ఇదంతా నేనే!! ఓ అవలోకనం

నేను తెలుగులో బ్లాగింగి మొదలు పెట్టిన తరువాత ఈ నాటికి ఓ ముఖ్య ఘట్టాన్ని దాటానని నాకు ఈ అవలోకనం తెలియజేసింది. అంతే కాకుండా నాకు లేని ఏదో భాధ్యతిని గుర్తు చేసినట్లు ఉంది. వాటి గురించి వ్రాసుకునే ముందు ఓ అవలోకనం. నేను ప్రప్రధమంగా తెలుగులో వ్రాసుకోవడం మొదలు పెట్టింది “” అనే బ్లాగుతో. దానికి అనుసంధానంగా “” అనే మఱో బ్లాగు. ఆ నాటి వరకూ నాకు ఆంగ్లంలో బ్లాగడమే తెలుసు, తెలుగులో బ్లాగుతారని లోకి వచ్చిన తరువాత తెలిసింది.

మొట్ట మొదటి సారిగా 2008వ సంవత్సరంలో మార్చి నెలలో 12వ తారీఖున “ఉబుసు పోక” బ్లాగాను. అలా సాగిన నా బ్లాగు ప్రహసనం మూడేళ్ళ తరువాత ఈ పుటతో నూట యాభైయొకటవ పుటకు చేరుకుంది. అలా కొంత కాలం అయ్యిన తరువాత, ఈ ఉబుసు పోక బ్లాగడాన్ని ఉత్తి హాస్యాస్పదమైన లేదా అంతగా ఆలోచించడానికి అవసరం లేని విషయాలకు మాత్రమే పరిమితం చేసి, కొంచం ఆలోచించడానికి అవసరమైన విషయాలను భవదీయుడు అనే బ్లాగులో వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఇలా భవదీయుడు బ్లాగు మే నెల ఐదో తారీఖున మొదలైంది. భవదీయుడు బ్లాగులో ఓ వంద పోస్టులు వరకూ పడ్డాయ్యన్నమాట. నిజంగా చెప్పాలంటే భవదీయుడు బ్లాగు నూట ఒక్క పోస్టులు నోచుకున్నా, ఒక పోస్టుని పలు కారణాల వల్ల తొలగించాల్సి వచ్చింది. మొదటి గణనాంకాలు

  ఉబుసు పోక భవదీయుడు
వ్రాసిన పోస్టుల సంఖ్య 150 100
మొత్తం స్పందనలు 501 580
పోస్టుకి ఎక్కువ స్పందనల 22 58
పోస్టుకి అత్యధిక హిట్స్ 1502 886
ఏ నెలలో అత్యధిక హిట్స్ 2010 అక్టోబర్ 2010 ఆగస్ట్
అత్యల్ప హిట్స్ 2011 మార్చ్ 2011 మార్చ్
ఇంతవరకూ ఎన్ని హిట్స్ 20151 18661

ఇప్పుడు విడివిడిగా ఒక్కో బ్లాగుగురించి పరిశీలిస్తే.. వివిధ దేశాలనుంచి ఎన్ని విజిట్స్ వచ్చాయి, ఒక్కో దేశాన్నించి ఎన్ని అనే లెక్కలో ప్రధమ పది దేశాలను లెక్క వేస్తే ఈ క్రింది విధంగా లెక్క తేలింది.

దేశాల వారిగా పుటల సందర్శన ఉబుసు పోక భవదీయుడు
భారతదేశం 12556 8031
అమెరికా 4607 7287
సింగపూర్ 483 561
యునైటెడ్ కింగుడం 425 478
యునైటెడ్ ఎమిరేట్స్ 222 137
కెనడా 63 171
చెక్ రిపబ్లిక్   148
ఫ్రాన్స్   134
అస్ట్రేలియా 70 105
నెదర్లాండ్స్   105
జపాన్ 62  
ఓమన్ 56  

ఇప్పుడు ప్రస్తావించ బోయే గణనాంకాలు కొంచం ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే, ఎక్కువమంది ఏ ఏ విహారిణులు వాడారు అన్న ఆలోచన వచ్చిన తరువాత గణనాంకాలు చూస్తే, నాకు ఎంతో ప్రీతి ప్రాయమైన మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ మొదటి స్థానంలో ఉంది. దాని తరువాత స్థానం మొజిల్లా వారి ఫైర్ ఫాక్స్. అంతే కాకుండా దాదాపుగా నేను ఎన్నడూ వినని విహారిణుల గురించి కూడా నాకు తెలిసింది.

విహరణి గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8546 7528
ఫైర్ ఫాక్స్ 7053 7387
క్రోం 3774 2871
సఫారి 273 410
ఒపెరా 156 92
క్రోం ఫ్రేం 93 71
ఒన్ రొయిట్ (OneRiot) 30 54
సింపుల్ పై (SimplePie) 18 19
pythumbnail.py 12  
PBSTB 11  
జావా   18
సెర్చ్ టూల్ బార్   17

విచ్చేసిన అతిధులు వాడిన ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఒక్కసారి అవలోకిస్తే ఎక్కువ శాతం మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారని తెలియడం ఆశ్చర్యం కాదు కానీ, విచ్చేసే వారు వివిధ రకాలైన ఆపరేటింగ్ సిస్టంస్ వాడటమే కాకుండా, అధునాతన మైన సాధనాలైన మొబైల్ ఉపకరణాల ద్వారా కూడా విచ్చేస్తున్నారన్న విషయం నమ్మబుద్ది కాలేదు.

ఆపరేటింగ్ సిస్టం గణనాంకాలు ఉబుసు పోక భవదీయుడు
విండోస్ 19216 16502
మాకింతోష్ 305 1141
మిగతా యునిక్స్ 367 386
లినిక్స్ 136 324
ఐఫోన్ 62 120
ఐపాడ్ 55 39
ఇపోడ్   10
విండోస్ NT 6.1   3
నోకియా 6 1
సామ్ సంగ్   1
LG 11  
FreeBSD 2  

నా ఈ బ్లాగులు ఏ ఏ అగ్రిగేటర్ల ద్వారా వీక్షించ బడుతున్నాయి అన్న ఆలోచనలో నాకు కొన్ని విషయాలు తెలిసాయి. భవదీయుడు బ్లాగుని తెలుగు బ్లాగర్స్ లోను అలాగే ఒన్ ఇండియా వారి బ్లాగ్స్ యందు కలపలేదని. వీలు చూసుకుని వాటికు కూడా కలుపుతాను.

దారి చూపిన URLs స్థానం ఉబుసు పోక భవదీయుడు
కూడలి 1 1
మాలిక 2 2
గూగుల్ పోల్స్   3
హారం 4 4
జల్లెడ 3 5
తెలుగు బ్లాగర్స్ 5  
ఒన్ ఇండియా / దట్స్ తెలుగు 6  

ఈ మూడేళ్ళను సంవత్సరం ప్రకారం చూస్తే నాలుగు సంవత్సరాలను లెక్కలోకి తీసుకుని ఎన్నెన్ని పోస్టులు వ్రాసాను అని ఆలోచిస్తే కొంచం వైవిధ్యం కనబడుతోంది.

సంవత్సరం ఉబుసు పోక భవదీయుడు
2008 64 19
2009 30 33
2010 36 30
2011 19 18

ముగించే ముందు ఓ విషయం నాకు ఆశ్చర్య పఱచింది. భవదీయుడు బ్లాగులో అమెరికాపై వ్రాసిన మూడు పోస్టులు టాప్ పదింటిలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించుకుంటే, ఉబుసు పోని బ్లాగులో సినిమా పాటల రివ్యూలు మొదటి స్థానాలు ఆక్రమించుకున్నాయి. ఇంకా విశ్లేషించ వచ్చు కానీ కొంచం ఎక్కువ విశ్లేషించుకుంటున్నానేమో అనిపిస్తూ విరమించుకుంటున్నాను. నేనె ఇంతగా డప్పు కొట్టుకుంటే నాకన్నా ఎక్కువగా వ్రాసేవారు ఎంత కొట్టుకోవాలో అన్న విషయం బుర్రలో దూరి బండ బూతులు తిడుతోంది.

యెడ్యూరప్ప నాకు నచ్చలేదు

నిన్నగాక మొన్న ఏదో చిత్రం జరుగుతోంది కదా అంటూ ఓ పుట వ్రాసుకుంటే, ఇంతలో ఆ కధలోని నాయకుడు ఇలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు. ధైర్యంగా ఈయన ఎవ్వరి మాట వినడు, వీడు సీతయకి తాతయ్య అని నేను చెప్పుకుంటుంటే, మధ్యలో ఈ పితలాటకం ఏంటంట? దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీనిపై సిబిఐ ఇంక్వైరీ వెయ్యాలని కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అలాగే కర్ణాటక రాష్ట్రాన్ని యడ్యూరప్పగారికి రాసి ఇచ్చేయ్యాలని వచ్చే ఎన్నికలలో ఎవ్వరూ పోటీ చెయ్యకూడదని నేను బాహాటంగా పిలుపు నిస్తున్నాను. కాబట్టి యడ్యూరప్ప విధేయులారా, అందరూ రండి. సమిష్టిగా ముందుకు అడుగేద్దాం. తిరిగి ముఖ్యమంత్రి పదవిని మన యడ్యూరప్పగారికి అప్పగిద్దాం. ఇలా ముందుకు వచ్చిన అందరికీ ఓక్కో ఖనిజ గనిని ఓ పదేళ్ళ పాటు తవ్వుకోవడానికి అనుమతి ఇప్పిస్తాం.

ఖనిజ గని తవ్వితే రాళ్ళొస్తే మాకు మణులు మాణిఖ్యాలు వస్తే మీకు. దీనిపై ఎవ్వరైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తే వాళ్ళు రోడ్డుపై ఎలా తిరుగుతారో చూస్తా. వాళ్ళనే కాదు వాళ్ళకు తోడుగా నిలచిన వారందరినీ తుత్తునీయులుగా బాది తలా దిక్కుకి వేసేస్తా.

అలాగే దీనికి తోడుగా, లేదు కాదు యడ్యూరప్పకు వెన్నుపోటు పొడవాల్సిందే అని ప్రపంచం అంతా ఒక్కటైతే, వచ్చే ముఖ్యమంత్రి ఎవ్వరో మనమే చెప్పాలి. అలా కాని పక్షంలో మనం ఊరుకోం అన్నమాట. కాదు కూడదంటే, మఱోసారి అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టమనండి. ఎవ్వరొద్దన్నారు. ఇలాంటి అవిశ్వాసాన్ని నెలకొకసారి పెట్టమనండి. మేమేదన్నా అభ్యంతరం పెడితే అప్పుడు చెప్పండి. మొన్న ఆ రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించుకుంటే, లాలూచీ పడి ఆయననే ఉపసంహరించేటట్టు చేసిన ఘనత మా ఒక్క రాష్ట్రానికే చెందుతుంది. కాబట్టి అన్నివిధాలుగా యడ్యూరప్పనే పునః ప్రవేశం చేయించాలి.

అలా చేసేంత వరకూ, నా ఉద్దేశ్యం ఏమిటంటే, అలా చేయించేత వరకూ యెడ్యూరప్పగారు నాకు నచ్చరు.

ఎంతటి చిత్రమో కదా!!

ప్రస్తుత రాజకీయాలను ప్రతిపాదికగా తీసుకుని ఓ స్నేహితురాలు నాకు ఈ క్రిందటి వాక్యాన్ని హాస్యాస్పదంగా చెప్పారు. అది చదివిన తరువాత నాకు అనిపించిన భావనే ఈ పుట శీర్షిక. ఇచ్చిన వాక్యంలో మన దేశ ప్రధాని మన్ మోహన్ గారు, కర్ణాటక ముఖ్య మంత్రి అయిన యెడ్యీరప్పగారు, మాయావతి వంటి వారికి తోడుగా కోట్ల రూపాయల కుంభకోణంలో జైల్ పాలైన కల్మాడీ కూడా చేరితే ఈ వాక్యానికి పూర్ణత్వం వచ్చినట్లైంది. తెలుగులో ఆ వాక్య భావనను విశ్లేషిస్తే..

మొదటగా మన మన్ మోహన్ గారు నోరు తెఱచి మాట్లాడరు. ఎందుకంటే, కళ్ళెం జన్ పధ్ రోడ్డులో ఉంది కదా.

కరుణానిధిగారు కనరు, అందుకే ఎప్పుడూ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు.

యెడ్యూరప్పగారు  వినరు. ఎందుకంటే, భాజాపా అధిష్టానం ఎన్ని సార్లు ఆదేశించినా తన మాత్రం పదవి నొదిలేది లేదని ఏటికి ఎదురీది రాష్ట్ర గవర్నర్ ప్రతిపాదించిన ప్రతిపాదనను కూడా వెనక్కు తెప్పించే సత్తా ఉన్నందున వీరు ఎవ్వరి మాట వినరు

మాయావతి గారికీ ఏ విషయమూ పట్టదు. ఎందుకంటే, తాను పట్టిన ఏనుగుల స్థంబాలే అన్ని చోట్ల ఉండాలి అనేది వీరి తీరు

అన్నింటికీ మించి భలే విషయం ఏమిటంటే, మన సురేష్ కల్మాడీగారు. కామన్ వెల్త్ గేమ్స్ ద్వారా కోట్ల రూపాయలు నొక్కేసిన వీరికి ఈ మధ్య మన బాలయ్యకు వచ్చినటువంటి జబ్బేదో వచ్చిందంట. మన బాలయ్య గారికేమో కత్తిని చూస్తే పొడవాలని పిస్తే, కల్మాడీ గారికి పాత ఙ్ఞాపకాలు నశించి పోతున్నాయంట. అలా నశించి పోవడం ద్వారా వీరి గుర్తు పెట్టుకునే సామర్ద్యం సన్నగిల్లి వీరేమి చేసారో మఱచి పోతారంట. సింపుల్ గా చెప్పాలంటే, మన కల్మాడీ మఱో గజనీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న వీరిని ఎవ్వరైనా ఇంటరాగేషన్ చేసారనుకోండి, చక్కగా తప్పించుకోవడానికి బాగా పనికి వచ్చే ఒకే ఒక రోగమే ఈ మతి మఱపు జబ్బన్నమాట.

 

ఇదంటి మన భారతీయ రాజకీయ మఱియు నాన్ రాజకీయ ప్రముఖ నాయకులపై వచ్చిన వివరణ. ఆంగ్లంలో వచ్చిన వాక్యాన్ని ఆంగ్లంలో చదువుకుంటే, అదో ఆనందం అనుకునే వారికోసం, ఇదిగో ఈ క్రింద

Manmohan doesn't speak, Yeddyurappa doesn't listen. Karunanidhi does'nt see. Mayawati doesn't care, And now Kalmadi doesn't remember... some DemoCRAZY in India...!

ఇప్పుడు నాకు కూడా ఏదో కొత్త రకమైన జబ్బు వస్తోంది. ఇంత చదివి స్పందించ కుండా పోయేవారిని చితక బాదాలని. నా చేత తన్నులు తింటారా, లేక స్పందిస్తారా అనేది మీ అభిమతానికే వదిలేస్తున్నాను.

నచ్చింది

ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదు. ఎందుకని అంటే, ఏవేవో కారణాలు కనబడుతున్నాయి. కానీ ఈ విషయం వ్రాయడానికి ఎందుకో వెనకాడకుండా అనుకున్నదే తడవుగా వ్రాసేస్తున్నాను. దాని కారణం సంగీతం. నా పెళ్ళికి ముందు నేను నా భార్యని అడిగిన మొట్ట మొదటి పని ఏమిటో తెలిస్తే మీరు నవ్వు కుంటారు. అప్పట్లో నేను బెంగళూర్ నగరంలో పని చేసే వాడిని. సెలవలకి విజయవాడ వస్తున్నానని అందునా నాకు విజయవాడలో చాలా పనులున్నాయి కావున వీలైతే పంచ రత్న కీర్తలన సీడీ దొరుకుతుందేమో అని వెతక మని చెప్పాను. అలా నా భార్యనుంచి నేను అందుకున్న మొట్ట మొదటి కానుక పంచ రత్న కీర్తనల సీడి.

నాకు ఉన్న కొన్ని బల హీనతలలో ఒకటి సంగీతం. దీనియందు నన్ను నేను కోల్పోతుంటాను. ఇప్పుడే ఓ సన్నిహితుడు నాకు ఈ క్రింద చూపబడిన వీడియో గురించి తెలియ జేసారు. ఈ సంగీతంలో చివ్వరలో వచ్చే గమకాలు, ఉదృతంగా సాగుతూ ఆఖరికి ప్రశాంతంగా అంతం అయ్యే విధానం భలే నచ్చిందనుకోండి.

ఇలాంటి సంగీతాన్నిచ్చిన ఈ సంగీత కారుల గురించి వ్రాయకుండా అలాగే వారిని మెచ్చుకోలేకుండా ఉండలేను. ఈ సంగీత సరస్వతీ పుతృలు ఇలాగే మరికొన్ని అభుత కీర్తనకు సమకూర్చి ఇంతకింతకు ఎదిగి సంగీత ప్రపంచంలో కీర్తిని పొందాలని మనసారా కోరుకుంటున్నాను.

 
Clicky Web Analytics