరో అనుకుంటున్నారా.. అదేనండీ మన భారతీయ జనతా పార్టీ ప్రముఖులు, గౌరవనీయులైన లాల్ కృష్ణ అద్వాని. ఆయన మొదటి పుటలోని పలుకులు నాకు బాగా నచ్చాయి. మీరందరూ చదవ వలసిన కొన్ని మంచి మాటలు అందులో ఉన్నాయి. అయన ఏది చేసినా నిర్మొహమాటంగా.. నిర్దయగా.. నిస్పక్షపాతంగా.. తనదైన ముద్ర కలిగి ఉండేలా చేస్తారు. నాకు పుట్టి బుద్దెదిగినప్పటి నుంచి ఈయన చేసిన లేదా పాల్గొన్న చాలా కార్యక్రమాలలో స్వలాభం ఏమీ కనబడలేదు. దేశభక్తికి ఉదాహరణ ఎవరు అని అడిగితే, ఓ రకంగా వీరే అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

 

ఇంతా చెప్పి వీరి బ్లాగు లంకె ఇవ్వలేదను కుంటున్నారా.. ఇదిగో .. http://blog.lkadvani.in/ ఈయన మాటలని కొంచం తర్జుమా చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకులే, ఎలాగో అక్కడ చదువుతారు కదా అని, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. కాకపోతే, వారి ఇప్పటి వరకూ బ్లాగిన విషయాలను దృష్టిలో ఉంచుకుని స్పందిస్తే, అచ్చంగా నాలుగే నాలుగు పుటలు ప్రచురణకు వచ్చాయి. వాటిల్లో రెండు పుస్తకాల గురించే. కొంతలో కొంత చక్కగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఏమిటంటారా.. అదేనండి.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. దాని గురించి. నిజమే, జీవితం అంటే ఎన్నికలు మాత్రమే కాదు కదా అంటూ జీవితానికి పరమార్దం spiritual life, (ఆత్మ .. ఏమనాలో పాలు పోలేదు).

 

ఏది ఏమైనా, విఙ్ఞాన విషయానికి వస్తే చాలా విషయాలు తెలిసి అనర్గళంగా చర్చించే చాలా కొద్ది మంది రాజికీయ నాయకులలో వీరు ఒక్కరు. అంతే కాకుండా బ్లాగు పరంగా సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకున్న మొదటి రాజకీయ నాయకుడని నా అభిప్రాయం. చాలా మంది రాజకీయ నాయకులు కంప్యూటర్‍లను వాడగా చూసాము, కానీ ఇంత బాహాటంగా వ్రాయడం మొదలు పెట్టిన వారు వీరేనని నేననుకోవడం. అమితాబ్ బచ్చన్ గారు కూడ బ్లాగుతున్నారు, కానీ వారి ఎంతైనా ఇప్పుడు వితంతువే కదా.. ఏమిటి!!! అమితాబచ్చన్ వితంతువా అని అనుకుంటున్నారా.. నిజమేనండి.. రాజకీయ్యాలు నాకు పడవు, చేసింది చాలు అని ఉద్వాసన పుచ్చుకున్నారు కదా. నాకు తెలిసి ఆయన తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనుకోను.

 

ఇంతకీ మీరేమంటారు?

ఇది నిజమా..!! ఎలా?

ఏదో పరధ్యానంలో ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. చూసిన తరువాత నమ్మలేక పోయ్యాను. మళ్ళీ మళ్ళి చూసాను. ఒక వేళ ఇందులో కల్పితం ఏమైనా ఉందేమో అని. ఎక్కడా అలాంటి అవకాశం కూడా లేకుండా ఒరిజినల్‍గా ఉంది.

కధలోకి వెళితే, అప్పుడెప్పుడో అమెరికాలోని ఒక సింహాం పిల్ల బేరానికి పెట్టారు. ఈ విషయం ఆనోట ఆనోట ఓ పెద్దాయన చెవిన పడింది. తీరా అక్కడకు వెళ్ళి చూడాపోతే, ఇరుకైన బోనులో బక్క చిక్కిన ఓ సింహం పిల్ల బేలగా ఈయ్యననే చూస్తూ కనబడిందంట. ఇదేదో బాగానే ఉంది అని ఆ పెద్దాయన ఈ సింహం పిల్లని తనతో పాటుగా ఇంటికి తీసుకు పోయాడంట. వీరి ఇంటికి దగ్గర్లోని ఒక చర్చి ప్రాంగణంలో ఈ పులి పిల్లని ఆడుకోనిచ్చారట ఆ చర్చి నిర్వాహకులు. ఈ సింహం పిల్ల అనుకున్న దానికన్నా వేగంగా, త్వర త్వరగా పెరిగి పెద్దదవుతూ ఉన్నంతలో కొంత కాలం తరువాత ఆ పెద్దాయనకు ఓ ఆలోచన వచ్చింది..

ఛా!! సింహం ఏంటీ.. వేటాడక పోవడ మేమిటి!! దాని రాజసమేమైంది.. దాని రాజరికమేమైంది. స్వతహాగా స్వతంత్రంగా అడవిలో తిరగ వలసిన జంతువును, సాధు జంతువుగా మిగిలి పోవలసిందేనా!! పుట్టుకతో వచ్చిన స్వభావం పెంపకంతో మారి వాటి స్వగుణాన్ని, వాటి గుర్తింపును కోల్పోవాలా!!

అన్నదే తడవుగా, ఈ సింహం పిల్లని చక్కగా తీసుకు వెళ్ళి ఆఫ్రికాలో వదిలి వచ్చారు. ఆ తరువాత కొంత కాలానికి, బహుశా దాదాపుగా ఓ సంవత్సర కాలం తరువాత ఆ సింహం పిల్ల ఎలా ఉందో చూద్దాం అనిపించి ఈ పెద్దాయన వెళ్ళారు. అదిగో అప్పుడు తీసిన చిత్రమే ఇది. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠతో చూసాను. చూస్తున్నంత గుండె దిటవు చేసుకుని గమనించాను. కధ అంతా ఆంగ్లంలో ఉన్నా ఎందుకో వ్రాయాలని అనిపించింది.

మమతానురాగాలు ఒక్క మనుష్యులకే స్వంతం అనుకుని విర్రవీగే నాకు, నోరు లేని జీవాలు అందునా వేటాడడమే తత్వంగా, జన్మ హక్కుగా భావించే కౄర జంతువులకు కూడా మనసనేది ఉంటుందనీ, అవి కూడా ప్రేమిస్తాయనీ.. వాటికి కూడా స్నేహం అనేది ఒకటి ఉందనీ, స్నేహితుల విలువ ఏమిటో వాటికి తెలుసనీ.. మనుష్యులు మరియూ వారి సాంగత్యం లోని ప్రేమాప్యాయతలు మాకు అవగతమే అనే భావనను ఈ వీడియో ద్వారా తెలిసింది. మీరేమంటారు?

ప్రస్తుతానికి ఈ వీడియో తొలగించినట్లున్నారు. మీరు యౌతుబే.కం లో "christian the lion" అని గానీ.. "lion reunion" అనిగానీ వెతకండి

నిరీక్షణ నీడలో..

నా కోసం నీవు ..

ఆకాశమయ్యావు..


నీ కోసం నేను ..
నీలి మేఘమే అయ్యాను..


స్పందించిన ప్రతి క్షణం ..
చిరు జల్లుగా మారాను ..


చినుకు చినుకు లో ..
అణువణువు నేనై నిలిచాను ..


వంపు సొంపులగో ..
నీకై వెల్లువగా మారాను ..


నీ అడుగు అడుగు లో నేను ..
సిరిమువ్గా మ్రోగాను ..


ప్రణయ రాగమై నేను ..
నిన్నల్లు కుంటాను ..


అధరాల వణుకులో ..
పరువాల పదం లో ..


నీ జవ్వనిగా ..
నిలచి ఎదురు చూస్తుంటాను ..

తెలుగు సాంప్రదాయం - ఆశ్చర్య పరచే విషయం - సంక్రాంతి

ఈ పుట ఏవిధంగా మొదలు పెట్టాలో అని దాదాపు రెండు రోజులు తల పగిలేలా ఆలోచించా. చివరకి ఏమీ తోచక, ఇదిగో ఇలా. ఇంతకీ చెప్పొచ్చిన విషయమేమిటంటే.. సంక్రాంతి రోజుల గురించి.

తెలుగు పంచాంగం ప్రకారం నా పుట్టిన రోజు ప్రతీ ఆంగ్ల సంవత్సరంలో ఒకే రోజు రాదు. ఎందుకంటే తిధులు, నక్షిత్రాలు, అన్నీ ఒకే రోజు రావు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా, తెలుగు సంవత్సర కాలానికి ఆంగ్ల సంవత్సర కాలానికి చాలా తేడా ఉంది. ఆంగ్ల కొలమానం మన తెలుగు కొలమానానికి చాలా తేడా ఉందన్న విషయం జగద్విదితం. అందువల్ల మన ఆంగ్ల పుట్టిన తారీఖులను తెలుగు తిధులతో పోల్చుకోరాదు. ఏమంటారు?

కానీ ఒక్క విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఉంది. అన్నీ పండుగలూ ఒక తారీఖునే ఖచ్చితంగా రావు. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా జనవరి మాసం 14 / 15 / 16 తారీకులలోనే వస్తుంది. ఎందుకంటారు? ఈ కాలాన్ని ఉత్తరాయణ మరియు దక్షిణాయణ కాలాలు మారే కాలంగా పిలుస్తుంటాం. ఆంగ్ల కొలమానం ప్రకారం ప్రతి రోజులో కొంత కాలం మిగిలిపోతుంది. దాన్ని సరిగ్గా లెక్క వేయడం చేతగాక, వారు ప్రతీ రోజూ మిగిలి పోయిన కాలాన్ని విడిగా పెట్టి, నాలుగు సంవత్సరాలకి ఒక సారి లీపు సంవత్సరంగా లెక్కవేసి, ఫిబ్రవరి మాసంలో ఒక రోజు ఎక్కువ జేసి లెక్కలు సరిగానే ఉన్నాయని పిస్తున్నారు. మరి మన తెలుగు సంవత్సరం లో అధిక మాసమనీ, శూన్య మాసమనీ ఎవో ఎవో లెక్కలు వేస్తారు కదా.. ఎన్ని వేసినా అన్ని పండుగలు ఎందుకు రోజులు మారుతాయి? సంక్రాంతి మాత్రం అదే రోజు ఎందుకు వస్తుందో నాకు అర్దమవని విషయం.

ఈ జగతిలో ఎందరో అతిరధులు, సారధులు, మహారధులు.. మరెందరో మహానుభావులు .. ఎవ్వరైనా ఈ విషయాన్ని వివరించ మని మనవి.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

హక్కు దారులు దొరికారు.. మూల రచయత వివరాలు

ఈ మధ్య నేను ప్రచురించిన ’కధే.. మరచిపోలేకపోతున్నామూడు భాగాల కధ యొక్క మూల రచయత దొరికారు. ఎదో కష్ట పడి నాదైన శైలిలో పెద్ద పొడిచేసా అనుకుంటుండగా, ఈ కధని ఆంద్రజ్యోతిలో నాకన్నా ముందుగా కొల్లూరి సోమ శంకర్ గారు పెరుగన్నం పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ కధ జులై16 వ తారీఖు 2006 వ సంవత్సరంలో అనువాద కధగా ప్రచురిత మయ్యింది. ఈ కధకి మూల రచయత గా మధురై వాస్తవ్యులైన శ్రీధరన్ రంగస్వామి గారిని కొల్లూరి సోమ శంకర్ గారు పేర్కొన్నారు. ’ఆనంద వికటన్’ అనే టైటిల్‍తో మొదటి సారిగా శ్రీధరన్ రంగ స్వామిగారు రచించితే, దాని ఆంగ్ల అనువాదాన్ని 'The Promise' అనే టైటిల్‍తో మొదటి సారిగా 2003 వ సంవత్సరంలో జులై 27వ తారీఖున, బెంగళూరు ప్రాంత పత్రికైన Deccan Herald వారు, ఆ నాటి ఆదివారం అనుభందంలో ప్రచురించారని తెలియ జేసారు.

పైన పేర్కొన్న అంశాలు అన్నీ మీకు ఇండస్‍లేడీస్ వారి వెబ్ సైటు నుంచి చదువుకోవచ్చు. ఈ వైబ్ సైటులోని ఒక చర్చావేదికలో మూలకధను, The Promise గా వారి నిర్వాహకాధికారి, ’శక్తి’ గారు ప్రచురించారు. ఇచ్చట శ్రీధర్ గారు, ’వరలొట్టి’ అనే చిరునామాతో చేసిన వ్యాఖ్యలు కూడా చదవ వచ్చు. బహుశా శ్రీధరన్ రంగ స్వామిగారు నేను ఇలా రెండవ సారి తెలుగులోకి అనువాదించానని అనుకుంటారనుకుంటా. కాబట్టి తమిళం మరియు ఆంగ్లంలో రచించిన శ్రీధరన్ గారికి అంతే కాకుండా తెలుగులోకి మొదటి సారిగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి నా బ్లాగు ముఖంగా విన్న వించుకోదలచిన దేమిటంటే..

అయ్యా.. విఙ్ఞులారా.. నేను ప్రచురించే నాటికి ఈ కధ మూలాలు తెలియ నందున, శ్రీధరన్ గారి మూల కధకు నా సొంత పైత్యాన్ని చేర్చి తెలుగులో (మరోసారి) నాదైన శైలిలో కూర్చడమైనది. ఈ మొత్తం జరిగిన సమయంలో తమరిని ఎమైనా నొప్పించినట్లైతే, పెద్ద మనసుతో క్షమించమని మనవి. వీటి మీద సర్వ హక్కులు తమవే.

ఎదో కొద్దిగా నా బుర్రకు తోచినట్లుగా, కొంచం మసాళా చేర్చడం మినహా, మొత్తం కధా కధనం పైన పేర్కొన్న వారివే. అన్యధా మంచిగా తలుస్తారని ఆశిస్తాను.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కధే.. కానీ, మరచి పోలేనటువంటిది.. మూడవ భాగం

ఇంతవరకూ జరిగింది: ఒక వారాంతం నేను ఆఫీస్ నుంచి త్వరగా రావటం వల్ల, శాంభవీని ఆట్లాడించడానికి పార్కుకు తీసుకెళ్ళాను. పార్కు నుంచి తిరిగి వచ్చిన తరువాత పెరుగన్నం దగ్గర ప్రమాణం. (మొదటి పుట). అన్నీ సద్దు మణిగిన తరువాత శాంభవి గుండు చేయించు కుంటానన్న కోరిక, మా అందరి స్పందన ప్రతి స్పందనలు. ఆఖరుగా ఒప్పుకోలు. (రెండవ పుట). ఒక వేళ మీరు మొదటి పుట, రెండవ పుట చదవక పోతే, నా విన్నపాన్ని మన్నించి, ముందుగా అవి చదివిన తరువాత ఇది చదవండి. ఇదిగో ఇక్కడుంది దీని మొదటి భాగం. ఇది రెండవ భాగం.  ఇక ముందుకు వెళదాం.

---------------------------------

అభయమయితే ఇచ్చెసా గానీ, నా చిట్టి తల్లిని తన నల్లటి పొడుగాటి జుట్టుని లేకుండా చూడ గలనా.. దానికి తోడుగా, నా భార్య, ’ఏంటండీ .. మీరు మాట ఇవ్వడం .. అది అడగడం .. భలే బాగుందే.. మీ వరస. అదేదో చిన్న పిల్ల తెలిసో తెలియకో అడిగిందను కోండి, మంచి మర్యాద లేకుండా మీరు కూడా గంగిరెద్దులాగా తలూపేస్తారా..’ అంటూ యుద్ధాన్ని ప్రకటించింది.

’తెలిసో తెలియకో చిన్నది అడిగింది, ముందు వెనుకలు ఆలోచించ కుండా నెనే మాటిచ్చేసాను. ఇప్పుడు నేను మాట తప్పననుకో, రేపు పెద్దైయ్యాక, అది కూడా నాలాగా మాట తప్పితే నువ్వు భరించగలవా..’, సూటిగా ఒక్కటే ప్రశ్న. అంతే, చిరుబుర్రు లాడుకుంటూ ముందు గదిలోకి దారి తీసింది. ఇంతలో అమ్మ వచ్చే వేళయితే మమ్మల్ని బయటకు పంపించదనే భయంతో, శాంభవిని తీసుకుని, మెల్లగా జారుకున్నా. ధైర్యంగానైతే బయలు దేరాగానీ, మనసులో ఎదో తెలియని భాధ. నా చిట్టి తల్లిని జుట్టు లేకుండా చూడగలనా అన్న అనుమానం, చూసి తట్టుకోగలనా అన్న భయం. మెల్లిగా మంగలి దగ్గరకి చేరుకున్నాక, ఆఖరు సారిగా నా చిట్టి తల్లిని కన్నులారా చూసుకుని, వాడితో చెప్పా.

’కొంచం నెప్పి పుట్టకుండా గుండు చెయ్య గలవా..’ అంటూంటే.. వాడు వింతగా చూసాడు నావైపు.

’సారూ .. నాది ముప్పై సంవత్సరాల అనుభవం.. మీకెందు కండీ, రాండి .. కూకోండి.. మీకు తెలియకుండా గీకేత్తాగా..’ అన్నాడు.

’నాకు కాదు నాయినా .. నా కూతురు కి’ అనగానే, వాడొక వింత చూపు చూసాడు.

’ఏంటి సారూ, చిన్న పిల్లకి జుత్తు చూడబోతె చాలా బాగుంది.. గుండు గీకిత్తున్నారు.. చిన్న పిల్లలన్నాక తప్పులు చెత్తారు .. అంత మాత్రాన ఇంత చిచ్చ వెస్తారా.. వీల్లేదు బాబు.. నాను చెయ్య’ నంటూ మొండి కేసాడు. వాడిని కాస్తా బుజ్జగించి, బ్రతిమాలి, బామాలి, క్రింద మీద పడి, నా చిన్నారికి గుండు చేయించే సరికల్లా తల ప్రాణం తోకకొచ్చింది.

మెల్లగా ఇంటికి చేరుకుని, శాంభవికి దగ్గరుండి శ్నానం చేయించి గుండు నిండా చల్లాగా ఉంటూందని చందనం రాసా. ఇంతలో అమ్మ రానే వచ్చింది. వస్తూ వస్తూనే విషయం తెలుసుకుని, రుద్ర కాళిలా నామీద తోక తొక్కిన పాము పడగ విప్పినట్లు కస్సు బుస్సు లాడింది. కలి కాల మంటూ, నన్నూ.. నా కూతుర్ని అరగంట సేపు తిట్టిన తిట్టు తిట్ట కుండా తిట్టేసింది. మెల్లగా నేను తేరుకునే లోపుల, ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా నాకూతురు చల్లగా జారుకుంది.

శాంభవి ఇంట్లో లేదన్న విషయం మాకు అర్దమయ్యె సరికల్లా ఓ గంట పట్టింది. నాకు మెల్లగా భయం పట్టుకుంది. శాంభవిని వెతుక్కుంటూ రోడ్డు మీదకి బయలుదేరాను. నాకు తెలిసిన రోడ్లన్నీ తిరిగా. ఏక్కడా కనబడలేదు. భయం నన్ను మింగేస్తోంది, లేని పోని ఆలోచనలు మదిలోదూరి మెదడుని తొలిచేస్తున్నంతలో, లీలగా ఎందుకో నిన్న సాయంత్రం జరిగిన విషయం గుర్తుకొచ్చింది. గుండు పిల్లవాడు గుర్తుకొచ్చాడు. అంతే .. ఆఘ మేఘాలమీద అటు వైపు పరిగెత్తా.. నేను వాళింటికి చేరుకునే సరికల్లా .. నాకంట బడ్డ దృశ్యం నన్ను మారు మట్లాడనివ్వలేదు. శాంభవికి ఆ గుండు పిల్లవాడు వీడ్కోలు చెబుతున్నాడు. నా చిన్నారి, నన్ను చుస్తూనే ఎగ్గిరి దూకింది, నేను సిద్దంగా ఉన్నానా లేనా అన్న ఆలోచన చేయకుండా.

శాంభవి మీద వచ్చిన కోపాన్ని ఒక్క సారిగా తమాయించుకుని, ఎక్కడ తొందర పడి మళ్ళి నిన్న రాత్రిలాగా కొడతానో అన్న ఆలోచనతో శాంతించి, నా చిట్టి తల్లిని తనివి తీరా ముద్దాడు తుంటే, వింతగా ఓ చూపు చూసింది. సరే పిల్లల్ని భయపెట్టి పనులు చేయించు కోకూడదు, మంచిగా చెప్పి చేయించు కోవాలని తలంచి, శాంభవికీ క్లాసు పీకే కార్యక్రమాన్ని అప్పటికి వాయిదా వెసేసాను.

అరోజంతా శాంభవీని విడిచి పేట్టి ఉంటే ఒట్టు. ఎదో కోల్పోయామన్న భాధ. ఎదో తెలియని ఆందోళన. ఎం జరుగుతోందో తెలియని ఆవేదన. అన్ని కలసి ఇబ్బడి ముబ్బడిగా నన్ను కలగా పులగం చేసెస్తూ ఉంటే, ఎమి చెయ్యాలో తోచక సాయంకాలం శాంభవిని తీసుకుని పార్కుకు బయలు దెరా. పార్కుకు చేరుకున్నానన్న మాటే గానీ నిన్నటి హుషారు లేదు నాలో. పిల్లలందరూ ఒకరి తరువాత ఒక్కరు చేరుకుంటున్నారు. శాంభవికి గుండు అన్న విషయం వారు గమనించారో లేదొ కానీ వాళ్ళు గమనిస్తున్నారో లేదో అన్న తలంపే నాకు ఒక గిల్టీ ఫీలింగ్. వాళ్ళదేం పట్ట నట్టు యధా విధిగా క్రిందా మీదా మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నాకంట్లో పడ్డాడు ఓ గుండు పిల్లాడు. వాడు కూడా వీళందరితో ఆడుతూ పాడుతూ ఎగిరెగిరి దూకుతున్నాడు. వాడికో వార్నింగ్ ఇదాం అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళేంతలో వాడి తల్లి నిన్నటి నా భాధ్యతను తీసుకున్నట్లుగా.. అందరితో చలాకీగా తిరిగేస్తోంది. మన, తన, పర భేదం లేనట్లుగా అందరినీ తన పిల్లలుగా ఆడిస్తోంది. అంత మంది పిల్లల మధ్యలో వాళ ఆనందాన్ని నేనెందుకు చెడగొట్టాలనుకుని, కొంచం దూరంగా కూర్చోని వాళ్ళను గమనిస్తున్నాను. కాలం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఎనిమిది కావస్తోందన్నట్లుగా చేతి గడియారం చూపిస్తోండంతో మెల్లగా శాంభవిని తీసుకుని బయలుదేరా. నాకు ఆశ్చర్యకరమైన విషయ మేమిటంటే, రాత్రి అవ్వస్తున్నా ఆ గుండు పిల్లాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. వాడి గురించి ఆలోచించడం మానేస్తే నాకే మంచిదని తలంచి, శాంభవి ని తీసుకుని ఇంటి వైపు అడుగులేసా.

ఎదో గతికా మన్నట్లుగా భోంచేసి, శాంభవీని పొట్ట మీద పడుకోబెట్టుకుంటూ పడక్కుర్చీలో మేను వాల్చా. నా స్తితి అర్దం చేసుకుందెమే, అమ్మ నా ప్రక్కకు చేరి, ’ నాయనా .. ఒంట్లో బాగోలేదా.. అన్నం సరిగా తినలేదు..’ అంది.

’ఏం లేదమ్మా.. శాంభవికి కొత్తగా ఆ వింత కోరిక ఎందుకొచ్చిందా అన్న ఆలోచనలో కొంచం కఠినంగా వ్యవహరించాను.’

’పోనీలేరా.. అయ్యిందేదో అయ్యింది, ఇక ముందు జాగర్తగా ఉంటే చాలు. మన పిల్ల మన మాట వింటే అదే పదివేలు. జుట్టు దేముంది ఇవ్వాళ పోతే రేపొస్తుంది’ అని సముదాయిస్తుంటే, భద్రకాళిలా చిందులేసిన మహాంకాళేనా ఈవిడ అని నాకు అనుమానమొచ్చింది. నిద్రలోకి జారుకున్న శాంభవీని తన చేతుల్లోకి తీసుకుని, ’ వెళ్ళి పడుకోరా.. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్‍కి వెళ్ళాలి కదా’ అంది. నిజమే కదా అనుకుంటూ శాంభవీకి రెండు ముద్దులిచ్చి, అమ్మ చేతిలో పెట్టా.

నిద్రలేమితో ఉన్న నాకు ఆ రాత్రి, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. ఉదయాన్నే నిద్రలేవగానే అనుకున్నా, శాంభవిని దగ్గరుండి స్కూల్ దగ్గర దించాలని. అనుకున్నదే తడవుగా, నా అలోచనని అర్దాంగికి చెప్పెసి, భోజనాన్ని సిద్ధం చెయ్యమంటూ ఒక ఆజ్ఞ జారీచేసేసా. త్వర త్వరగా తయారయ్యి, శాంభవీని స్కూల్ దగ్గర దించడానికి తయ్యారయ్యా. నేను తనని దించి వెళతానన్న విషయం తెలుసుకున్న శాంభవి చలాకిగా తన పనులన్నీ తనే చేసేసుకుంటూ నాతో సమానంగా సిద్ధమయ్యింది.

స్కూలు గేటు దగ్గర దించి సాగనంపు తున్నంతలో, అదే గుండు పిల్లవాడు కారులో దిగుతూ కనబడ్డాడు. వీడిక్కడెందుకు తగలడ్డాడా అని అనుకుంటు ఉంటే.. నా చిట్టి తల్లి వాడిని పిలిచి చెయి చేయి కలుపుని చెంగు చెంగున లోపలికి దూసుకేళ్ళి పోయింది. ఇదెక్కడి పీడరా బాబూ అనుకున్నంతలో, కారులోంచి ఆ గుండుగాడి తల్లి తండ్రి మెల్లగా నా దగ్గరకు చేరుకున్నారు. వారి కళ్ళలో నీరు ఉబికి ఉబికి వస్తున్నట్లున్నాయి. బలవంతంగా ఆపుకుంటున్నట్లున్నారు.

’ఏమండీ .. శాంభవీని కన్న మీరు కారణ జన్ములు. మీకు మీ శాంభవీకి చేతులెత్తి మొక్కాలి’, అంటూ ఉంటే.. నేనేమి వింటూన్నానో నాకేమి అర్దం కావటంలేదు.

’నిన్న సాయంత్రం మీ గురించి వెతికే లోపే మీరు ఇంటికెళ్ళి పోయ్యారు..’ ఆ గుండుగాడి తల్లి అంటోంది.

’మీరు వెళ్ళి పోయ్యారు అనేకన్నా, మేము తేరుకునే సరికి చాలా రాత్రి అయ్యిందంటే బాగుంటుంది.’ ఆ తల్లి గొంతు పూడకపోయింది

’నిజంగా నండి’, అపిల్ల వాడి తండ్రి అందుకున్నాడు. ’ మావాడు ల్యుకేమియా అనే వ్యాధితో భాధ పడుతున్నాడు. ఆ వ్యాధి కోసం వాడిన మందులు మరియూ కెమో ధెరపీ దుష్‍ప్రభావం వల్ల, వాడి నెత్తిన జుట్టు పూర్తిగా రాలిపోయింది. దీంతో మా వాడు ఆత్మ న్యూనతా భావంతో ఎవ్వరితో కలవలేక ఒంటరి వాడై పోయ్యాడు. దానితో, వాడు ఎక్కడికీ తీసుకెళదాం అన్నా రావటం లేదు. సైకాలకిస్టుని సంప్రదిస్తే, ఇది ఒక మానసిక వ్యాధి అని ఇదీ మందులతో సరి అవ్వదని చెప్పాడు. మేము గత ఐదు నెలలుగా ఎంత ప్రయత్నించినా మావాడు ఇల్లు వదిలి రావటం లేదు. అట్లాంటి రోజుల్లో మీ అమ్మాయి మా అబ్బాయిని గత వారంలో యాదృశ్చికంగా కలిసింది. మా వాడిని ఎవ్వరూ గేలి చెయ్యకుండా తాను చూసుకుంటానని మాట ఇచ్చి, వాడితో స్నేహం చేస్తుంటే, ముందు మాకే భాధేసింది. మా వాడిని మార్చడం కోసం మీ అమ్మాయి ఇంత పని చేస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఇంతటి త్యాగ మూర్తిని కన్న మీరు ధన్య జీవులు’ అంటూ .. రోడ్డు అని కూడా గమనించ కుండా కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతున్న దంపతుల్ని చూస్తున్న నాకు నా చిన్నారి ఎంత ఎదిగి పోయిందో అనిపించింది.

అంతటి సున్నిత మనస్కురాలినా నేను కొట్టింది అన్న అలోచన నన్ను ఆశాంతం దహించి వేసింది. ఇదంతా తెలుసుకున్న నేనూ ఏడుస్తోంటే.. ఎమి జరిగిందో తెలియక వారూ తడబడ్డారు. కొద్ది సేపటికి తెరుకున్న నేను మనసులో..

’చిట్టి తల్లీ.. ఎంతటి నిస్వార్ద ప్రేమ నీది. ప్రేమలో పరమార్దమే గానీ, అర్దముండదని నాకు నేర్పిన గుణపాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను. నిన్ను శిక్షించిన నన్ను ఆ దేవుడు నన్నెందుకు శిక్షించలేదా..’ అని భాధ పడ్డా. ఎప్పుడో చదివిన కొన్ని మాటలు గుర్తుకొచ్చాయి.

The happiest people on this planet are not those who live on their own terms, but are those who change their terms for others inspire others.

-----------------------------------------------

ఆఖరున, ఈ మొత్తం కధానిక నాకు forward గా వచ్చిన ఒక మాస్ మైల్ నుంచి అని గమనించగలరు. మీకూ ఇట్లాంటిదే ఒకటి వచ్చి ఉంటుంది. కధ కొంచమే, దాని చుట్టు అల్లిన పరిస్తితులు అన్ని నా స్వంతం. కాళిదాసు కవిత్వం కొంచం, దానికి తోడు మన పైత్యం కొంచం అన్నట్లుగా అస్సలు దాని చుట్టు నేను కల్పించుకున్న కధానికే ఇది. ఎలా ఉంది?


-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్

కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

భోజనం - భొజరాజు

నా చిన్నతనంలో చాలా కధలు విషయాలు మా తాతగారి వద్ద, మరికొన్ని మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్నాను. వాటిల్లోంచి ఒకటి మీ కోసం ఇలా..

ఏమిటి?? భోజనమంటున్నాను.. అలాగే భొజరాజంటున్నాను .. అనుకుంటున్నారా!!! ఈ రెండింటికీ ఎక్కడ కలుస్తుందనుకుంటున్నారా??? తలపగలు కొట్టుకోండి. ఈ రేంటికీ ఎక్కడ పొంతన లేదు. కానీ ఆహారం విషయానికొస్తే, ఈ రోజుల్లో, హైదరాబాదు వంటి నగరాల్లో.. ప్రతీ సుభకార్యానికీ, ఎక్కువగా బఫేలు పరిపాటై పోయింది. అట్లాంటి బఫె నే ఈ నాటి నా ఈ పుటకి మూల కారణం. బఫే అనబడే ఈ తంతు, నక్కని చూసి .. (అయ్యొయ్యో.. పులిని చూసి నక్క అని అనాలికదా.. ఎదోలేండి.. ) అన్నట్లుగా.. "హైదరాబాదులో మా చుట్టాలు.. క్రిందటిసారి వాళింటిలో సుభకార్యం జరిగినప్పుడు, ఇలాగే పెట్టారు .." అని ప్రక్క ఊళ్ళలో ఉన్నవారుకూడా ఇదే పద్దతిని పాటించేస్తున్నరు. అదిగో అలాగే, క్రిందటి ఏడాది, విజయవాడలో కొన్ని పెళ్ళిళకు వెళ్ళి నప్పుడు ఒకటి రెండు సార్లు,  బఫె భొజనం చేసినట్లు గుర్తు.

ఇక అసలు విషయానికొస్తే.. భోజరాజుకి ఒకనాడు గొప్ప అవమానం జరిగింది. అదేమిటంటే.. తన దగ్గర పనిచేసే ఒక పరిచారకుడు రహస్యంగా ఎవ్వరికో ఉత్తరం వ్రాసుండగా, ఈ రాజుగారు చాటుగా దానిని చదవుతున్నారంట. ఇది గ్రహించిన అతను రాజుగారు చదువుతున్నరన్న విషయం, తాను గ్రహించినట్లుగా రాజుగారు పసి గట్టినట్లైతే బాగుండదు కదా అని, తెలియనట్లుగా ఉన్నట్లుంటూనే, కొంచం తుంటరిగా ఉత్తరం మధ్యలో ముగించెస్తున్ననంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఒక మనో నిబ్బరం లేని ఒక వెధవ కూడా ఈ ఉత్తరాన్ని చదువుతున్నడు కనుక మిగిలిన విషయాలు తరువాత ఉత్తరంలో వ్రాస్తానని ముగించేసాడు. అంతట ఆ రాజు గారు, తనను ఒక వెధవగా పోల్చినందులకు చింతించి, తదుపరి తన సభలోకి వచ్చే వారందరినీ, "మూర్ఖా..!!" అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. సభలోకొచ్చిన ప్రతీ వ్యక్తీ దీనికి ఆశ్చర్య చతికులై, రాజుగారికి ఎదురు చెప్పలేక, మౌనంగా ఆ అవమానాన్ని దిగ మింగు కుంటునారు. ఇది రాజుగారికి కొంత ఊరట నిచ్చినట్లైంది. ఇంతలో మహాకవి కాళిదాసుగారు రంగ ప్రవేశం చేసారు. రాజు గారు యధా ప్రకారం వీరిని కూడా.. "మూర్ఖా!!" అంటూ సంభొదిచే సరికి, మన మహాకవి గారు సంస్కృతంలో క్రింద చెప్పినట్లు చెబుతారు

ఖాద న్న గస్చామి, హాస న్న భాష్యే
గాతం న షోచామి, కృతం నా మన్యే
ద్వభాయం తృతియొ న భవాని రాజన్
కిమ్ కారణమ్ భొజ భవామి మూర్ఖః

దీని అర్ద మేమిటనిన.. నేను నడుస్తూ భుజించను, పొట్ట చెక్కలయ్యెలా నవ్వుతూ మాట్లాడను, ఇద్దరు తగువు లాడు కుంటుండగా మధ్యలో జేరి ఇద్దరి చేత వెధవగా నేననిపించుకోలేదు.. (ఇలా ఇలా ఇంకా ఎదో ఎదో అర్దం దాగి ఉంది. నాకు గుర్తున్నంత వరకూ ఇంతే.. మీలో ఎవ్వరైనా సంస్కృతం తెలిసిన వాళైతే దీని పూర్తి తాత్పర్యం తెలియజేసిన యడల చాల రుణ పడి ఉంటాను). ఇన్ని విషయాలలో నేను మూర్ఖుడిని కాదని ఋజువు అయినందున, నన్ను ఏవిధంగా మూర్ఖుడిని చేసావు .. ఓ రాజా?? అని తిరిగి ప్రశ్నించారు.

తరువాత కధ ఇప్పటికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అవసరమయిన విషయమేమిటంటే.. మూర్ఖులందరూ నడుస్తూ భొజనం చేస్తారన్నది, మహాకవి కాళిదాసుగారి అభిప్రాయం. ఈ విషయమం నాకు చిన్నపుడే నూరి పోసారు కనుక, వృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్‍లు, గట్రా గట్రా, వగైరా వగైరా వంటి వాటికి వెళ్ళ వలసి వచ్చినప్పుడు, చక్కగా ఒక మూల చూసుకుని, చేతిలోని ప్లేటుని దానిమీద పెట్టుకుని భొంచేస్తాను. ఇంతే కాకుండా, మా కార్యాలయంలో నా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బల్ల నేను వెళ్ళే సమయానికి సిద్దంగా ఉంటుంది.

మొన్నీ మధ్య, ఎవ్వరి బ్లాగులోనో ఒక విషయాని ప్రస్తావించడం జరిగింది. దానిని ఇక్కడ మరొక్క సారి సవినయంగా మీతో పంచుకుంటాను..

ఎలాగోలా బ్రతికేయ్యాలంటే, ఎలాగైనా బ్రతికేయ్యవచ్చు. కానీ ఇలాగే బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలన్నీ..

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

అర్దం, పరమార్దం - అపార్దం

కొత్తపాళీగారు ఈమద్య, మీ జీవిత పరమార్దమేమిటని సూటిగా ముక్కు పగిలేటట్టు ఒక్కటిచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయాల్ని పొందుపరిచే ముందుగా, ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

  • రాకేశ్వరరావుగారెమో.. బ్రతుకు పోరాటంలో గెలిచి, వంశాభివృద్ది చేసుకోవడమన్నారు
  • రమణిగారేమో.. మనసులోనిమాటని చల్లగా, మెల్లగా.. బ్రతికినంతకాలం ఆనందంగా జీవించేయగలగడం అన్నారు
  • నెటిజన్‍గారెమో.. తన అర్దభాగం దురమయినప్పుడు అంటూ ఎదో చెప్పారు.. నేనేమో తెలుగు వాడినాయే.. మనదా అంత అంత మాత్రం ఆంగ్ల పరిఙ్ఞానమాయే.. ఎదో అర్దం అయ్యి అవ్వనట్లుంటే.. ఎందుకయినా మంచిదని తలకెక్కించుకోలేదు.
  • దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారేమో విశాఖతీరాన కూర్చుని, ఏమి తెలియదంటూ తెలుకోవాలన్నారు. అంతేగాక, తనను తాను తగ్గించుకుంటూ, ఎదుటివారిలో మనల్ని చూసుకోవడమేకాక, కొంచం .. మరికొంచం.. ఇంకొంచం.. అనుకుంటూ మంచితనాన్ని పెంచుకోవడమే మన అందరి పరమావిధి అంటూ ముగించారు.
  • చావా కిరణ్ గారెమో.. ఇప్పుడంత అవసరమా అంటూ చురకేసారు
  • అప్పిచ్చువాడు.. అదేనండీ.. వైద్యుడు .. డా:రాములుంగారు.. (అయ్యా!! అన్యధా భావించకండి) ఇచ్చిపుచ్చుకోవడంలోనే అంతా ఉందన్నారు
  • సాలభజింకలు పేరుతో బ్లాగ్ చేసే పప్పు నాగరాజుగారేమో.. జీవితమంతా ఒక అనంతమయిన కార్పెట్ (తెలుగులో ఏమంటారో తెలియ లేదు..) లాంటిది, అది విప్పుతూ పోవడం అనేది ఒక వ్యర్ద ప్రయాస అనడమేకాక.. జీవిత పరమార్దం తెలియజేయడమంటే.. అసాద్యాయానికి కొంచం అటూ.. ఇటూ.. గా అంతేనన్నారు.
  • నాగ మురళిగారేమో.. తన గత స్మృతులు తలచుకుంటూ.. జీవితం అంటే ఒక గొప్ప అద్బుతం అంటూ.. దాని పరమార్దమేమిటో దాటవేశేశారు.
  • గార్లపాటి ప్రవీణ్‍గారు, దాదాపు సంవత్సరం క్రిందట తనకూ ఇట్లాంటి ఆలోచన వచ్చిందనీ.. ఆకాలంలో తాను ప్రచురించిన పుటనే, తన ఆత్మ శోధించే ప్రశ్నగా పేర్కొన్నారు. దానికి ఎందరో మహానుభావులు తదనుగుణంగా స్పందించారు. ఆ పుట ఆధారంగా.. ఆనాటికి, ప్రవీణ్‍గారి చిట్టాలో వారి పెండ్లి (ఆలోచన, క్షమించాలి..) లక్ష్యం లేదన్నట్లు తెలియజేసారు.. ప్రస్తుతానికి ఓ ఇంటివాడై అంతేకాకుండా సతీసమేతంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం
  • బ్లాగాడించేస్తా నంటున్న రవిగారేమో.. ఇలాంటి ఆలోచనలు తనకెప్పుడొచ్చినా, జిడ్డుకృష్ణ మూర్తిగారి రచనలు చదివేస్తానంటూ.. ఏది ఏమైనా సాధారణంగా గడపడమే ఉత్తమం అన్నారు.
  • వికటకవిగా ప్రచురించే శ్రీనివాసు గారేమో తనకూ అప్పుడప్పుడు ఇలాంటి స్థితే వస్తుందనీ.. అందులో పెద్దగా పట్టించుకోవడానికి ఏమిలేదంటూనే.. ఎవ్వరో మహానుభావుడన్నట్లు.. పరోపకార్ధం మిదం శరీరం అని స్పందించారు.
  • ఓనమాలుగా ప్రచురించే లలితగారు.. జీవిత పరమార్దం జీవించడమే తప్ప మరొకటి కాదన్నారు.
  • చెరశాల రేణుకా ప్రసాద్ గారేమో మొదటగా స్పందించిన రాకేశ్వరవుగారితో ఏకీభవిస్తూనే.. తన అంతరంగంలోని మాటని, నలుగురన్నట్లుగా.., నిస్వార్ధ ప్రేమ + సుఖాన్ని (మాత్రమే) పంచుకోవడం + వగైరా.. వగైరాగా తెలియజేసారు.
  • రె లైటనింగ్ గా ప్రచురిస్తున్న కిరణ్‍కి.. అస్సలు జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయితే.. దాని పరమార్దం మరో చిక్కు వీడని.. లేదా చిక్కు తియ్యలేని మరో ప్రశ్న కాబట్టి.. వేటి గురించి ఆలోచించుకుండా.. జీవితమే ఒక ఆట అనుకుంటూ ఆడేయ్యంటున్నారు.
  • గిరీష్ గారేమో కొంచం వేదాంతంగా.. ఎటువంటి ఆశలు / కోరికలు లేకుండా జీవించేయ్యడమే ఈ జీవిత పరమార్థం మంటూ .. నదులను జలాసాయాలను ఉదహరిస్తూ ఒక పుటని ప్రచురించారు
  • శ్రీనివాస్ గారికేమో జీవితాశయానికి మరియు జీవిత పరమార్థానికి తేడా అంతగా లేదంటూనే, మన ప్రమేయం లేనిది అంతేకాక తప్పకుండా ఉండి తీరాల్సినదే జీవిత పరమార్ధమని స్పందిచారు
  • గార్ల నవీన్ గారికి అనుకోకుండా గత శ్మృతులు గుర్తుకొచ్చి, ఆనాటి నుంచి తానూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరితపిస్తున్నానంటూ.. అందరిలోనూ మంచే చూస్తూ జీవించేస్తే అంతా ఆనందమయమవుతుందంటున్నారు.
  • దైవానిక గారేమో సంతృప్తిగాఅ జీవించడమే జీవితపరమార్ధం అంటున్నారు
  • సుజాతగారేమో తన మనసులోని మాటను సున్నితంగా, పరోక్షంగా... పరోపకారానికే ఓటేశెసారు

హమ్మయ్య..!! ఇప్పటికి రెండు రోజులుగా చేసిన ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఇక ఇప్పుడు నా వంతు.

ఒక రకంగా నేను చావా కిరణ్ గారితో ఏకీభవిస్తాను. మనకిప్పుడు ఈ విషయం అవసరమా..?!!#$%^&*.. ఎదో కడుపు నిండుగా.. ఇంటి పట్టున తిన్నగా.. ఉధ్యోగ వేళలలో చల్లగా బ్రతికేస్తున్న మనకు ఈ ఆలోచన అవసరమా??? ఈ విషయానికి సమాధానం వెతికేముందు, అస్సలు ఈ ప్రశ్న మొలకెత్తడానికు గల కారణాలు సోధిద్దాం

మొదటిది : ఇట్లాంటి ఆలోచనలు, పని లేని వేళలలో మొలకెత్తుతాయి.. ఆంగ్లంలో చెప్పినట్లు.. Idle man's brain is devil's workshop. ఎదో పనిలో పడ్డామనుకోండి, ఇలాంటి విషయాల వైపు అస్సలు దృష్టి సారించము.

రెండవది : పొట్ట కూటి కోసం రోజంతా కష్ట పడే కూలీలు ఇలాంటివి ఆలోచించరు, ఎందుకంటే.. పగలంతా పనిచేసిన మీదట, రెండు సారా చుక్కలు గొంతులోకి దిగిన తరువాత ఒళ్ళు నెప్పులు కాస్తా మత్తులో లెక్కచెయ్యరు. తదుపరి, కడుపు నిండా కలో.. గంజో.. కంటి నిండా నిద్ర.. ఇలా పనిచేసుకుంటూ, బ్రతకడానికే సమయం లేనివాడు ఇలాంటి ఆలోచనలు చెయ్యడు. ఇలాంటి ఆలోచనలు... "నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. " అంటూ పాడుకునే మధ్య తరగతి వాళ్ళకు తప్ప మరింకెవరికీ రావని మనం గుర్తించాలి.

మూడవది : ఆత్మావలోకనం చేసుకునే చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని అనిపిస్తుందనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.. ఇలాంటి వారు పేద, మధ్య , ధనికులే కానక్కరలేదు. స్వయం ప్రత్తిపత్తి కలిగి, కరిగి పోయే కాలాన్ని ఏవిధంగా వినియోగించు కోవాలనే తాపత్రయం కలిగిన వాళందరూ ఈ వ్యాధిఘ్రస్తులే..

ఈ ప్రశ్న సమాధానికోస్తే.. ఏనాడో, ఒక మహానుభావుడన్నట్లు.. మానవసేవయే మాధవ సేవగా భావించుకుంటూ.. పరోపకారం మిదం శరీరం అని భావించడమే కాకుండా, ఉన్నంతలో (వీలు) కలిగి నంత పంచుకుంటూ పోవడమే అని తెలుసు కోగలరు. ఇక్కడ మరొక విషయం తనకు మాలినది ధర్మం పనికిరాదని కూడా మర్చిపోరాదు.

ఇంతే సంగతులు..

భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

 
Clicky Web Analytics