సాక్షి వార్తాపత్రికపై నా అభిప్రాయం - రెండవది

గత కొన్ని రోజులుగా సాక్షి దిన పత్రికను క్రమం తప్పకుండా చదువుతున్నాను. గతంలో మాదిరిగా కంటే, ఇప్పుడు ఎక్కువగా అధికార పక్ష పత్రికగా అనిపిస్తోంది. ఎంతైనా తండ్రిగారిని, వారి ప్రభుత్వాన్ని కాదనలేరు కదా!!! ఈ పత్రిక ద్వారా ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకు అర్దమవుతున్నాయనేది మాత్రం నగ్న సత్యం. కాకపోతే, ఊరికే పంచి పెట్టే పామ్‍ప్లేట్లను డబ్బులిచ్చి కొన్నుక్కుంటున్నట్లుంది. ఏది ఏమైనా చక్కగా కనులకు విందుగా బాగానే ఉంది.

ఇవాళ్టి విషయానికొస్తే.. పేపర్ బాయిస్ మీద మొదలు పెట్టిన వ్యాసం పేజీ తిప్పగానే వార్తాహరులు వైపు, రచనా వ్యాసాంగం రంగాలలో పనిచేసే వారి జీతభత్యాల వైపు మళ్ళించారు. కానీ రెండు పేజీలలోనూ ఉన్న ఫొటోలు మాత్రం పేపర్ బాయిస్‍వే వెయ్యడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. పైకి మాత్రం పెపర్ బాయిస్ గురించి అన్నట్లనిపించేలా ఉన్న చిత్రలను చూసి భంగపడ్డాను. తీరా అందులో అస్సలు విషయమల్లా ఏమిటంటే.. సాక్షి మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఇందులో పని చేసే వారి జీతాలు పెరిగినాయంటూనే, ప్రతి పక్షాల్లాంటి ప్రత్యర్దుల పని వారి జీత భత్యాలు పెరగటం లేదని ముగించారు. వ్యాపారమన్నాక ఆ మాత్రం ఒడి దుడుకులు ఉండవక తప్పదు కదా!! ఈ మాత్రం దానికే అంత పెద్ద ఆర్టికల్ వ్రాసేయ్యాలా??

ఏది ఏమయినా, ఈ మధ్య సాక్షి వారికి వార్తలు తగాయనడంలో ఎంతో కొంత నిజంమేననీ, ఇదంతా స్థలాన్ని పూరించుకోవడానికె చేస్ ప్రయత్నాలనేది సత్య దూరాలు కావు. వీరు తోందరలోనే కొన్ని పేజీలను తొలగించేసి, పత్రికా పేజీల సంఖ్యను తగ్గించేస్తారనుకోవడం, అతిశయంకాదు. వీటన్నింటి లోకి నాకు నచ్చిన ఒక విషయమేమిటంటే, ప్రధాన పత్రిక చివ్వరి పేజీలో ఒక మంచి మాటను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ తతంగం ఎలా ఉందంటే, బాలమురళీ సుబ్రమణ్యం గారు నిర్వహించే కార్యక్రమం, పాడాలని ఉంది లో చివరగా బాలుగారు ఒక మంచి విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటారు. అదే తరహాలో వీరు చివ్వరి పేజీలో చక్కగా ఒక చిన్న విషయాన్ని సున్నితంగా తెలియజేస్తున్నారు.

చుద్దాం ఇక ముందు వీరు ఏవిధంగా మారతారో.. అంతవరకూ.. సెలవు..

క్షమించాలి.. బాల సుబ్రమణ్యంగారిని, బాల మురళి గారిగా ప్రచురించినందులకు.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

భోజనం - భొజరాజు

నా చిన్నతనంలో చాలా కధలు విషయాలు మా తాతగారి వద్ద, మరికొన్ని మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్నాను. వాటిల్లోంచి ఒకటి మీ కోసం ఇలా..

ఏమిటి?? భోజనమంటున్నాను.. అలాగే భొజరాజంటున్నాను .. అనుకుంటున్నారా!!! ఈ రెండింటికీ ఎక్కడ కలుస్తుందనుకుంటున్నారా??? తలపగలు కొట్టుకోండి. ఈ రేంటికీ ఎక్కడ పొంతన లేదు. కానీ ఆహారం విషయానికొస్తే, ఈ రోజుల్లో, హైదరాబాదు వంటి నగరాల్లో.. ప్రతీ సుభకార్యానికీ, ఎక్కువగా బఫేలు పరిపాటై పోయింది. అట్లాంటి బఫె నే ఈ నాటి నా ఈ పుటకి మూల కారణం. బఫే అనబడే ఈ తంతు, నక్కని చూసి .. (అయ్యొయ్యో.. పులిని చూసి నక్క అని అనాలికదా.. ఎదోలేండి.. ) అన్నట్లుగా.. "హైదరాబాదులో మా చుట్టాలు.. క్రిందటిసారి వాళింటిలో సుభకార్యం జరిగినప్పుడు, ఇలాగే పెట్టారు .." అని ప్రక్క ఊళ్ళలో ఉన్నవారుకూడా ఇదే పద్దతిని పాటించేస్తున్నరు. అదిగో అలాగే, క్రిందటి ఏడాది, విజయవాడలో కొన్ని పెళ్ళిళకు వెళ్ళి నప్పుడు ఒకటి రెండు సార్లు,  బఫె భొజనం చేసినట్లు గుర్తు.

ఇక అసలు విషయానికొస్తే.. భోజరాజుకి ఒకనాడు గొప్ప అవమానం జరిగింది. అదేమిటంటే.. తన దగ్గర పనిచేసే ఒక పరిచారకుడు రహస్యంగా ఎవ్వరికో ఉత్తరం వ్రాసుండగా, ఈ రాజుగారు చాటుగా దానిని చదవుతున్నారంట. ఇది గ్రహించిన అతను రాజుగారు చదువుతున్నరన్న విషయం, తాను గ్రహించినట్లుగా రాజుగారు పసి గట్టినట్లైతే బాగుండదు కదా అని, తెలియనట్లుగా ఉన్నట్లుంటూనే, కొంచం తుంటరిగా ఉత్తరం మధ్యలో ముగించెస్తున్ననంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఒక మనో నిబ్బరం లేని ఒక వెధవ కూడా ఈ ఉత్తరాన్ని చదువుతున్నడు కనుక మిగిలిన విషయాలు తరువాత ఉత్తరంలో వ్రాస్తానని ముగించేసాడు. అంతట ఆ రాజు గారు, తనను ఒక వెధవగా పోల్చినందులకు చింతించి, తదుపరి తన సభలోకి వచ్చే వారందరినీ, "మూర్ఖా..!!" అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. సభలోకొచ్చిన ప్రతీ వ్యక్తీ దీనికి ఆశ్చర్య చతికులై, రాజుగారికి ఎదురు చెప్పలేక, మౌనంగా ఆ అవమానాన్ని దిగ మింగు కుంటునారు. ఇది రాజుగారికి కొంత ఊరట నిచ్చినట్లైంది. ఇంతలో మహాకవి కాళిదాసుగారు రంగ ప్రవేశం చేసారు. రాజు గారు యధా ప్రకారం వీరిని కూడా.. "మూర్ఖా!!" అంటూ సంభొదిచే సరికి, మన మహాకవి గారు సంస్కృతంలో క్రింద చెప్పినట్లు చెబుతారు

ఖాద న్న గస్చామి, హాస న్న భాష్యే
గాతం న షోచామి, కృతం నా మన్యే
ద్వభాయం తృతియొ న భవాని రాజన్
కిమ్ కారణమ్ భొజ భవామి మూర్ఖః

దీని అర్ద మేమిటనిన.. నేను నడుస్తూ భుజించను, పొట్ట చెక్కలయ్యెలా నవ్వుతూ మాట్లాడను, ఇద్దరు తగువు లాడు కుంటుండగా మధ్యలో జేరి ఇద్దరి చేత వెధవగా నేననిపించుకోలేదు.. (ఇలా ఇలా ఇంకా ఎదో ఎదో అర్దం దాగి ఉంది. నాకు గుర్తున్నంత వరకూ ఇంతే.. మీలో ఎవ్వరైనా సంస్కృతం తెలిసిన వాళైతే దీని పూర్తి తాత్పర్యం తెలియజేసిన యడల చాల రుణ పడి ఉంటాను). ఇన్ని విషయాలలో నేను మూర్ఖుడిని కాదని ఋజువు అయినందున, నన్ను ఏవిధంగా మూర్ఖుడిని చేసావు .. ఓ రాజా?? అని తిరిగి ప్రశ్నించారు.

తరువాత కధ ఇప్పటికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అవసరమయిన విషయమేమిటంటే.. మూర్ఖులందరూ నడుస్తూ భొజనం చేస్తారన్నది, మహాకవి కాళిదాసుగారి అభిప్రాయం. ఈ విషయమం నాకు చిన్నపుడే నూరి పోసారు కనుక, వృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్‍లు, గట్రా గట్రా, వగైరా వగైరా వంటి వాటికి వెళ్ళ వలసి వచ్చినప్పుడు, చక్కగా ఒక మూల చూసుకుని, చేతిలోని ప్లేటుని దానిమీద పెట్టుకుని భొంచేస్తాను. ఇంతే కాకుండా, మా కార్యాలయంలో నా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బల్ల నేను వెళ్ళే సమయానికి సిద్దంగా ఉంటుంది.

మొన్నీ మధ్య, ఎవ్వరి బ్లాగులోనో ఒక విషయాని ప్రస్తావించడం జరిగింది. దానిని ఇక్కడ మరొక్క సారి సవినయంగా మీతో పంచుకుంటాను..

ఎలాగోలా బ్రతికేయ్యాలంటే, ఎలాగైనా బ్రతికేయ్యవచ్చు. కానీ ఇలాగే బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలన్నీ..

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

ప్రవర్తన - పరివర్తన, భావం - స్వభావం

నేను ఈ మధ్య చదివిన ఒక బ్లాగు పుటలో, సదురు స్వంతదారుడు తన అభిప్రాయాన్ని చక్కగా అందమయిన భాష్యంలో తెలియజేసినారు. ఆది ఏ బ్లాగు, ఏ విషయమది అనునటువంటి విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అసలు విషయమల్లా.. ఆ పుటకు స్పందించిన వ్యక్తులలో నేను ఉన్నాను. నాతో పాటుగా మరొక వ్యక్తి.. ఈ క్రింది విధంగా స్పందించారు.

... టైపులో చాల పుట్టుకొచ్చాయి. chain schemes మరి డేంజర్. ఆ మధ్య *** అని ఒ లం* కొ** (naa కొ**ది hyderabad అనుకొంటా) కోట్లల్లో జనాలని ముంచాడు. ఇంకో లం* కొ** (ఆ లం* కొ**ది కూడా హైదరాబాదీ) books ని CD లోకి ఎక్కించే HOME BASED WORK అని (ఈ నా కొ** BANK EMPLOYEE). చాల మంది చాల పోగుట్టుకొన్నారు. అలాగే CHARMINAR, KRISHI ... ఈ లం* కొ**లందరికి HYDERABAD వాళ్ళు భలే దొరుకుతారు ..

కొన్ని విషయాలను ఆ బ్లాగు రచయత తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆ బ్లాగు ప్రచురించిన రచయతకు ఈ స్పందన చదివిన తరువాత ఎటువంటి భావన కలిగినట్లు లేదు.. చక్కగా ఉన్నదున్నట్లుగా publish చెసేసారు, కొంచం కూడా moderate చెయ్యకుండా. ఇది చదివిన తరువాత, నా మనసుకు కొంచం భాధ కలిగి, సదురు స్పందించిన వ్యక్తికి విడిగా ఆయన వ్యక్తిగత మెయిల్‍కి క్రింది విధంగా ఒక విన్నపాన్ని తెలియజేసాను.

నా పేరు చక్రవర్తి, నేను మీరు స్పందించిన తీరుపై, నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి, మీకు ప్రత్యెకంగా ఉత్తరం వ్రాయుచుంటిని. మీ స్పందనకు ముందు నేను స్పందించాను, గమనించగలరు. మీ పదజాలం లోని కొన్ని అసంమజసంగా ఉన్నవి. దయచేసి, ఇక మీదట తమరు అటువంటి పదజాలం వాడరని ఆశిస్తున్నాను. మీరు ఉదహరించిన సదరు *** అనేటటువంటి వ్యకి మంచి వాడు కాదనుకుందాం, అతను చేసిన తప్పుకి అతని తల్లిని 'లం*' అని సంభోదించడం ఏ మాత్రం వివేకం .. మీకు కచ్చి ఉంటే అతనిని తిట్టండి అంతేకాని అతని తల్లి తండ్రులను అనవసరంగా అపార్దం చేసుకోవడం ఎంత మాత్రం భావ్యమో ఆలోచించగలరు.
అన్యధా మంచిగా ఆలోచిస్తారని, నన్ను + నా అభిప్రాయాన్ని తప్పుగా భావించరని ఆశిస్తూ..

దీనికి ఎంత త్వరగా బదులు వచ్చిందంటే.. బహుశా.. ఒక రెండు గంటల వ్యవధిలో ఈ క్రింది విధంగా తిరుగుటపా వచ్చింది.

నమస్కారం, మహా కవి శ్రీ శ్రీ, ఇంకా చాల మంది చాలా, చాలా పుస్తకాలలో , సినిమాలలో వాడారు. నేను కొత్తగా ఈ పదాలు వాడ లేడు- కనిపెట్టలేదు . గమనిచగలరు. SORY. నేను అటువంటి పదాలను వాడకుండా ఉండలేను.
BEST REGARDS

ఈ తిరుగు టపా చదివిన తరువాత నాకు నోటివెంట మాటలేదు. ఏమిటిది?? ఎవ్వరితో పోలిక??? మహాకవి శ్రీ శ్రీ గారు వాడారు కదా అని మనం నిరబ్యంతరంగా ఇట్లాంటి పదాలను వల్లించ వచ్చా??? మనలో ఉండవలసిన తెలివి తేటలేమయినట్లు?? మనలో ఉండవలసిన వివేకమేమయినట్లు?? పెద్దవాళ్ళు ఎదో తప్పుచేసారనుకోండి, అటువంటి తప్పు మనంకూడా తప్పకుండా, తప్పు చేయవలెనా??? కందుకూరి వీరేశలింగం పంతులుగారు వితంతువునైనా గౌరవించాలని చెప్పిన మంచికి ఎటువంటి విలువలేదా??

ఇవన్నీ ఒక ఎత్తైతే, వయస్సుతో పాటు పెరగవలసిన పెద్దరికమేమయినట్లు?? కొంచమయినా హుందాగా బ్రతకాలి అన్న ఆలోచనలేకుండా, 3rd grade people లా ప్రవర్తించిన ఇట్టి మనుషులను ఏమి చేయ్యాలో అర్దం కావడంలేదు. వీరు మంచిగా.. మర్యాదగా మారతారని నేను కలలో కూడా ఊహించలేను. వీరే ఇలా ఉంటే, వీరి ఇంట పుట్టి పెరిగిన పిల్లలు ఏవిధంగా తయారవుతారో ఊహించుకుంటే.. దేవుడా.. వారిని, వారి వారి సహచరులను నువ్వే కాపాడుమని వేడుకోవడం మినహా .. ఏమీ చెయ్యలేను. కానీ ఒక్కటి మాత్రం చెయ్యగలను.. మా తాతగారు బ్రతికున్నరోజులలో చెప్పిన మాట ఒకటి వీరిలాంటి వారికి నూటికి నూరు శాతం వర్తిస్తుంది..

దుశ్టులు, దుర్మార్గులు,స్త్రీలను గౌరవించడం చేతకానివారు, అమర్యాదగా ప్రవర్తించే వారు.. ఇలా కొంచం పెద్ద లిస్టే ఉంది.. వీరంతా మనం విసర్జించేటటువంటి మల మూత్రాలతో సమానం. పెంట మీద రాయి వేశామనుకోండి ఏమి జరుగుతుందో తెలుసుకదా.. అటువంటప్పుడు, అట్లాంటి వారితో మనకి పనేమిటి?? దూరంగా ఉంటే పోలా.. మనకూ మంచిది.. వారికీ మంచిది.

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

అర్దం, పరమార్దం - అపార్దం

కొత్తపాళీగారు ఈమద్య, మీ జీవిత పరమార్దమేమిటని సూటిగా ముక్కు పగిలేటట్టు ఒక్కటిచ్చారు. ఈ విషయం మీద నా అభిప్రాయాల్ని పొందుపరిచే ముందుగా, ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

  • రాకేశ్వరరావుగారెమో.. బ్రతుకు పోరాటంలో గెలిచి, వంశాభివృద్ది చేసుకోవడమన్నారు
  • రమణిగారేమో.. మనసులోనిమాటని చల్లగా, మెల్లగా.. బ్రతికినంతకాలం ఆనందంగా జీవించేయగలగడం అన్నారు
  • నెటిజన్‍గారెమో.. తన అర్దభాగం దురమయినప్పుడు అంటూ ఎదో చెప్పారు.. నేనేమో తెలుగు వాడినాయే.. మనదా అంత అంత మాత్రం ఆంగ్ల పరిఙ్ఞానమాయే.. ఎదో అర్దం అయ్యి అవ్వనట్లుంటే.. ఎందుకయినా మంచిదని తలకెక్కించుకోలేదు.
  • దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారేమో విశాఖతీరాన కూర్చుని, ఏమి తెలియదంటూ తెలుకోవాలన్నారు. అంతేగాక, తనను తాను తగ్గించుకుంటూ, ఎదుటివారిలో మనల్ని చూసుకోవడమేకాక, కొంచం .. మరికొంచం.. ఇంకొంచం.. అనుకుంటూ మంచితనాన్ని పెంచుకోవడమే మన అందరి పరమావిధి అంటూ ముగించారు.
  • చావా కిరణ్ గారెమో.. ఇప్పుడంత అవసరమా అంటూ చురకేసారు
  • అప్పిచ్చువాడు.. అదేనండీ.. వైద్యుడు .. డా:రాములుంగారు.. (అయ్యా!! అన్యధా భావించకండి) ఇచ్చిపుచ్చుకోవడంలోనే అంతా ఉందన్నారు
  • సాలభజింకలు పేరుతో బ్లాగ్ చేసే పప్పు నాగరాజుగారేమో.. జీవితమంతా ఒక అనంతమయిన కార్పెట్ (తెలుగులో ఏమంటారో తెలియ లేదు..) లాంటిది, అది విప్పుతూ పోవడం అనేది ఒక వ్యర్ద ప్రయాస అనడమేకాక.. జీవిత పరమార్దం తెలియజేయడమంటే.. అసాద్యాయానికి కొంచం అటూ.. ఇటూ.. గా అంతేనన్నారు.
  • నాగ మురళిగారేమో.. తన గత స్మృతులు తలచుకుంటూ.. జీవితం అంటే ఒక గొప్ప అద్బుతం అంటూ.. దాని పరమార్దమేమిటో దాటవేశేశారు.
  • గార్లపాటి ప్రవీణ్‍గారు, దాదాపు సంవత్సరం క్రిందట తనకూ ఇట్లాంటి ఆలోచన వచ్చిందనీ.. ఆకాలంలో తాను ప్రచురించిన పుటనే, తన ఆత్మ శోధించే ప్రశ్నగా పేర్కొన్నారు. దానికి ఎందరో మహానుభావులు తదనుగుణంగా స్పందించారు. ఆ పుట ఆధారంగా.. ఆనాటికి, ప్రవీణ్‍గారి చిట్టాలో వారి పెండ్లి (ఆలోచన, క్షమించాలి..) లక్ష్యం లేదన్నట్లు తెలియజేసారు.. ప్రస్తుతానికి ఓ ఇంటివాడై అంతేకాకుండా సతీసమేతంగా జీవిస్తున్నాడని ఆశిద్దాం
  • బ్లాగాడించేస్తా నంటున్న రవిగారేమో.. ఇలాంటి ఆలోచనలు తనకెప్పుడొచ్చినా, జిడ్డుకృష్ణ మూర్తిగారి రచనలు చదివేస్తానంటూ.. ఏది ఏమైనా సాధారణంగా గడపడమే ఉత్తమం అన్నారు.
  • వికటకవిగా ప్రచురించే శ్రీనివాసు గారేమో తనకూ అప్పుడప్పుడు ఇలాంటి స్థితే వస్తుందనీ.. అందులో పెద్దగా పట్టించుకోవడానికి ఏమిలేదంటూనే.. ఎవ్వరో మహానుభావుడన్నట్లు.. పరోపకార్ధం మిదం శరీరం అని స్పందించారు.
  • ఓనమాలుగా ప్రచురించే లలితగారు.. జీవిత పరమార్దం జీవించడమే తప్ప మరొకటి కాదన్నారు.
  • చెరశాల రేణుకా ప్రసాద్ గారేమో మొదటగా స్పందించిన రాకేశ్వరవుగారితో ఏకీభవిస్తూనే.. తన అంతరంగంలోని మాటని, నలుగురన్నట్లుగా.., నిస్వార్ధ ప్రేమ + సుఖాన్ని (మాత్రమే) పంచుకోవడం + వగైరా.. వగైరాగా తెలియజేసారు.
  • రె లైటనింగ్ గా ప్రచురిస్తున్న కిరణ్‍కి.. అస్సలు జీవితమే ఒక పెద్ద ప్రశ్న అయితే.. దాని పరమార్దం మరో చిక్కు వీడని.. లేదా చిక్కు తియ్యలేని మరో ప్రశ్న కాబట్టి.. వేటి గురించి ఆలోచించుకుండా.. జీవితమే ఒక ఆట అనుకుంటూ ఆడేయ్యంటున్నారు.
  • గిరీష్ గారేమో కొంచం వేదాంతంగా.. ఎటువంటి ఆశలు / కోరికలు లేకుండా జీవించేయ్యడమే ఈ జీవిత పరమార్థం మంటూ .. నదులను జలాసాయాలను ఉదహరిస్తూ ఒక పుటని ప్రచురించారు
  • శ్రీనివాస్ గారికేమో జీవితాశయానికి మరియు జీవిత పరమార్థానికి తేడా అంతగా లేదంటూనే, మన ప్రమేయం లేనిది అంతేకాక తప్పకుండా ఉండి తీరాల్సినదే జీవిత పరమార్ధమని స్పందిచారు
  • గార్ల నవీన్ గారికి అనుకోకుండా గత శ్మృతులు గుర్తుకొచ్చి, ఆనాటి నుంచి తానూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరితపిస్తున్నానంటూ.. అందరిలోనూ మంచే చూస్తూ జీవించేస్తే అంతా ఆనందమయమవుతుందంటున్నారు.
  • దైవానిక గారేమో సంతృప్తిగాఅ జీవించడమే జీవితపరమార్ధం అంటున్నారు
  • సుజాతగారేమో తన మనసులోని మాటను సున్నితంగా, పరోక్షంగా... పరోపకారానికే ఓటేశెసారు

హమ్మయ్య..!! ఇప్పటికి రెండు రోజులుగా చేసిన ప్రయత్నానికి ఒక రూపం వచ్చింది. ఇక ఇప్పుడు నా వంతు.

ఒక రకంగా నేను చావా కిరణ్ గారితో ఏకీభవిస్తాను. మనకిప్పుడు ఈ విషయం అవసరమా..?!!#$%^&*.. ఎదో కడుపు నిండుగా.. ఇంటి పట్టున తిన్నగా.. ఉధ్యోగ వేళలలో చల్లగా బ్రతికేస్తున్న మనకు ఈ ఆలోచన అవసరమా??? ఈ విషయానికి సమాధానం వెతికేముందు, అస్సలు ఈ ప్రశ్న మొలకెత్తడానికు గల కారణాలు సోధిద్దాం

మొదటిది : ఇట్లాంటి ఆలోచనలు, పని లేని వేళలలో మొలకెత్తుతాయి.. ఆంగ్లంలో చెప్పినట్లు.. Idle man's brain is devil's workshop. ఎదో పనిలో పడ్డామనుకోండి, ఇలాంటి విషయాల వైపు అస్సలు దృష్టి సారించము.

రెండవది : పొట్ట కూటి కోసం రోజంతా కష్ట పడే కూలీలు ఇలాంటివి ఆలోచించరు, ఎందుకంటే.. పగలంతా పనిచేసిన మీదట, రెండు సారా చుక్కలు గొంతులోకి దిగిన తరువాత ఒళ్ళు నెప్పులు కాస్తా మత్తులో లెక్కచెయ్యరు. తదుపరి, కడుపు నిండా కలో.. గంజో.. కంటి నిండా నిద్ర.. ఇలా పనిచేసుకుంటూ, బ్రతకడానికే సమయం లేనివాడు ఇలాంటి ఆలోచనలు చెయ్యడు. ఇలాంటి ఆలోచనలు... "నా తరమా భవ సాగర మీదను నళిన దళేక్షణ రామా .. " అంటూ పాడుకునే మధ్య తరగతి వాళ్ళకు తప్ప మరింకెవరికీ రావని మనం గుర్తించాలి.

మూడవది : ఆత్మావలోకనం చేసుకునే చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని అనిపిస్తుందనడంలో ఏమత్రం అతిశయోక్తి లేదు.. ఇలాంటి వారు పేద, మధ్య , ధనికులే కానక్కరలేదు. స్వయం ప్రత్తిపత్తి కలిగి, కరిగి పోయే కాలాన్ని ఏవిధంగా వినియోగించు కోవాలనే తాపత్రయం కలిగిన వాళందరూ ఈ వ్యాధిఘ్రస్తులే..

ఈ ప్రశ్న సమాధానికోస్తే.. ఏనాడో, ఒక మహానుభావుడన్నట్లు.. మానవసేవయే మాధవ సేవగా భావించుకుంటూ.. పరోపకారం మిదం శరీరం అని భావించడమే కాకుండా, ఉన్నంతలో (వీలు) కలిగి నంత పంచుకుంటూ పోవడమే అని తెలుసు కోగలరు. ఇక్కడ మరొక విషయం తనకు మాలినది ధర్మం పనికిరాదని కూడా మర్చిపోరాదు.

ఇంతే సంగతులు..

భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

 
Clicky Web Analytics