వ్యాపార సలహా - సత్యం కంప్యూటర్స్

షేర్ మార్కెట్ విఫణిలో నిన్న జరిగిన పరిణమాలు జగద్విదితమే. రామ లింగ రాజు నెల కొల్పిన "సత్యం కంప్యూటర్స్" షేర్ విలువ పూర్తిగా పడి పోయింది. ఒక్క సారిగా రెండు వందల రూపాయిల దగ్గర్నుంచి ముప్పై రూపాయిలకు పడి, క్రొద్దిగా పెరిగి నలభై రూపాయల దగ్గర ముగిసింది. జర బద్రం ... చాలా చాలా విషయాలు తేట తెల్లం అవుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి వాళ్ళు సత్యం కంప్యూటర్స్ వ్యాపార లావాదేవీలను నిలిపి వేశారు. అలాగే మన నేషనల్ స్టాక్ ఎక్సేంజి వాళ్ళు కూడా ఈ స్టాక్‍ను డీలిస్ట్ చేసేశారు. ఇప్పుడు ఒక్క బొంబాయి స్టాక్ ఎక్సేంజి లో మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయి. నిన్నటి వ్యాపార లావాదేవీలు ముగిసే నాటికి ఈ స్టాకు విలువ దాదాపు 40/-.

ప్రస్తుత కాల పరిస్తితులను దృష్టిలో ఉంచుకుని విశ్లేషిస్తే, ఈ షేరు ధర దాదాపుగా పది రూపాయలు దిగువకు చేర వచ్చని వ్యాపార నిపుణుల అంచనా. అందుకని, కొంచం ఓపికతో వేచి ఉండండి. లేదా షేర్ మార్కెట్ లో నష్టాలు చవి చూసిన వారు, స్వల్ప వ్యవధి (అంటే కొన్ని నిమిషాలలో) ఎంతో కొంత సంపాదించుకుని జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలను కుంటే, ఈ షేర్ చక్కగా ఉపయోగ పడుతుంది. అందుకని తొందర పడి, ఈ షేర్ నందు పెట్టుబడి పెట్టకండి. ఒక్క రెండు మూడు రోజులు ఆగి నిర్ణయం తీసుకోండి, మీ నష్టాలను పూడ్చుకోండి. తిరిగి ఈ షేర్ లావాదేవిలు మొదలవుతాయి.

ఇప్పటికే సత్యం కంప్యూటర్స్ షేర్‍ను రిలయన్స్ కాపిటల్‍గా వ్యవహరించే ఊహా గానాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా, ఈ సంస్థని మరో యాజమాన్యం పునరుద్ధరించే పనిలో పడడం ఒక రకంగా శుభ సూచకమే. త్వరలో మళ్ళీ లావాదేవీలు మొదలువుతాయని ఆశిద్దాం. అంత వరకు ఈ షేర్‍ని ఈ కంటితో కనబెడుతూ ఉండంది. ఎందుకైనా మంచిది 10/- లేదా 15/- మధ్యలో ఎంతో కొంత కొనడం మంచిదే అని నా అభిప్రాయం.

ఈ నా అభిప్రాయం.. ఫూర్తిగా స్వగతం, ఎవ్వరూ ఈ విషయంలొ భాధ్యులు కారు. ఇది ఒక సలహా మాత్రమే. ఇట్టి సలహాల వల్ల తమరు నష్టపోయిన యెడల దానికి నేను భాద్యుడను కాను.. నన్ను భాధ్యులను చేయకండి.

 
Clicky Web Analytics