ఇది కూడా నిజమే ..

నాకు తెలుగే సరిగ్గా రాదనుకున్నాను, పరభాష అయినా ఆంగ్లం కూడా రాదని ఇవ్వాళ నిద్దారణ అయ్యింది. ఏదో వృత్తి పరంగా నాలుగు ముక్కలు ముక్కున పెట్టుకుని వాగేస్తూ కాలం గడిపేస్తున్నాను కానీ ఆంగ్లంలో కనీస పదాలు కూడా గుర్తుకు రావటం లేదనడానికి ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి పత్రిక ఉదాహరణ. ఇవ్వాల్టి ఆంద్రజ్యోతి సిటీ ఎడిషన్ మధ్య పేజీలో పదవినోదం అనే ఒక భాషా పరమైన సమస్యను ఇచ్చాడు. దానిని పూరిద్దాం కదా అని చేసిన నా ప్రయత్నంలో నేను బొటా బొటిన పాస్ అయ్యాను అని చెప్పుకోవచ్చు. మేము చదువుకునే రోజుల్లో బొటా బొటి అంటే వందకు పాస్ మార్క్ అన్నమాట. హిందిలో అయితే వందకు పదిహేను మార్కులు వస్తే పాస్ అన్న మాట అలాగే మిగిలిన సభక్ట్ లలో అయితే ముప్పై ఐదు వస్తే పాస్ అన్న మాట. ఆ లెక్కలో నాకు వందకు నలభై మార్కులు వచ్చాయి.

సమస్యలో వాడు ఇచ్చింది ఐదు ఖాళీలు పూరించమని. నాకు ఙ్ఞప్తికి వచ్చినవి రెండు. అంటే పాస్ అన్న మాట. వాడు ఇచ్చినవి వాటిల్లో నాకు వచ్చినవి ఇక్కడ ఉంచుతా.

వరుస తెలుగు పదం మొదటి అక్షరం రెండొవ అక్షరం మూడవ అక్షరం నాల్గవ అక్షరం ఐదవ అక్షరం
బ్రతికిన       V E
ధైర్యము B R A V E
నడువు       V E
నదులు       V E
బానిస S L A V E

మిగిలిన తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు ఏమై ఉంటుందబ్బా!!

మీరేమవ్వాలనుకుంటున్నారు / ఏమి చెయ్యాలనుకుంటున్నారు

WorstNew

పేజీ తిప్పితే ..

ఈ మధ్య అనుకోకుండా ఈ క్రింద ఉంచిన లఘు చిత్రాన్ని చూడటం జరిగింది.

ఈ చిత్రం యొక్క మూల ఉద్దేశ్యం అర్దం అవ్వటానికి చాలా సేపు పట్టడం అనేది నా మట్టి బుర్రని చురుకుదనాన్ని తెలియజేసింది. మా బుర్ర యొక్క పనితీరు విషయాన్ని ప్రక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ చిత్రాన్ని తీయ్యడంలోని ముఖ్య ఉద్దేశ్యం బాగుంది. అక్కడి పాత్రల మధ్య సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం బాగుంది. అన్నింటికీ మించి కధాగమనంలోని మాటల విషయంలో ఆ రచయితని మెచ్చుకోకుండా ఉండలేను. దీనినే క్రియాత్మకత అని అంటారు.

ఎవ్వరైనా ఏదైనా ఫొటో మోడల్ గా చేద్దాం అని అనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తే చాలా ఆనందిస్తారు అని వ్రాయటం కన్నా ఆస్వాదిస్తారు అని వ్రాయటం భేషుగా ఉంటుందేమో. ఒక్క సారి ఆలోచిస్తే పుస్తకంలో ఉండే ప్రకటనలలోని పాత్రలు నిజంగా ఇలాగే ఆలోచిస్తాయా అనేటటువంటి ఊహ ఎంత విచిత్రంగా ఉందో కదా. ప్రకటనలలోని పాత్రలు కనుక నిజంగా ప్రాణం వస్తే ఇలాగే ఆలోచిస్తాయేమో!!

పుస్తక ప్రదర్శన 3వ రోజు విశేషాలు

eతెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తున్న పుస్తక ప్రదర్శన యందలి స్టాల్ యొక్క మూడొవ రోజు విశేషాలు వ్రాద్దామని రెండు రోజులనుంచి అనుకుంటున్నా, కుదరటం లేక ఇవ్వాళ ఎలాగైనా వ్రాసి ముగిద్దామని కూర్చున్నాను. వీలైన వివరంగా వ్రాస్తాను.

మూడోరోజు ప్రధమంగా నేను వెళ్ళటం జరిగింది. మూడోరోజు శనివారం అయినందున ఉదయం పదకొండు గంటలకే తెరుస్తారని చాలా సార్లు నిర్వాహకులు ప్రచారం చేసినందున ఆరోజు ఇంకొంచం ముందుగా వెళదాం అనుకున్నా, భోజనం చేసి అక్కడికి చేరుకునేటప్పటికి పన్నేండున్నర అయ్యింది. స్టాల్ మూసి ఇన్న వైనం ఎందుకో కించిత్ నచ్చక పోయినా, చేసేది లాభాపేక్ష లేకుండా కదా.. ఎవ్వరికి వీలైతే వారు మనకు కలసి వస్తారు, వీలుకాలేని వారిని ఎందుకు వీలుకాలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు కదా అని సమర్దించుకుని, నా వంతు కర్తవ్యంగా నేను వచ్చాను కదా అనుకుని ఓదార్చుకున్నాను. అదిగో అలా మొదలైంది పుస్తక ప్రదర్శనలో మొదటి శనివారం.

అన్నీ సద్దుకుని నా అంకోపరిని నలుగురికి కనబడేటట్టు పెట్టి, కరపత్రాలను సర్ది కుర్చీలో కూలబడ్డాను. జనాలు చాలా పలుచగా వస్తూ ఉన్నారు. మెల్ల మెల్లగా ఒక్కరొక్కరూ రావటం మొదలైంది. వచ్చిన వారికి కరపత్రాలు అందిస్తూ, అడిగిన వారికి తెలిసిన విషయాన్ని తెలియజేస్తూ సాగుతుండగా, మూడున్నర వేళలో కొంచం కునుకు పట్టింది. అలాగే కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతుంటే, ఓ నడి వయస్కుడు చక్కగా నా అంకోపరిని సర్దేసే పని చేశాడు. గబుక్కున మెళకువ వచ్చింది కాబట్టి బ్రతికి పోయ్యాను. మేలుకుని అతని చేతిలో కరపత్రాన్ని ఉంచి పంపేటప్పటికి పట్టిన కునుకు కాస్తా పోయింది.

అలా గట్టేక్కిన సమయానికి మెల్ల మెల్లగా తెలుగు బ్లాగర్లు, eతెలుగు కార్యవర్గ సభ్యులు రావటం మొదలైంది. కబుర్లు చెప్పే కశ్యప్ గారు ముందుగా అక్కడికి చేరుకున్నారు. వారి వెనకాల జావాలినిక్స్ వ్రాసే కట్టా విజయ్ గారు రావటం జరిగింది. ఆనాటి విషయాలలో చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే, కట్టా విజయ్ గారు తనతో తెచ్చిన ఎయిర్ టెల్ వారి ఇంటర్ నెట్ కార్డ్. దాని సహాయంతో సందర్శకులకు అంతర్జాలంలో తెలుగు ఎంత బాగా అభివృద్ది చెందుతుందో చూపించగలిగాం. అంతర్జాల సదుపాయాన్ని ఆనాడు eతెలుగు వారికి అందించినందులకు సభా ముఖంగా వారికి ధన్యవాదములు.

అదిమొదలు, ఏకలింగం పేరుతో బ్లాగే మాలికా మూలకారుకులలో ఒక్కరైన శ్రీనివాస్ గారు, శంకరాభరణం అని బ్లాగుతున్న తెలుగు మాస్టారైన కంది శంకరయ్యగారు, వారి వెనకాలే ప్రఙ్ఞ అనే శీర్షికన బ్లాగుతున్న మఱో బ్లాగరు, కోతి కొమ్మచి బ్లాగరుతో మాట్లాడుతుండగా మూడు బీర్ల తరువాత అంటూ అక్కిరాజుగారు వచ్చి కాసేపు పిచ్చాపాటి వేసారు. ఆఖర్లో అనుకుంటా ఒక మంచి మాట చెబుతానంటూ మఱో తెలుగు బ్లాగరు అప్పారావుగారు రావటం జరిగింది. మహిళా బ్లాగర్లలో చురుకుగా పాలు పంచుకుంటున్న జ్యోతిగారు కూడా ఆరోజు తళుక్కున మెరిసి అదృశ్యం అయ్యారు. వీరందరితో పాటుగా సంసృత డాక్యుమెంట్స్ వెబ్ సైట్ నకు సహకారాన్ని అందిస్తున్న గుత్తిన శ్రీనివాస్ గారు కూడా విచ్చేసి వారి అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నారు.

ఆనాటి చిత్రాలను ఈ లంకెలో చూడవచ్చు.

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

సందర్శకుల రద్దీ కనబడకపోవడం చేత తెలుగు భాషపై ఆశక్తి కలిగిన వారికి మరింత విపులంగా eతెలుగు చేసే పనులు వివరించడం కుదిరింది. రెహ్మాన్ గారు ఈ నాటి స్టాల్ తెరచి చాలా సేపు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించినా వారికి వెసలు బాటుగా సాయం వేళకి కబుర్లు చెబుతానంటూ బ్లాగుతున్న మన కృపాల్ కశ్యప్ చేరుకుని రెహ్మాన్ గారి భాద్యతను పంచుకున్నారు. ఇదిగో అంతలో నేను చేరుకోవడం జరిగింది. నేను చేరుకునే సరికి కశ్యప్ గారు చక్కగా తన డెల్ అంకోపరిని తెఱచి ఉంచి అందులో తెలుగు ఉబంటుని కనిపించే విధంగా ఉంచడం బాగుంది.

మరికొద్ది సేపటికి ఊసులు చెప్పుకునే స్వాతి ముత్యం అనే ఉప శీర్షికన బ్లాగే స్వాతిగారు చేరుకోవడం వారి వెనకాలే అభ్యాస్ అనే సంస్థ నడుపుతున్న యెనమండ్ర సతీష్ కుమార్ గారు రావడం జరిగింది. వీరితో కాసేపు eతెలుగు స్టాల్ కళకళలాడింది. అంతలో కొంచంగా సందర్శకుల తాకిడి కనబడంటంతో ఎవ్వరికి వారు అంతర్జాలంలో తెలుగు వెలుగుకై వారి వారి ఙ్ఞానానికి పరిధిలో ఉన్న సమాచారాన్ని సందర్శకులకు తెలియజేయడంలో మునిగిపోవటం చూడ ముచ్చటవేసింది. ఇలా అటుగా పోతూ వచ్చిన కొందరు eతెలుగు కార్యక్రమాలను మెచ్చుకోవడం మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైంది.

వీరి వెనకాలే కినిగే స్టాల్ వారి చావా కిరణ్ గారు వారికి తోడుగా మరో ఇద్దరు సాహితీ వేత్తలు వచ్చి చర్చించడం ఈనాటి విశేషాలకి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. అలా సాగిన ఈ నాటి కార్యక్రమంలో జయప్రదంగా ఆఖరి వరకూ ఉండి ఆ రాత్రి వేళ చక్కటి కాఫీ త్రాగి రెండొవ రోజు కార్యక్రమాన్ని ముగించాము.

రేపు ఎల్లుండి వారాంతాలవ్వడం మూలాన పుస్తక ప్రదర్శనను ఉదయం పదకొండు గంటలనుంచి తెరిచి ఉంచుతున్నారు. ఈ రెండు రోజులలో భాగ్యనగరంలో ఉన్న తెలుగు బ్లాగర్లు / ఔత్సాహికులు అందరూ వచ్చి జాలంలో తెలుగుకై మీకు తెలిసిన విషయాలను నలుగురితో eతెలుగు స్టాల్ నందు పంచుకోండి.

మొదటి విషయాలలో మఱొకటి

నా జీవితంలో మొదటి సారిగా నేను చేసిన, చేస్తున్న, చెయ్యబోతున్న కొన్ని పనులలో ఇది ఒకటి. గృహ ప్రవేశ ఆహ్వాన పత్రం. నా పెళ్ళికి కూడా ఆహ్వాన పత్రాలు ముద్రించినా, దానియందు నా ప్రవేశం చాలా తక్కువ. ఎందుకంటే, అక్కడ పెద్దవాళ్ళ ప్రమేయమే ఎక్కువ. ఇదిగో ఇప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల నేను ఓ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కునాను. ఆ ఇంటి లోనికి గృహ ప్రవేశం చేసే ప్రక్రియలో మున్ముందుగా ఆహ్వాన పత్రాన్ని తయారు చెయ్యడం దగ్గరనుంచి ముద్రించడం వరకూ నేనే చేసుకున్నాను. ఈ ప్రయోగంలో తెలుగు సరిగ్గారాని నాకు, రాజశేఖరుని విజయ్ శర్మ గారు, ధూళిపాళ ఆర్క సోమయాజిగారు మఱియు తాడేపల్లి బాల సుబ్రహ్మణ్యం గారు సహాయం చేసారు. వీరికి నేను ఎంతో ఋణపడి ఉంటాను.

ఆహ్వాన పత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది.

Invite

ఆహ్వానితులకు పంచే పత్రాన్ని ఉంచే కవర్ పైన ఈ క్రింద విధంగా ఉంటుంది.

Cover

ఆహ్వానితుల సౌకర్యార్దం మా క్రొత్త ఇంటికి రావడానికి దారి చూపే చిత్రపటం ఈ విధంగా ఉంటుంది.

RouteMap

స్టీవ్ జాబ్స్ – ఆపిల్ సంస్థ మూలం

స్టీవ్ జాబ్స్ ఇక లేరు అన్న మాట ఎందుకో మింగుడు పడటం లేదు. ఆయన కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు అన్న విషయం వారి ప్రసంగాలు హాజరయ్యేవారికి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్టిగా గుండుగా ఉండాల్సిన వ్యక్తి, బక్క చిక్కి శల్యమై పుల్లలా ఆఖరిసారిగా వారిని చూసిన తరువాత అది నిజం అన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. కానీ, వృత్తి పరంగా సెలవు తీసుకుని వైద్యం చేయించుకుంటున్న వ్యక్తి తమ సంస్థ ద్వారా విడుదలౌబోతున్న ఐదవ తరం ఐఫోన్ కన్నా ముందుగా ఇలా తనువు చాలించడం కొంచం కష్టంగా నే ఉంది.

steve_jobs

నాకు మైక్రోసాఫ్ట్ అంటే అంతులేని ప్రేమ. అలాగే మైక్రోసాఫ్ట్ యందు అత్యంత గౌరవం కూడా. ఇదంతా వ్యక్తిగతంగా అంతే కాకుండా వృత్తి పరంగా నేను అనునిత్యం వాడే అన్ని సాఫ్ట్ వేర్ ఉపకరణాలన్నీ మైక్రోసాఫ్ట్ వారు తయారు చేసినవే. అలాగే స్టీవ్ జాబ్స్ అన్నా నాకు అత్యంత గౌరవం. ఇలా గౌరవం కలిగి ఉండటం వెనకాల కొన్ని కారణాలలో మొదటిది ఏమిటంటే..

.. తాను మొదలు పెట్టిన సంస్థ నుంచి తననే తొలగించి వేస్తే, మఱో సంస్థని స్థాపించి, దాని ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేసి, అలా సంపాదించిన సొమ్ముతో తాను ముందుగా స్థాపించి తొలగించ బడ్డాడో అలాంటి సంస్థని తిరిగి కైవసం చేసున్నారు.

ఇలా వ్రాయడం కొంచం అతిశయం అని అందరూ అనుకున్నా, లేదా, ఆయనకు కొంచం ఇగో ఎక్కువ అనుకునా, మరింకేమనుకున్నా, నాకు మాత్రం అ చర్యల వెనకాల ఈయన పడ్డ తపన, శ్రమ అందుకోసం ఆయన కన్న కలలు మాత్రమే కనబడుతున్నాయి. ఓ పెద్దాయన చెప్పినట్లు, కలలు కనండి, కానీ అవి సాకారం చేసుకునేందుకు కష్ట పడండి.. అన్న లెక్క ప్రకారం స్టీవ్ జాబ్స్ కూడా కలలు కన్నారు. అలాగే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం లో ఎన్నో సార్లు విఫలమైనా ప్రతీ విఫలం నుంచి నేర్చుకుంటూ, సాఫ్ట్ వేర్ రంగంలో ఓ వెలుగు వెలుగారని చెప్పనవసరం లేదు.

వ్యక్తిగా ఈయన చదువు యూనివర్సిటీ స్థాయిలో (అంటే మన డిగ్రీ స్థాయి అన్నమాట) ఆగి పోయినా, వృత్తిలో హార్వడ్ మేధావుల స్థాయి దాటి ఆలోచిస్తారు. ఒకే ఒక్క వ్యక్తి కన్న కలలే మాక్ వస్తువులు. ఈయన గురించి లేదా వీరి ప్రవర్తన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఊరందరిదీ ఒక దారి ఉలిపికట్ట దొకదారి అన్న పంధాన కనబడ్డా, ఆ పంధాని నిజం చేసి చూపించిన వ్యక్తి ఈయన. వీరి మొట్ట మొదటి వైఫల్యాల విషయానికి వస్తే మ్యాక్ కంప్యూటర్ ముందుంటుంది.

నాకు తెలిసిన చాలా పెద్ద మంది, అందునా ధనవంతులు సాధారణంగా మాక్ వాడుతున్నారు. అలాంటి వారు మ్యాక్ కంప్యూటర్ వైఫల్యం చెందింది అంటే ఒప్పుకోక పోవచ్చు. అలాంటి వారికోసం ఇదిగో నా వివరణ.

దాదాపుగా 1970 లలో అనుకుంటా, స్టీవ్ జాబ్స్ గారు మఱియు మైక్రోసాఫ్ట్ అధిపతి అయిన బిల్ గేట్స్ కలసి ఐబియం IBM యందు పనిచేసేవారు. వీరి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం చూసే ప్రతీ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం తయారు చేయ్యాలి. అందుకు IBM వారు ధనసహాయం చేస్తారు. కొంతకాలం పరిశోధించిన తరువాత స్టీవ్ జాబ్స్ IBM ప్రతినిధులకు ఓ రిపోర్ట్ ఇచ్చారు. అది ఏమిటంటే, IBM వారి మెత్తం ఆర్కిటెక్ట్చర్ మార్చేయ్యాలని. అప్పటికే వ్యాపారంలో ఉన్న IBM వారికి ఇది ఆశ్చర్యానిచ్చింది. ప్రపంచం మొత్తం అమ్ముడౌతున్న ప్రతీ కంప్యూటర్ IBM వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తుంటే, IBM వారు వారి ప్రమాణాలను పూర్తిగా విరుద్దంగా మార్చాలా అన్న అంశంపై వీరిద్దిరికీ పొత్తు కుదరక స్టీవ్ జాబ్స్ వారు IBM నుంచి తొలగి పోయ్యారు.

అదిగో అలాంటి స్థితిలో అప్పటికి పూర్తిగా పాతుకు పోయి, అదే ప్రమాణం అని శాసించే స్థితిలో ఉన్న అన్ని వాదనలకు లేదా ఆలోచనలకు, ముఖ్యంగా వ్రాయాలంటే అది ఒక్కటే దారి అనుకుంటున్న ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేయబడ్డ కంప్యూటరే మ్యాక్ కంప్యూటర్. దాదాపు మూడు దశకాలపాటు వీరి వ్యాపారం అనుకున్నంత స్థాయిలో జరగలేదు. కానీ మైక్రోసాఫ్ట్ వారు ఎప్పుడైతే కంప్యూటర్ అనేదానిని దానికి తోడుగా విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తీసుకువచ్చారో, అప్పుడు మ్యాక్ వారికి కూడా కొంత వ్యాపారం తోడైంది.

ఆ తరువాత స్టీవ్ జాబ్స్ తన దృష్టిని కంప్యూటర్ నుంచి తీసి పాటల ప్రపంచంలోకి అటుపైన ఫోన్.. ఆఖరుగా తిరిగి కంప్యూటర్, ఈసారి అంకోపరి (అదేనండీ ల్యాప్ టాప్) వైపు సాగించారు. ప్రపంచం ఎప్పుడూ గుండ్రంగా ఉంటుంది అనేది ఈ విధంగా కూడా నిజం అయ్యింది. ఏది ఏమైనా ఓ విలక్షణ మైన వ్యక్తి ఇకలేరు. సాంకేతిక పరంగా క్రొత్తగా ఆలోచించే బుఱ ఇకలేదు. ఆలోటు మ్యాక్ సంస్థ తీర్చకలదో లేదో కాలమే నిర్ణయించాలి

కెలుకుడు బ్యాచ్ – ఇక మీ ఇష్టం

ఈ మధ్య కొన్ని వ్యక్తి పరమైన అలాగే వ్యాపర పరమైన ఘటనలు నలుగురిలో ఉంచి నన్ను అమర్యాద చేసి నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యాలని ప్రయత్నం జరిగింది. ఆ పంచాయితీకి నేను దూరంగా ఉన్నందు వల్ల పంచాయితీ పెట్టిన పెద్దల ఇగో దెబ్బతింది. వారి అహం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఎంతటి నీచానికి పాల్పడుతున్నారంటే, తలచుకోవడానికే అసహ్యం వేస్తోంది. అలాంటిది వ్రాయడాని అక్షరాలు రావటం లేదు.

నేను స్వతహాగా కొందరికి దూరంగా ఉంటాను, అలాంటి వారిలో పద్దతిగా మాట్లాడటం రానివారు, గౌరవించడం తెలియని వారు, ఎంత చదువు చదువుకున్నా నోరు తెరిస్తే బూతులు తప్ప మాట్లాడని వారు.. వగైరా వగైరా. ఆ జాబితాలోకి ఈ మధ్య మఱో వ్యక్తి చేరారు. ఈ వ్యక్తి ఎలాంటి హేయమైన చర్యలు పాల్పడుతున్నారంటే, తలచుకున్నప్పుడల్లా నాలో అసహనం తారాస్థాయికి చేరుకుంటోంది. అలా చేరుకున్న ప్రతీ సారి నాకు నేను ఏవిధంగా స్పందిస్తున్నానో అవగతం అవుతోంది. ఇది ఒక విధంగా నాకు మంచిదే అవుతోంది. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు, నిన్ను నీవు తెలుసుకో.. అన్న వాక్యం యొక్క అర్దం ఇలాంటి సంఘటనల వల్ల నాకు నేను ఎంత ఆవేశ పరుడినై నాకుండాల్సినటువంటి ఇంగిత ఙ్ఞానాన్ని ఎలా కోల్పోతున్నానో అవగతం అవుతోంది.

నన్ను ఏదో విధంగా రెచ్చగొట్టలనుకునే కెలుకుడు బ్యాచ్ వారందరికో ఇదే నా ఆహ్వానం. మీరు ఎంత దిగజారి ఎంత హేయమైన ప్రవర్తన చూపించుకోవాలనుకుంటున్నారో అంత ప్రయత్నించండి. మీ శక్తి వంచన లేకుండా మీ సత్తా ఏమిటో చూపించండి. మీరు ఎంత పోటీ ఇస్తే నేను అంత గట్టివాడనౌతాను. చూద్దాం, ఈ యుద్దంలో మీరు గెలుస్తారో నేను గెలుస్తానో తేలే వరకూ నేను వెనక్కు తగ్గను.

ఇదంతా నేనే!! ఓ అవలోకనం

నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో బ్లాగడమే తెలుసు, తెలుగులో బ్లాగుతారని లోకి వచ్చిన తరువాత తెలిసింది.

మొట్ట మొదటి సారిగా 2008వ సంవత్సరంలో మార్చి నెలలో 12వ తారీఖున “ఉబుసు పోక” బ్లాగాను. అలా సాగిన నా బ్లాగు ప్రహసనం మూడేళ్ళ తరువాత ఈ పుటతో నూట యాభైయొకటవ పుటకు చేరుకుంది. అలా కొంత కాలం అయ్యిన తరువాత, ఈ ఉబుసు పోక బ్లాగడాన్ని ఉత్తి హాస్యాస్పదమైన లేదా అంతగా ఆలోచించడానికి అవసరం లేని విషయాలకు మాత్రమే పరిమితం చేసి, కొంచం ఆలోచించడానికి అవసరమైన విషయాలను భవదీయుడు అనే బ్లాగులో వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఇలా భవదీయుడు బ్లాగు మే నెల ఐదో తారీఖున మొదలైంది. భవదీయుడు బ్లాగులో ఓ వంద పోస్టులు వరకూ పడ్డాయ్యన్నమాట. నిజంగా చెప్పాలంటే భవదీయుడు బ్లాగు నూట ఒక్క పోస్టులు నోచుకున్నా, ఒక పోస్టుని పలు కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. మొదటి గణనాంకాలు

  ఉబుసు పోక భవదీయుడు
వ్రాసిన పోస్టుల సంఖ్య 150 100
మొత్తం స్పందనలు 501 580
పోస్టుకి ఎక్కువ స్పందనల 22 58
పోస్టుకి అత్యధిక హిట్స్ 1502 886
ఏ నెలలో అత్యధిక హిట్స్ 2010 అక్టోబర్ 2010 ఆగస్ట్
అత్యల్ప హిట్స్ 2011 మార్చ్ 2011 మార్చ్
ఇంతవరకూ ఎన్ని హిట్స్ 20151 18661

ఇప్పుడు విడివిడిగా ఒక్కో బ్లాగుగురించి పరిశీలిస్తే.. వివిధ దేశాలనుంచి ఎన్ని విజిట్స్ వచ్చాయి, ఒక్కో దేశాన్నించి ఎన్ని అనే లెక్కలో ప్రధమ పది దేశాలను లెక్క వేస్తే ఈ క్రింది విధంగా లెక్క తేలింది.

దేశాల వారిగా పుటల సందర్శన ఉబుసు పోక భవదీయుడు
భారతదేశం 12556 8031
అమెరికా 4607 7287
సింగపూర్ 483 561
యునైటెడ్ కింగుడం 425 478
యునైటెడ్ ఎమిరేట్స్ 222 137
కెనడా 63 171
చెక్ రిపబ్లిక్   148
ఫ్రాన్స్   134
అస్ట్రేలియా 70 105
నెదర్లాండ్స్   105
జపాన్ 62  
ఓమన్ 56  

ఇప్పుడు ప్రస్తావించ బోయే గణనాంకాలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే, ఎక్కువమంది ఏ ఏ విహారిణులు వాడారు అన్న ఆలోచన వచ్చిన తరువాత గణనాంకాలు చూస్తే, నాకు ఎంతో ప్రీతి ప్రాయమైన మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత స్థానం మొజిల్లా వారి ఫైర్ ఫాక్స్. అంతే కాకుండా దాదాపుగా నేను ఎన్నడూ వినని విహారిణుల గురించి కూడా నాకు తెలిసింది.

విహరణి గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8546 7528
ఫైర్ ఫాక్స్ 7053 7387
క్రోం 3774 2871
సఫారి 273 410
ఒపెరా 156 92
క్రోం ఫ్రేం 93 71
ఒన్ రొయిట్ (OneRiot) 30 54
సింపుల్ పై (SimplePie) 18 19
pythumbnail.py 12  
PBSTB 11  
జావా   18
సెర్చ్ టూల్ బార్   17

విచ్చేసిన అతిధులు వాడిన ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఒక్కసారి అవలోకిస్తే ఎక్కువ శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారని తెలియడం ఆశ్చర్యం కాదు కానీ, విచ్చేసే వారు వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టంస్ వాడటమే కాకుండా, అధునాతన మైన సాధనాలైన మొబైల్ ఉపకరణాల ద్వారా కూడా విచ్చేస్తున్నారన్న విషయం నమ్మబుద్ది కాలేదు.

ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
విండోస్ 19216 16502
మాకింతోష్ 305 1141
మిగతా యునిక్స్ 367 386
లినిక్స్ 136 324
ఐఫోన్ 62 120
ఐపాడ్ 55 39
ఇపోడ్   10
విండోస్ NT 6.1   3
నోకియా 6 1
సామ్ సంగ్   1
LG 11  
FreeBSD 2  

నా ఈ బ్లాగులు ఏ ఏ అగ్రిగేటర్ల ద్వారా వీక్షించ బడుతున్నాయి అన్న ఆలోచనలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భవదీయుడు బ్లాగుని తెలుగు బ్లాగర్స్ లోను అలాగే ఒన్ ఇండియా వారి బ్లాగ్స్ యందు కలపలేదని. వీలు చూసుకుని వాటికు కూడా కలుపుతాను.

దారి చూపిన URLs స్థానం ఉబుసు పోక భవదీయుడు
కూడలి 1 1
మాలిక 2 2
గూగుల్ పోల్స్   3
హారం 4 4
జల్లెడ 3 5
తెలుగు బ్లాగర్స్ 5  
ఒన్ ఇండియా / దట్స్ తెలుగు 6  

ఈ మూడేళ్ళను సంవత్సరం ప్రకారం చూస్తే నాలుగు సంవత్సరాలను లెక్కలోకి తీసుకుని ఎన్నెన్ని పోస్టులు వ్రాసాను అని ఆలోచిస్తే కొంచం వైవిధ్యం కనబడుతోంది.

సంవత్సరం ఉబుసు పోక భవదీయుడు
2008 64 19
2009 30 33
2010 36 30
2011 19 18

ముగించే ముందు ఓ విషయం నాకు ఆశ్చర్య పఱచింది. భవదీయుడు బ్లాగులో అమెరికాపై వ్రాసిన మూడు పోస్టులు టాప్ పదింటిలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకుంటే, ఉబుసు పోని బ్లాగులో సినిమా పాటల రివ్యూలు మొదటి స్థానాలు ఆక్రమించుకున్నాయి. ఇంకా విశ్లేషించ వచ్చు కానీ కొంచం ఎక్కువ విశ్లేషించుకుంటున్నానేమో అనిపిస్తూ విరమించుకుంటున్నాను. నేనె ఇంతగా డప్పు కొట్టుకుంటే నాకన్నా ఎక్కువగా వ్రాసేవారు ఎంత కొట్టుకోవాలో అన్న విషయం బుర్రలో దూరి బండ బూతులు తిడుతోంది.

యెడ్యూరప్ప నాకు నచ్చలేదు

నిన్నగాక మొన్న ఏదో చిత్రం జరుగుతోంది కదా అంటూ ఓ పుట వ్రాసుకుంటే, ఇంతలో ఆ కధలోని నాయకుడు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ధైర్యంగా ఈయన ఎవ్వరి మాట వినడు, వీడు సీతయకి తాతయ్య అని నేను చెప్పుకుంటుంటే, మధ్యలో ఈ పితలాటకం ఏంటంట? దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనిపై సిబిఐ ఇంక్వైరీ వెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని యడ్యూరప్పగారికి రాసి ఇచ్చేయ్యాలని వచ్చే ఎన్నికలలో ఎవ్వరూ పోటీ చెయ్యకూడదని నేను బాహాటంగా పిలుపు నిస్తున్నాను. కాబట్టి యడ్యూరప్ప విధేయులారా, అందరూ రండి. సమిష్టిగా ముందుకు అడుగేద్దాం. తిరిగి ముఖ్యమంత్రి పదవిని మన యడ్యూరప్పగారికి అప్పగిద్దాం. ఇలా ముందుకు వచ్చిన అందరికీ ఓక్కో ఖనిజ గనిని ఓ పదేళ్ళ పాటు తవ్వుకోవడానికి అనుమతి ఇప్పిస్తాం.

ఖనిజ గని తవ్వితే రాళ్ళొస్తే మాకు మణులు మాణిఖ్యాలు వస్తే మీకు. దీనిపై ఎవ్వరైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తే వాళ్ళు రోడ్డుపై ఎలా తిరుగుతారో చూస్తా. వాళ్ళనే కాదు వాళ్ళకు తోడుగా నిలచిన వారందరినీ తుత్తునీయులుగా బాది తలా దిక్కుకి వేసేస్తా.

అలాగే దీనికి తోడుగా, లేదు కాదు యడ్యూరప్పకు వెన్నుపోటు పొడవాల్సిందే అని ప్రపంచం అంతా ఒక్కటైతే, వచ్చే ముఖ్యమంత్రి ఎవ్వరో మనమే చెప్పాలి. అలా కాని పక్షంలో మనం ఊరుకోం అన్నమాట. కాదు కూడదంటే, మఱోసారి అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టమనండి. ఎవ్వరొద్దన్నారు. ఇలాంటి అవిశ్వాసాన్ని నెలకొకసారి పెట్టమనండి. మేమేదన్నా అభ్యంతరం పెడితే అప్పుడు చెప్పండి. మొన్న ఆ రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించుకుంటే, లాలూచీ పడి ఆయననే ఉపసంహరించేటట్టు చేసిన ఘనత మా ఒక్క రాష్ట్రానికే చెందుతుంది. కాబట్టి అన్నివిధాలుగా యడ్యూరప్పనే పునః ప్రవేశం చేయించాలి.

అలా చేసేంత వరకూ, నా ఉద్దేశ్యం ఏమిటంటే, అలా చేయించేత వరకూ యెడ్యూరప్పగారు నాకు నచ్చరు.

ఎంతటి చిత్రమో కదా!!

ప్రస్తుత రాజకీయాలను ప్రతిపాదికగా తీసుకుని ఓ స్నేహితురాలు నాకు ఈ క్రిందటి వాక్యాన్ని హాస్యాస్పదంగా చెప్పారు. అది చదివిన తరువాత నాకు అనిపించిన భావనే ఈ పుట శీర్షిక. ఇచ్చిన వాక్యంలో మన దేశ ప్రధాని మన్ మోహన్ గారు, కర్ణాటక ముఖ్య మంత్రి అయిన యెడ్యీరప్పగారు, మాయావతి వంటి వారికి తోడుగా కోట్ల రూపాయల కుంభకోణంలో జైల్ పాలైన కల్మాడీ కూడా చేరితే ఈ వాక్యానికి పూర్ణత్వం వచ్చినట్లైంది. తెలుగులో ఆ వాక్య భావనను విశ్లేషిస్తే..

మొదటగా మన మన్ మోహన్ గారు నోరు తెఱచి మాట్లాడరు. ఎందుకంటే, కళ్ళెం జన్ పధ్ రోడ్డులో ఉంది కదా.

కరుణానిధిగారు కనరు, అందుకే ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు.

యెడ్యూరప్పగారు  వినరు. ఎందుకంటే, భాజాపా అధిష్టానం ఎన్ని సార్లు ఆదేశించినా తన మాత్రం పదవి నొదిలేది లేదని ఏటికి ఎదురీది రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదించిన ప్రతిపాదనను కూడా వెనక్కు తెప్పించే సత్తా ఉన్నందున వీరు ఎవ్వరి మాట వినరు

మాయావతి గారికీ ఏ విషయమూ పట్టదు. ఎందుకంటే, తాను పట్టిన ఏనుగుల స్థంబాలే అన్ని చోట్ల ఉండాలి అనేది వీరి తీరు

అన్నింటికీ మించి భలే విషయం ఏమిటంటే, మన సురేష్ కల్మాడీగారు. కామన్ వెల్త్ గేమ్స్ ద్వారా కోట్ల రూపాయలు నొక్కేసిన వీరికి ఈ మధ్య మన బాలయ్యకు వచ్చినటువంటి జబ్బేదో వచ్చిందంట. మన బాలయ్య గారికేమో కత్తిని చూస్తే పొడవాలని పిస్తే, కల్మాడీ గారికి పాత ఙ్ఞాపకాలు నశించి పోతున్నాయంట. అలా నశించి పోవడం ద్వారా వీరి గుర్తు పెట్టుకునే సామర్ద్యం సన్నగిల్లి వీరేమి చేసారో మఱచి పోతారంట. సింపుల్ గా చెప్పాలంటే, మన కల్మాడీ మఱో గజనీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న వీరిని ఎవ్వరైనా ఇంటరాగేషన్ చేసారనుకోండి, చక్కగా తప్పించుకోవడానికి బాగా పనికి వచ్చే ఒకే ఒక రోగమే ఈ మతి మఱపు జబ్బన్నమాట.

 

ఇదంటి మన భారతీయ రాజకీయ మఱియు నాన్ రాజకీయ ప్రముఖ నాయకులపై వచ్చిన వివరణ. ఆంగ్లంలో వచ్చిన వాక్యాన్ని ఆంగ్లంలో చదువుకుంటే, అదో ఆనందం అనుకునే వారికోసం, ఇదిగో ఈ క్రింద

Manmohan doesn't speak, Yeddyurappa doesn't listen. Karunanidhi does'nt see. Mayawati doesn't care, And now Kalmadi doesn't remember... some DemoCRAZY in India...!

ఇప్పుడు నాకు కూడా ఏదో కొత్త రకమైన జబ్బు వస్తోంది. ఇంత చదివి స్పందించ కుండా పోయేవారిని చితక బాదాలని. నా చేత తన్నులు తింటారా, లేక స్పందిస్తారా అనేది మీ అభిమతానికే వదిలేస్తున్నాను.

నచ్చింది

ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదు. ఎందుకని అంటే, ఏవేవో కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ విషయం వ్రాయడానికి ఎందుకో వెనకాడకుండా అనుకున్నదే తడవుగా వ్రాసేస్తున్నాను. దాని కారణం సంగీతం. నా పెళ్ళికి ముందు నేను నా భార్యని అడిగిన మొట్ట మొదటి పని ఏమిటో తెలిస్తే మీరు నవ్వు కుంటారు. అప్పట్లో నేను బెంగళూర్ నగరంలో పని చేసే వాడిని. సెలవలకి విజయవాడ వస్తున్నానని అందునా నాకు విజయవాడలో చాలా పనులున్నాయి కావున వీలైతే పంచ రత్న కీర్తలన సీడీ దొరుకుతుందేమో అని వెతక మని చెప్పాను. అలా నా భార్యనుంచి నేను అందుకున్న మొట్ట మొదటి కానుక పంచ రత్న కీర్తనల సీడి.

నాకు ఉన్న కొన్ని బల హీనతలలో ఒకటి సంగీతం. దీనియందు నన్ను నేను కోల్పోతుంటాను. ఇప్పుడే ఓ సన్నిహితుడు నాకు ఈ క్రింద చూపబడిన వీడియో గురించి తెలియ జేసారు. ఈ సంగీతంలో చివ్వరలో వచ్చే గమకాలు, ఉదృతంగా సాగుతూ ఆఖరికి ప్రశాంతంగా అంతం అయ్యే విధానం భలే నచ్చిందనుకోండి.

ఇలాంటి సంగీతాన్నిచ్చిన ఈ సంగీత కారుల గురించి వ్రాయకుండా అలాగే వారిని మెచ్చుకోలేకుండా ఉండలేను. ఈ సంగీత సరస్వతీ పుతృలు ఇలాగే మరికొన్ని అభుత కీర్తనకు సమకూర్చి ఇంతకింతకు ఎదిగి సంగీత ప్రపంచంలో కీర్తిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

నైతిక విలువలు పుష్కలంగా ఉన్న టాటా కాపిటల్ వారి ప్రకటన

ఈ మధ్య అనుకోకుండా ఓ చెత్త ప్రకటన చూచిన తరువాత అనుకోకుండా ఈ ప్రకటన నా కంట పడింది. చెడ్డదానిని చెత్తగా ఉంది అని చెప్పినప్పుడు బాగున్నదానిని బాగుంది అని చెప్పడానికి నేనెందుకు వెనకాడాలని ఆలోచించిన తరువాత ఇదిగో మఱో ప్రకటన గురించి నా అభిప్రాయం. ఈ ప్రకటనలో చక్కగా ఇద్దరు పిల్లలనే వాడుకోవడంలో అశ్లీలానికి చోటు లేకుండా పోయింది.

అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ ప్రకటన వెనకాల దాగిఉన్న మూలాంశము. నాకు అది త్యాగంగా అనిపించింది. వ్యాపార పరంగా వీరు త్యాగం చేస్తారని అనుకోను, కానీ జనాలను నమ్మించే ప్రయత్నంలో ఈ మంచి ఆలోచనను చూపించిన విధం బాగుంది. ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అసభ్యంగా హుందాగా చెప్పవచ్చో ఈ ప్రకటనలో చాలా బాగా చూపించారు.

10 తరువాతి సంఖ్యలపై చెత్త కోణం

అంకెల గురించి తెలియని వారు ఉండరు. తొమ్మిది తరువాత వచ్చే సంఖ్యని పది అని ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. కాకపోతే, ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ తరువాత వచ్చే సంఖ్య గురించే.. 11 మఱియు 12 వదిలేసి తరువాత వచ్చే అంకెలను తలచుకుంటే, అవి చక్కగా

పది + మూడు = పదమూడు

పది + నాలుగు = పద్నాలుగు

వగైరా వగరా అంటూ సాగి పోకుండా సదరు పదుల వరస అంతా చెత్త చెత్తగా పొంతన లేకుండా సాగుతుంది. అదే ఇరవైల వరసలో అంకెలు చక్కగా పొందికగా ఒద్దికగా ఓ పద్దతి ప్రకారంగా సాగుతాయి..

ఇరవై + ఒకటి = ఇరవైఒకటి

ఇరవై + రెండు = ఇరవైరెండు

డెభై + మూడు = డెభై మూడు

అరవై + నాలుగు = అరవైనాలుగు

తొంభై + ఐదు = తొంభై ఐదు

ముప్పై + ఆరు = ముప్పైఆరు

నలభై + ఏడు = నలభైఏడు

తొంభై + ఎనిమిది = తొంభైఎనిమిది

యాభై + తొమ్మిది = యాభైతొమ్మిది

అంటూ చక్కగా ఓ లెక్కా పత్రంగా సాగుతాయి. ఎటొచ్చీ ఈ పదుల వరసే తలతిక్కగా సాగుతుంది. ఈ విషయం ఒక్క తెలుగులోనే అనుకుంటే పొరపాటే, గ్రహపాటు పరంగా ఇది అటు ఆంగ్లంలోను ఇటు హిందీలో కూడా వంకరటింకరగా చెత్త చెత్తగా గజిబిజిగా ఉన్నాయి. ఇవి కనిపెట్టినవాడు కనుక నాకు కనబడితేనా.. నా సావిరంగ చింత బరిక పట్టుకుని.. దింతాక్ చితా చితా జింతాక్ థా.. చేసేస్తా.

నాకు అర్దం కాని విషయం ఏమిటంటే, ఒక్క తెలుగుకే తెగులు పట్టిందనుకుంటే, అటు ఆంగ్లానికి ఇటు హిందీకి కూడా పోయ్యే కాలం దాపురించింది. నాకు ఈ మూడు భాషలలోనే ఈ అంకెలను ఏమంటారో తెలుసు, మిగిలిన భాషలలో కూడా ఇలాగే ఉందే లేదో ఆయా భాషలు వచ్చిన వారు చెప్పాలి.

ఎలా ఉంటే పద్దతిగా ఉంటుంది
తెలుగులో ఆంగ్లంలో హిందీలో తెలుగులో ఆంగ్లంలో హిందీలో
పది+ఒకటి =
పదకొండు ఎలవెన్ గ్యారాహ్ పదొకటి వన్టీవన్ ఇక్ దస్
పది + రెండు = పన్నెండు ట్వల్వ్ బారాహ్ పద్రెండు వన్టీటూ బా దస్

ఈ విధంగా సాగితే, రాబోయే రోజులకి కాబోయే లెక్కల మాస్టారిని నేనే..

 
Clicky Web Analytics