Internet Quiz

Today, while passing time between the responses from  our team, came across this Internet Quiz. Scored 29 out of 29. Out of all the given questions, only one is guess work, that is the first popular social networking site, ie., Friendster. Except this, others are some kind of simple and tricky. Did you try?

సాక్షి వార్తాపత్రికపై నా అభిప్రాయం - రెండవది

గత కొన్ని రోజులుగా సాక్షి దిన పత్రికను క్రమం తప్పకుండా చదువుతున్నాను. గతంలో మాదిరిగా కంటే, ఇప్పుడు ఎక్కువగా అధికార పక్ష పత్రికగా అనిపిస్తోంది. ఎంతైనా తండ్రిగారిని, వారి ప్రభుత్వాన్ని కాదనలేరు కదా!!! ఈ పత్రిక ద్వారా ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకు అర్దమవుతున్నాయనేది మాత్రం నగ్న సత్యం. కాకపోతే, ఊరికే పంచి పెట్టే పామ్‍ప్లేట్లను డబ్బులిచ్చి కొన్నుక్కుంటున్నట్లుంది. ఏది ఏమైనా చక్కగా కనులకు విందుగా బాగానే ఉంది.

ఇవాళ్టి విషయానికొస్తే.. పేపర్ బాయిస్ మీద మొదలు పెట్టిన వ్యాసం పేజీ తిప్పగానే వార్తాహరులు వైపు, రచనా వ్యాసాంగం రంగాలలో పనిచేసే వారి జీతభత్యాల వైపు మళ్ళించారు. కానీ రెండు పేజీలలోనూ ఉన్న ఫొటోలు మాత్రం పేపర్ బాయిస్‍వే వెయ్యడం ఇక్కడ గమనించ దగ్గ విషయం. పైకి మాత్రం పెపర్ బాయిస్ గురించి అన్నట్లనిపించేలా ఉన్న చిత్రలను చూసి భంగపడ్డాను. తీరా అందులో అస్సలు విషయమల్లా ఏమిటంటే.. సాక్షి మొదలు పెట్టిన దగ్గర నుంచి, ఇందులో పని చేసే వారి జీతాలు పెరిగినాయంటూనే, ప్రతి పక్షాల్లాంటి ప్రత్యర్దుల పని వారి జీత భత్యాలు పెరగటం లేదని ముగించారు. వ్యాపారమన్నాక ఆ మాత్రం ఒడి దుడుకులు ఉండవక తప్పదు కదా!! ఈ మాత్రం దానికే అంత పెద్ద ఆర్టికల్ వ్రాసేయ్యాలా??

ఏది ఏమయినా, ఈ మధ్య సాక్షి వారికి వార్తలు తగాయనడంలో ఎంతో కొంత నిజంమేననీ, ఇదంతా స్థలాన్ని పూరించుకోవడానికె చేస్ ప్రయత్నాలనేది సత్య దూరాలు కావు. వీరు తోందరలోనే కొన్ని పేజీలను తొలగించేసి, పత్రికా పేజీల సంఖ్యను తగ్గించేస్తారనుకోవడం, అతిశయంకాదు. వీటన్నింటి లోకి నాకు నచ్చిన ఒక విషయమేమిటంటే, ప్రధాన పత్రిక చివ్వరి పేజీలో ఒక మంచి మాటను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ తతంగం ఎలా ఉందంటే, బాలమురళీ సుబ్రమణ్యం గారు నిర్వహించే కార్యక్రమం, పాడాలని ఉంది లో చివరగా బాలుగారు ఒక మంచి విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటారు. అదే తరహాలో వీరు చివ్వరి పేజీలో చక్కగా ఒక చిన్న విషయాన్ని సున్నితంగా తెలియజేస్తున్నారు.

చుద్దాం ఇక ముందు వీరు ఏవిధంగా మారతారో.. అంతవరకూ.. సెలవు..

క్షమించాలి.. బాల సుబ్రమణ్యంగారిని, బాల మురళి గారిగా ప్రచురించినందులకు.

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

భోజనం - భొజరాజు

నా చిన్నతనంలో చాలా కధలు విషయాలు మా తాతగారి వద్ద, మరికొన్ని మా అమ్మమ్మ వద్ద నేర్చుకున్నాను. వాటిల్లోంచి ఒకటి మీ కోసం ఇలా..

ఏమిటి?? భోజనమంటున్నాను.. అలాగే భొజరాజంటున్నాను .. అనుకుంటున్నారా!!! ఈ రెండింటికీ ఎక్కడ కలుస్తుందనుకుంటున్నారా??? తలపగలు కొట్టుకోండి. ఈ రేంటికీ ఎక్కడ పొంతన లేదు. కానీ ఆహారం విషయానికొస్తే, ఈ రోజుల్లో, హైదరాబాదు వంటి నగరాల్లో.. ప్రతీ సుభకార్యానికీ, ఎక్కువగా బఫేలు పరిపాటై పోయింది. అట్లాంటి బఫె నే ఈ నాటి నా ఈ పుటకి మూల కారణం. బఫే అనబడే ఈ తంతు, నక్కని చూసి .. (అయ్యొయ్యో.. పులిని చూసి నక్క అని అనాలికదా.. ఎదోలేండి.. ) అన్నట్లుగా.. "హైదరాబాదులో మా చుట్టాలు.. క్రిందటిసారి వాళింటిలో సుభకార్యం జరిగినప్పుడు, ఇలాగే పెట్టారు .." అని ప్రక్క ఊళ్ళలో ఉన్నవారుకూడా ఇదే పద్దతిని పాటించేస్తున్నరు. అదిగో అలాగే, క్రిందటి ఏడాది, విజయవాడలో కొన్ని పెళ్ళిళకు వెళ్ళి నప్పుడు ఒకటి రెండు సార్లు,  బఫె భొజనం చేసినట్లు గుర్తు.

ఇక అసలు విషయానికొస్తే.. భోజరాజుకి ఒకనాడు గొప్ప అవమానం జరిగింది. అదేమిటంటే.. తన దగ్గర పనిచేసే ఒక పరిచారకుడు రహస్యంగా ఎవ్వరికో ఉత్తరం వ్రాసుండగా, ఈ రాజుగారు చాటుగా దానిని చదవుతున్నారంట. ఇది గ్రహించిన అతను రాజుగారు చదువుతున్నరన్న విషయం, తాను గ్రహించినట్లుగా రాజుగారు పసి గట్టినట్లైతే బాగుండదు కదా అని, తెలియనట్లుగా ఉన్నట్లుంటూనే, కొంచం తుంటరిగా ఉత్తరం మధ్యలో ముగించెస్తున్ననంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా, ఒక మనో నిబ్బరం లేని ఒక వెధవ కూడా ఈ ఉత్తరాన్ని చదువుతున్నడు కనుక మిగిలిన విషయాలు తరువాత ఉత్తరంలో వ్రాస్తానని ముగించేసాడు. అంతట ఆ రాజు గారు, తనను ఒక వెధవగా పోల్చినందులకు చింతించి, తదుపరి తన సభలోకి వచ్చే వారందరినీ, "మూర్ఖా..!!" అంటూ సంభోదించడం మొదలుపెట్టారు. సభలోకొచ్చిన ప్రతీ వ్యక్తీ దీనికి ఆశ్చర్య చతికులై, రాజుగారికి ఎదురు చెప్పలేక, మౌనంగా ఆ అవమానాన్ని దిగ మింగు కుంటునారు. ఇది రాజుగారికి కొంత ఊరట నిచ్చినట్లైంది. ఇంతలో మహాకవి కాళిదాసుగారు రంగ ప్రవేశం చేసారు. రాజు గారు యధా ప్రకారం వీరిని కూడా.. "మూర్ఖా!!" అంటూ సంభొదిచే సరికి, మన మహాకవి గారు సంస్కృతంలో క్రింద చెప్పినట్లు చెబుతారు

ఖాద న్న గస్చామి, హాస న్న భాష్యే
గాతం న షోచామి, కృతం నా మన్యే
ద్వభాయం తృతియొ న భవాని రాజన్
కిమ్ కారణమ్ భొజ భవామి మూర్ఖః

దీని అర్ద మేమిటనిన.. నేను నడుస్తూ భుజించను, పొట్ట చెక్కలయ్యెలా నవ్వుతూ మాట్లాడను, ఇద్దరు తగువు లాడు కుంటుండగా మధ్యలో జేరి ఇద్దరి చేత వెధవగా నేననిపించుకోలేదు.. (ఇలా ఇలా ఇంకా ఎదో ఎదో అర్దం దాగి ఉంది. నాకు గుర్తున్నంత వరకూ ఇంతే.. మీలో ఎవ్వరైనా సంస్కృతం తెలిసిన వాళైతే దీని పూర్తి తాత్పర్యం తెలియజేసిన యడల చాల రుణ పడి ఉంటాను). ఇన్ని విషయాలలో నేను మూర్ఖుడిని కాదని ఋజువు అయినందున, నన్ను ఏవిధంగా మూర్ఖుడిని చేసావు .. ఓ రాజా?? అని తిరిగి ప్రశ్నించారు.

తరువాత కధ ఇప్పటికి అప్రస్తుతం. ప్రస్తుతానికి అవసరమయిన విషయమేమిటంటే.. మూర్ఖులందరూ నడుస్తూ భొజనం చేస్తారన్నది, మహాకవి కాళిదాసుగారి అభిప్రాయం. ఈ విషయమం నాకు చిన్నపుడే నూరి పోసారు కనుక, వృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్‍లు, గట్రా గట్రా, వగైరా వగైరా వంటి వాటికి వెళ్ళ వలసి వచ్చినప్పుడు, చక్కగా ఒక మూల చూసుకుని, చేతిలోని ప్లేటుని దానిమీద పెట్టుకుని భొంచేస్తాను. ఇంతే కాకుండా, మా కార్యాలయంలో నా కోసం ప్రత్యేకంగా ఒక చిన్న బల్ల నేను వెళ్ళే సమయానికి సిద్దంగా ఉంటుంది.

మొన్నీ మధ్య, ఎవ్వరి బ్లాగులోనో ఒక విషయాని ప్రస్తావించడం జరిగింది. దానిని ఇక్కడ మరొక్క సారి సవినయంగా మీతో పంచుకుంటాను..

ఎలాగోలా బ్రతికేయ్యాలంటే, ఎలాగైనా బ్రతికేయ్యవచ్చు. కానీ ఇలాగే బ్రతకాలనుకున్న వాళ్ళకే కష్టాలన్నీ..

ఏమంటారు?

-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

 
Clicky Web Analytics