ఎస్ ఎమ్ ఎస్ వచ్చిన ఓ జోక్

ఇవ్వాళ ఉదయం ఓ ఎస్ ఎమ్ ఎస్ జోక్ వచ్చింది. ఇది ఇప్పటికి ఓ వంద సార్లు వచ్చి ఉంటుంది. ఇది నాకు నచ్చలేదు కాని చాలా మంది పడి పడి నవ్వారు అని చెప్పకపోయినా ఎంజాయ్ చేసారు అని మత్రం చెప్పగలను. మీకు నచ్చుతుందనుకుంటాను

కొడుకు : అమ్మా! ఇవ్వాళ స్కూల్ దగ్గర ఓ అంకుల్ కనబడి నేను నీ నాన్నను అని అన్నాడు, నాకు భాధగా మరియు అనుమానంగా అలాగే అవమానంగా ఉంది

అమ్మ : వొరేయ్, నువ్వేమీ ఫీల్ అవ్వకు. అది నిజం కాదు, ఆయన మీ అన్నయ్యకు నాన్న అంతే గాని నీకు కాదు

తెరాసా వారి దృష్టిలో బతుకమ్మ బొమ్మ మాత్రమేనా

ఈ మధ్య తెరాసా వారు కొటి బతుకమ్మ పూజలు చెసినట్టు మా అఫీసులో ఓ ఇద్దరు మాటాడుకుంటుంటే ఏమిటదా అని ఆసక్తికలిగి అటువైపు చెవ్వి సారించి ఆలకించిన పిదప నా భావనని ఇదిగో ఇక్కడ యధాతధంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది తెరాసా వారికి నచ్చకపోతే అది వారి దురదృష్టం.

ఎవ్వరో ఏదో చేసారని మనం కూడా చేద్దాం అని ప్రయత్నిస్తే అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంటుంది. అదే విధంగా తెరాసా వారు మేము ఉన్నాం అని తెలియ జేయ్యాలన్నట్టు ఏమి చెయ్యాలో తెలియక ఏదో చేద్దాం అని పూనుకుని మొదలు పెట్టినదే ఈ కోటి బతుకమ్మల పూజలు. నాకు వీరి ప్రయత్నం అసందర్బంగాను అనుచితంగాను అనిపించింది.

నేను బేగంపేటలో దాదాపు ఓ పదేళ్ళకు పైగా నివశిస్తున్నాను. ప్రతీ సంవత్సరం ఇక్కడ ఉన్న బస్తీ వాసులు బతుకమ్మ పండుగ దినాలలో ఎన్నెన్ని కలశాలు నెత్తిన పెట్టుకుని ఫ్లైఓవర్ ప్రక్కనే ఉన్న గుడికి వెళతారో నాకు బాగా తెలుసు. కానీ ఈ సారి తెరాసా వారికి భయపడ్డారా అన్నట్లుగా చాలా తక్కువమంది బహిరంగంగా గుడికి వెళ్ళి వచ్చారు. ఈ పదేళ్ళలో ఇంత తక్కువ మొత్తంలో జనాలు బతుకమ్మని జరుపుకున్న వైనం అక్కడి పూజారులకు కూడా మింగుడు పడలేదు. దీనంతటికీ తెరాసా వారు ఈ పండుగని రాజకీయ్యం చెయ్యడమే కాకుండా వారే భాద్యులని మరోలా చెప్పనక్కర లేదు.

అంతే కాకుండా, పెద్దపెద్ద రహ దారుల కూడలిలో పెద్ద గంపని బోర్లా పెట్టి దాని చుట్టూ ప్లాస్టిక్ పూలు తగిలించి మేము కోటి బతుకమ్మలు జరిపాం అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా చెయ్యడం ఎంతో భక్తితో మరెంతో శ్రద్దతో బతుకమ్మ పూజలు చేసే వారి మర్యాదని మంట కలిపిన్నట్టైంది. రాజకీయనాయకుల విగ్రహాలకు కనీసం ఒక్కసారైనా పూజాదికార్యక్రమాలు చెయ్యక పోయినా కనీసం పూల దండ అయినా వేస్తారు, కానీ తెరాసా వారు స్థాపించిన బతుకమ్మ రూపాలను పట్టించుకున్న నాధుడు లేడు. ఇలా ప్రవర్తించడం వీరు బతుకమ్మని ఒఠి బొమ్మగా మాత్రమే భావిస్తున్నారని చెప్పకనే చెబుతున్నారు, మన తెరాసా నాయకులు.

శవరాజకీయ్యాలను చూసాం కానీ దేవుడితో రాజకీయ్యం చెయ్యడం ఒక్క తెరాసా వారికి మాత్రమే చెల్లింది. నా దృష్టిలో తెరాసా వారికి గౌరవించడం ఎలాగూ చేతకాదు దానికి తోడు అగౌరవపరచడం మాత్రం బ్రహ్మాండం బద్దలైయ్యేటట్టు తెలుసు.

ఆఖరిగా తెలంగాణా వారికి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో ఒక్క సారి తలచుకోండి..

హైదరాబాద్ వాసులు సలహా ఇవ్వండి

అమెరికా ప్రయాణం నాకు అచ్చి రాలేదు. ఇప్పటికి రెండు సార్లు వెళాను. రెండు సార్లు నాకు హార్ట్ ఏటాక్ ఇచ్చింది. నా అమెరికా ప్రయాణ ఫలితాలగురించి మరోసారి వ్రాస్తాను. అప్పటిదాకా నా ప్రస్తుత భాధని పంచుకోండి.

నాకు పెళ్ళైన తరువాత మొదటిసారిగా మా మామగారు నా భార్యని కాపురానికి పంపించేటప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నందు అక్కడికే తీసుకు రమ్మన్నాను. అలా కాపురం పెట్టినప్పుడు మొట్ట మొదటి సారిగా విడిగా ఇల్లు తీసుకోవడం అవసరం అయ్యింది. అప్పటిదాకా బాచ్‍లర్లమే కదా అందుకని నలుగురు స్నేహితులు కలసి ఉండే వాళ్ళం. ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. సరే పెళ్ళైంది కదా అని కాపురం నిమిత్తం ఇళ్ళు వెతకగా బేగంపేటలోని బ్రాహ్మణ వాడలోని ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‍మెంట్ ఖాళీగా ఉన్నట్టు తెలిసి చూడాటానికి వెళ్ళగా.. అదిగో అప్పుడు తగిలింది మొదటి దెబ్బ.

అద్దె ఇళ్ళు చూపించే బ్రోకర్ వెధవేమో అద్దే ఐదువేలు రెండు నెలల అడ్వాన్స్ అని ఇల్లు చూపించాడు. ఓనరేమో అద్దె అయిదు వేల ఐదు వందలు మూడు నెలల అడ్వాన్స్ అలాగే అయిదువందల యాభై మైంటెనన్స్ అని చెప్పాడు. పరస్పర చర్చల తరువాత ఓనర్ చెప్పినట్టే చెయ్యాల్సి వచ్చింది. ఇక 2006 వ సంవత్సరంలో అక్టోబర్ రెండో తారీఖు రానే వచ్చింది. వస్తూ వస్తూ భార్యని తెచ్చింది. అలా మొదలైంది మా కాపురం.

అయిదు వేల అయిదు వందల అద్దెతో మొదలైన మా కాపురం ఈనాడు ఎనిమిదివేల అయిదు వందలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వచ్చే సమస్య ఏముంది. ఇదిగో అనుకోకుండా రెండోసారి అమెరికా ప్రయాణం. తిరిగి వచ్చిన తరువాత మా ఓనర్ చావు కబురు చల్లగా చెప్పాడు. మీరు అమెరికా వెళ్ళి వచ్చారుగా ఓ రెండు వేలు అద్దె పెంచండి. అలాగే ఏప్రియల్ నెల నుంచి ఎరియర్స్ కూడా ఇవ్వండి అని. అప్పుడు తెలిసింది ఇంటి అద్దె పెంచడానికి ఉన్న కారణం నేను అమెరికా వెళ్ళి రావడం అన్న మాట.

ఈ నెలాఖరులోగా నేను మరో ఇల్లు చూసుకోవాలి అన్న ప్రయత్నంలో మొదటగా మా సహోద్యోగులు ఉండే ప్రాంతం అయిన నిజాంపేట్ విలేజికి వెళ్ళి మొన్న శనివారం చూసి వచ్చాను. నిజాం పేట విలేజి రోడ్డు మీదకి దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా అద్దెలు చుక్కలనంటుతున్నాయి. అలా ఈ వారాంతం అంతా రోడ్లు సర్వే చెయ్యడమే సరిపోయింది. అన్నట్లు చెప్పడం మరిచా.. రోడ్డుకి ఒకవైపున ఉన్న కూకట్ పల్లిలో చూడడమే కాకుండా మరో ప్రక్కన కూడా చూడడం జరిగింది. మలేషియా టౌన్‍షిప్ వెనకాల ప్రాంతం కూడా వెతకాను. ఎవ్వరూ తొమ్మిది వేలకు తక్కువ చెప్పటం లేదు.

అలాగే నిన్న కూకట్ పల్లి ప్రాంతలో తిరిగాను. అక్కడ కొన్ని పాత అపార్ట్‍మెంట్స్ ఎనిమిది వేలకు దరిదాపుల్లో ఉన్నా రోడ్డుకి కొంచం దూరంగా ఉన్నాయి. నాకు హితులైన మరో తెలుగు బ్లాగరు నాకు ఓ సలహ ఇచ్చారు. ప్రస్తుతం మీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ అంటున్నావు కాబట్టి, ఒకవేళ నువ్వు కనుక కూకట్ పల్లి లో ఇల్లు తీసుకుంటే ప్రయాణ భారం నీకు ఎక్కువౌతుంది. కాబట్టి నీకు యూసఫ్ గుడా కానీ, వెంగళరావు నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, మోతీ నగర్ పరిసర ప్రాంతాలైతే బాగుంటుంది అని విశ్లేషించారు. వారి విశ్లేషన కొంతవరకూ నాకు సబబుగానే అనిపించింది

అందు వల్లన హైదరాబాద్ లో ఉన్న సహ తెలుగు బ్లాగర్లకు మనవి. మీకు తెలిసిన ఏరియాలో ఏవైనా ఖాళీలు ఉన్న యెడల నాకు తెలియ జేయండి. నాకు ఉన్న ఒకే ఒక రిక్వైర్ మెంట్ ఏమిటంటే, జూబ్లిహిల్స్ లో ఉన్న మా ఆఫీస్ కు కొంచం దగ్గరా ఉంటే కొంచం సులువౌతుంది. అలాగే ఖర్చు ఎక్కువగా లేకుంటే బాగుంటుంది. ఈ పోస్టు ద్వారా మీ అమ్యూల్యమైన కాలాన్ని దుర్వినియోగం చేసానని మీకు అనిపిస్తే, మన్నించండి. వీలైతే సమాచారాన్ని తెలియ జేయమనవి.

నన్ను మీరు 944 14 18 139 నందైనా సంప్రదించ వచ్చు లేదా varthy@gmail.com కు ఓ జాబు వ్రాయండి. భవదీయుడు వెంఠనే స్పందిస్తాడు. అంతవరకూ ఓపికగా చదివినందులకు నెనరులు.

ఉచితం అవకాశం

Deekshita

Myntra.com వారు వారి వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ కూపన్ విలువ 249/- రూపాయలు. దీనిని నేను ఓ మగ్ కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాను. అలాగే మనం కొనుక్కునే మగ్ ని మనం కస్టమైజ్ చేసుకునే అవకాశం మనకి ఉంది. నేను మా అన్నయ్య పిల్లల బొమ్మని అక్కడ వేయించుకుని ఆర్డర్ చేసాను. నాకు ఇంత వరకూ ఆ కప్ రాలేదు కానీ అలా ఆర్డర్ చేసుకున్న చాలా మంది మా ఆఫీస్ లో కలీగ్స్ కి మగ్స్ వచ్చాయి.

కాకపోతే ఇక్కడ ఓ చిన్న ట్రిక్ ఉంది. కప్పు మాత్రం ఉచితం, కాని దానిని మీకు చేరవేయ్యాలంటే, ఆ కప్పుకి అయ్యే దారి ఖర్చులక్రింద ఓ యాభై రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే షిప్పింగ్ చార్జ్ అన్నమాట. యాభై రూపాయలు నాకు పెద్ద ఖర్చుగా అనిపించలేదు. ఎందుకంటే, నిజ్జంగా నాకు ఆ కప్పు కనుక వస్తే, కప్పు ఖరీదే ఓ ఇరవై రూపాయలు ఉండవచ్చు అదీకాక దానిపైన చక్కగా మా అన్నయ్య పిల్లల బొమ్మలు ఉంటాయి కదా !! అది సెంటిమెంట్.. అలా ఓ చక్కని మగ్ యాభై రూపాయల విలువని మింగేసింది. మీరు ఓ ట్రై చేసి చూడండి.

తకిట తకిట

takita 

ఓ మంచి సినిమా. చాలా కాలం తరువాత మరో కుటుంబ సమేత సినిమా చూసాను అనిపిస్తోంది. సినిమాకి తగ్గట్టుగా భూమిక ఓ మంచి పాత్ర పోషించింది. సున్నితమైనటువంటి కధాంశంతో మృదువైన స్టోరీలైన్ కలిగిన సినిమా. పిల్లలలో ఇంత సత్ హృదయం నింపాలంటే, పెద్దలలో ఎంత ఓర్పు ఉండాలో, ఎంత సహనం ఉండాలో కదా. ఈ సినిమాని ఎవ్వరు దర్శకత్వం వహించారో గాని చాలా బాగా చేసారు. కధా రచయత బాగా వ్రాసారు. ప్రతీ సీన్ కు తగ్గట్టుగా మాటలు వ్రాసారు. నాకు పూరి జగన్నాద్ తీసిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా గుర్తుకు వచ్చింది. ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, పూరి మనస్తత్వం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనుష్యులంతా మంచి వాళ్ళు అని అనుకుంటాడు. అలాగే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు సున్నిత మనస్కులై వైలెన్స్ గురించి ఆలోచించరు అని నా అభిప్రాయం.

ప్రతీ కధలో ఓ విషాదం ఉన్నట్టు, ఈ కధలో కూడా ఓ విషాదం పెట్టి కొంచం రక్తి కట్టించారు అని అనలేను కానీ సుహాసిని స్వరూప్ ల ఆత్మహత్య నాకు నచ్చలేదు. వారి కధకి కూడా ఓ మంచి ముగింపు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఈ ప్రియులు వ్రాసిన ఆఖరి లేఖలో కొన్ని డైలాగులు చాలా భాధాకరంగా ఉన్నా, చొంగ కార్చుకునే యదవలు అవకాశం కోసం ఎదురు చూస్తునే ఉంటారు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి కాని అవకాశం దొరికింది కదా అని చేతులేసి అసహ్యంగా ప్రవర్తించడం ఎంత భాధాకరమో ఆ మాటల్లో తెలిసింది. నిజంగా చెప్పాలంటే, ఈ మాటలే చాలా భాధాకరంగా ఉన్నాయి. అలాంటిది అనుభవించాల్సి వస్తే.. తలచుకోవాలంటే భయంగా ఉంది. ఈ మాటల్లో చెప్పదలచుకున్నది ఎంతవరకూ నిజ సమజంలో ఉన్నదో అని చెప్పలేకపోయినా, ఎంతో కొంత మాత్రం రాక్షసులు మాత్రం ఉన్నారని నా అభిప్రాయం. ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ వ్రాస్తే నాకు మంచి మాటలు రావు.. పాయింట్ దెబ్బతింటుంది.

హీరో పాత్రని పూర్తిగా వైలెన్స్ లేకుండా తీర్చిదుద్దడం బాగుంది. అలాగే కన్న కూతుర్ని కాకుండా ఊరూ పేరూ లేని వెంగళప్పాయిని నమ్మే తల్లి తండ్రులకు చురక పెట్టిన సీన్ అదిరింది. నాన్నా నన్ను నమ్మండి, అంటూ ఏడుస్తూ పలికిన అమ్మాయిని, అలాగే ఆ తండ్రిని చూస్తుంటే, ఆ అమ్మాయిలోని అమాయకత్వం ఆ తండ్రిలోని భధ్యత ప్రస్పుటంగా కనిపించాయి. ఆడపిల్లలున్న ప్రతీ తండ్రీ పిల్లల్ని ఏవిధంగా పెంచాలో కొన్ని కొన్ని భాధ్యతాయుతమైన పాయింట్స్ చూపించారు. అన్నింటికీ మించి యాసిడ్ పోద్దాం అన్న ఆలోచనతో లాబ్ నుంచి యాసిడ్ తీసుకు వస్తున్న సమయంలో భూమిక పైన తీసిన సన్నివేశం నాకు తెగ నచ్చింది. అబ్బాయిని రెండు లెంపకాయలిచ్చి, కోపంగా ఉందా.. అయితే నామీద కూడా పోయ్ రా .. అని ప్రశ్నించడం చాలా సబబుగా సన్నివేశానికి తగ్గట్టుగా ఉంది. ఆ తరువాత డైలాగులైతే అద్దిరాయ్.. నీ చెంపపై నేను కొట్టినప్పుడున్న నొప్పి ఇప్పుడు లేన్నట్టుగా నువ్వు యాసిడ్ పోసిన శరీరం పైన అయిన గాయం కాలానుగుణంగా మానిపోతుంది, కాని మనసుపై చేసిన గాయాన్ని మాన్పలేవు .. అన్న పోలిక సందర్బానుచితంగా ఉంది.

అన్నింటికీ మించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది అనేది  సరి అయినది. మీరు చూడండి.

 
Clicky Web Analytics