ఆడ పిల్ల పుట్టాలనుకుంటున్నారా???

అయితే ప్రొద్దుట పూట ఫలహారం మానేయ్యండి. అంతే.. గర్బాధారణ జరిగే రోజులలో స్త్రీలు కనుక బ్రేక్‍ఫాస్ట్ మానేస్తేనంట ఆడ పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాంట. ఏంటీ నామాట నమ్మటంలేదు కదా.. బ్రిటీషు శాస్త్రవేత్తలు ఈ రోజు పత్రికా ముఖంగా ఈ విషయాన్ని వెల్లడిచేసారు.

Exeter మరియు Oxford విశ్వవిధ్యాలయాల సంయుక్త పరిశోధనల ఫలితాలు చాలా చాలా క్రొత్త క్రొత్త విషయాలను తెలియజేసాయని Exeter విశ్వవిధాలయలో పని చేస్తున్న ఫియనా మాత్యు అనే శాస్త్రవేత్త తెలియజేసారు. ఈయన ప్రకారం గర్బాధారణ జరిగే రోజులలో తల్లులు కనుక ఉదయం వేళలలో తక్కువ కేలరీలు కలిగిన అహారాన్ని భుజించడం ద్వరా పుట్టబోయే పిల్లలలో మగ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న విషయం ఋజువు అయ్యిందన్నారు. మానవ శరీరం ఉదయం వేళలలో ఎమీ భుజించక పోవడాన్ని, తక్కువ కేలరీ కలిగిన పదార్దం పెద్ద ప్రేవులలో ఉన్నట్లుగా గ్రహిస్తుందని, ఈ రకంగా తల్లి పోషక పదార్దానికి పుట్ట బోయె పిల్లలకు చాలా దగ్గరి సంభందం ఉన్నట్లు వారు విశదీకరించారు.

౭౪౦ (740) మంది మొదటి సారిగా గర్బం దాల్చిన యువతుల మీద జరిపిన సర్వే ఫలితాలను తెలియజేస్తూ, వారిలో ఎక్కువ శాతం తల్లులు మగ బిడ్డలకు జన్మ నిచ్చారని, వారంతా చక్కగా ఎక్కువ శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకున్నారని కూడా వివరించారు. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని భుజించిన మిగిలిన యువతులకు ఆడ పిల్లలు కలిగారనేది వారి వాదన.

పూర్తి వ్యాసాన్ని AOL వారి లింకు నుంచి చదవగలరు

 
Clicky Web Analytics