భారతావనికి వన్నె తెచ్చిన మహానుభావులు : భాగం-౧

పాత e-ఉత్తరాలు తిరగేస్తుంటే, ఒక ఉత్తరం నా కంటికి ఇంపుగా కనబడగానే.. తెలుగులోకి తర్జుమా చేసి మీ అందరికి అనువుగా ఉంటుందని ఇక్కడ ఉంచే ప్రయత్నంలో తప్పొప్పులుంటే, మన్నించగలరు. మూల పుస్తకాన్ని ఈ లింకు నుంచి పొందగలరు. ఎందరో మహానుభావులు, వారిలో కొందరు వీరు..

ఆర్యభట్ట (౪౭౬ - 476 CE) - ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టిన మెదటి వ్యక్తి

clip_image001

ప్రస్తుత బీహారులోని పాట్నలో క్రీ.పూ. ౪౭౬ (476 AD) జన్మించిన ఈ ఆచార్యుడు, భూమి గుండ్రంగా ఉందని, అది తన అక్షం చుట్టు తాను తిరుగుతోందని.. మెట్ట మొదటిసారిగా ప్రతిపాదించిన వ్యక్తి. అంతేకాకుండా, సంఖ్యాక శాస్త్రంలో పై (Image:Pi-symbol.svg) విలువను దగ్గర దగ్గరగా సూచించిన మొదట వ్యక్తికూడా వీరే. వీటన్నింటినీ మించి, సున్నాకు ఒక విలువ గలదనీ, అట్టి సున్నకు విలువ కట్టడం అసాధ్యమనీ, ఈ ఆచార్యుని ప్రతిపాదనే ఈయన ఉనికిని చాటుతుంది. ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో మచ్చుకు కొన్ని..

  • భూమి చుట్టుకొలతను ౨౪౮౩౫ (24835) మైళ్ళుగా ప్రతిపాదించారు, అది ఈనాటి లెక్కకు చాలాదగ్గర. ప్రస్తుత లెక్కల ప్రకారం భూచుట్టు కొలత ౨౪౯౦౦ (24900) మైళ్ళు
  • గ్రహాణాలు వాటి వివరణ
  • సంఖ్యాశాస్త్రం.. ఎన్నో.. మరెన్నో..

రెండవ భాస్కరాచార్య (౧౧౧౪ - 1114 CE) - బీజగణితానికు ఆద్యులు

clip_image001[4]

ప్రస్తుత మహారాష్ట్రలోని జలగావు జిల్లాలో జన్మించిన ఈ ఆచార్యుని ప్రతిపాదనలలో అతి ముఖ్యమయినవి, లీలావతీ మరియు బీజ గణితం. భూమికి గురుత్వాకర్షణశక్తి ఉంటుందని తెలియ జేసిన న్యూటన్‍కు ముందుగానే, సుమారు ఐదు వందల సంవత్సరాల క్రిందటనే భూమికి గురుత్వాకర్షకశక్తి ఉంటుందని, సూర్య సిద్ధాంతంగా ప్రతిపాదించినారు.

కానడ మహర్షి - ఆణుసిద్ధాంత కర్త

clip_image001[6]

ప్రస్తుత గుజరాత్ లోని ద్వారక లో జన్మించినట్లు వీరి అభిప్రాయం. అణు సిద్దాంతంలో జాన్ డాల్టన్ ప్రతిపాదించిన అణువులు, పరమాణువులు వంటి ఎన్నో విషయాలను వీరు, జాన్ డాల్టన్ కన్నా సుమారు రేండువేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించినారు. అణువు యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో వాటిల్లో రసాయనక చర్యలు ప్రతి చర్యలు ఎలా జరుగుతాయో వీరు తమ గ్రంధాలలో తెలియ జేసారు అన్నవాటికి సాక్ష్యాలు కోకొల్లలు.

నాగార్జున మహర్షి

clip_image001[8]

రసాయన శాస్త్రానికి పితమహునిగా పేరుగాంచిన వీరు, మధ్యప్రదేశ్ నందుగల బలుకా గ్రామమునందు జన్మించారు. రసాయన శాస్త్రం మరియు మూలకాశాస్త్రం లలో వీరి ౧౨ (12) సంవత్సరాలు చేసిన కృషి ఫలితమే, రస రత్నాకరం, రసృదయ మరియు రసేంద్ర మంగళం వంటి గ్రంధాలు. ఆరోగ్య మంజరి మరియు యోగాసర్ వంటి గ్రంధాలు కూడా వీరి ఙాన గుళికలే. ఆనాటి విస్వవిద్యాలయయిన "నలందా విస్వవిధ్యాలయం"లో వీరు గురుతుల్యులు.

 

మరిన్ని రేపటి పుటలో.. అంతవరకూ చదువుతూ మీ మీ స్పందనలు తెలియజేయగలరు.

నాతెలుగు తల్లికి (వాడిన) మల్లెపూదండ

నేను ప్రస్తుతం ఉంటున్నది మన రాష్ట్రరాజధాని, హైదరాబాదులో. మన రాష్ట్ర భాష తెలుగు. అట్టి తెలుగుకి ఎంత దుస్తితి పట్టిందో ఒక్క సారి అవలోకనం చేసుకుందాం.

భాషాప్రయుక్త భావనపై వేరు పడి, తెలుగును ఒక వెలుగు తెచ్చిన వారందరూ ఈనాటి మన హైదరాబాదు నగర స్ంచారానికి వెళ్ళారనుకోండి, తిరిగి వచ్చి నేనింకా ఎందుకు బ్రతికి ఉన్నానని భావించి.. మన హైదరాబాదు జనాల్ని పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడు కూడా మార్చలేడని తెలుకుని, మీళ మధ్య బ్రతకడం కన్నా చావడమే మేలనుకుంటారు.

నండూరి సుబ్బారావు గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమసేఖర శర్మ గారు, కొంపల్లి జనార్దన రావు గారు, ఆధునిక తెలుగు పితామహుడిగా పేరుగాంచిన గురజాడ వేంకట అప్పారావు గారు, పైన చెప్పిన వారికి ఏమాత్రం తీసిపోని శ్రీరంగం శ్రీనివాసరావు గారు, వీరందరినీ మించిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, కవికొండల వెంకట రావు గారు, చింతా దీక్షితులు గారు అబ్బురి రామకృష్ణ రావు గారు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, ఆంద్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు .. ఎందరో మరెందరో మహానుభావులు కనుకా ఈరోజుల్లోని పిల్లలని చూసి ఉంటే.. మనభాషకి పట్టిన గతికి చింతించడమే కాక, తాము పడ్డ కష్టానికి.. చేసిన కృషికి లభిస్తున్న ఆదరణకి ఎంత భాధ పడేవారో ఒక్క సారి ఊహించుకోండి.

అస్సలు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా?? నిన్నటి సాక్షి పత్రికలో చదివిన వ్యాసం కిక్కు ఇవ్వాళ్టికి నషాళానికి ఎక్కింది. ఈ మధ్య మన ప్రస్తుత అధికార ప్రబుత్వం చిన్నపిల్లలకు ఒకటవ తరగతి నుంచి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతోందట. పిల్లలకి చిన్నవయస్సు నుంచే తెలుగుని దూరం చేస్తే.. వారికి మన మాత్రు భాషపై మమకారం ఎలా పెరుగుతుంది? అభం శుభం తెలియని పిల్లలు.. అందునా పసి మొగ్గలు.. వాళ్ళు, వాళకేం తెలుస్తుంది ఏ భాష నేర్చుకోవాలి అని??? అన్నెం పుణ్యం తెలిసిన మన భుద్దికేం అయ్యింది?? ఎదో పెద్దయిన తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి కాబట్టి ఇప్పటినుంచే పెద్ద పెద్ద పాఠశాలలో చిన్న చిన్న చదువులు చదివించేస్తే సరిపోతుందని అలోచిస్తున్న నేటి తల్లి తండ్రులు తప్పు చేస్తున్నారా.. లేక వాళని చూసుకుని వారు వేసే ఓట్లకోసం ఈ ప్రభుత్వం ఇంతకు బరి తెగించిందా??

ఏదైనా భాషపై పట్టు రావాలంటే మూడు మాధ్యమాల ద్వారా మాత్రమే కుదురుతుంది. అవి, మాట్లాడగలగడం మెదటిదైతే.. చదవగలగడం రెండవ దస. ఆఖరున వ్రాయగలగడం. మాట్లాడడానికైతే ఇంట్లో తల్లి తండ్రులు.. స్నేహితులు, పరిచయస్తులు.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ తెలుగుని చదవడానికి మరియు వ్రాయడానికి ఉన్న ఒకె ఒక్క అవకాశం .. పాఠశాల మాత్రమే. అట్టి పాఠశాలలోనే మనం తెలుగుని విస్మరిస్తున్నామంటే... ఇక పిల్లలకు తెలుగుదనం యొక్క ఉనికి ఒక్క మాటలకి మాత్రమే మిగిలిపోతుంది. ఈ రోజుల్లోని తల్లి తండ్రులు తమ తమ పిల్లల్ని చక్కగా.. అమ్మా .. నానగారు .. అనేటటువంటి పిలుపులకు దూరంచేసి.. మమ్మీ డాడి వంటి అరువు తెచ్చుకున్న పిలుపులకు దగ్గర చేస్తున్న వైనం ఏమాత్రం హర్షణీయం??

ఇవన్నీ ఒక ఎత్తైతే.. మన రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న టికెట్ కండక్టర్లకు ఎంతమందికి తెలుగు వచ్చో ఎప్పుడైనా మాట్లాడి చూసారా?? అప్పుడప్పుడు మేము విజయవాడనుంచి వచ్చేటప్పుడు తెల్లవారుఝాము వేళలో బాగుంటుంది కదా అని బస్సు ప్రయాణం చేస్తూ ఉంటాము. నాకు ఆశ్చర్యం వేసే విషయమేమిటంటే.. వాళు అనేటటు వంటి మొట్ట మొదటి మాట.. కహా జానెకా.. (హిందిలో, ఎక్కడికి వెళాలి?). ఒకటి రెండుసార్లు భాషపై ఉన్న మమకారం చంపుకోలేక, వాళు మారరని తెలిసీ నావంతు కృషిగా వారితో మాట మాట కలిపి,వారికి అస్సలు తెలుగు వచ్చో.. రాదో.. తెలుసుకునే ప్రయత్నంలో, వాళకి తెలుగు తెలుసు అన్న చేదు నిజం తెలిసిన తరువాత నాగొంతుక మూగబోతుంది. కొంత మందైతే, తెలుగు తెలిసినా రానట్లు నటించడం చూస్తుంటే, వాళను ఏమి చెయ్యలేని నా నిస్సహాతకు నామీద నాకే అసహ్యమేస్తుంది. మరి కొందరైతే మరో అడుగు ముందుకేసి, హమ్ కో తెలుగు నహి అతాహై.. తుమ్ హిందీ మే బోల్.. అంటూ తిరిగి, రివర్స్‍లో నన్నే గదమాయిస్తూంటారు. మన ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తే, ఇట్లాంటి వాళు అలాంటి ఉద్యోగాలు చెసేవారా??? ఏమి చేస్తాం.. ఏమీ చెయ్యలేం.. చూస్తూ కూర్చోవటం తప్ప. దేవుడా.. నా తెలుగు తల్లిని రక్షించు.

 
Clicky Web Analytics