ఎక్కువ పరుగులు చేసిన సంఘటనలపై ఓ చిన్న రివ్యూ

ఇవ్వాళ సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్ డే ఆట చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించకపోయినా చిరకాలం మిగిలిపోతుంది. ఈ వేళలో నేను చేసిన పరిశోధనలో ఓ చిన్న గుళిక నన్ను ఆశ్చర్యపరచింది. అది ఏమిటంటే, వన్ డే ఆటలో 150 పరుగులకన్నా ఎక్కువ 58 ఘటనలలో జరిగితే భారత దేశ ఆటగాళ్ళు అన్ని దేశాల ఆటగాళ్ళకన్నా అధికంగా 14 సార్లు ఈ అద్బుతాన్ని సాధిస్తే, బాంగ్లదేశ్ మరియు పాకిస్తాన్ దేశాల ఆటగాళ్ళు అత్యల్పంగా ఆఖరి మరియు ఆఖరి-౧ స్థానాలలో ఉన్నారంటే, బాంగ్లాదేశ్ ఆటగాళ్ళను పరిధిలోకి తీసుకు పోయినా పాకిస్తాన్ ఆటగాళ్ళు రెండు సార్లే సాధించారు అన్న విషయం విస్మయాన్ని కలిగించింది. సూక్ష్మంగా ఆ స్థానాలు ఈ క్రింది విధంగా

India 14
West Indies 12
Australia 8
Sri Lanka 5
South Africa 5
Zimbabwe 4
New Zealand 4
England 3
Pakistan 2
Bangladesh 1
మొత్తంగా 58

ఈ సంఘటనలలో సచిన్ టెండూల్కర్ ఐదు సార్లు పాలు పంచుకుంటే, సనత్ జయసూర్య నాలుగు సార్లు సాధించగా, బ్రైన్ లారాకు తోడుగా క్రిస్ గైల్ మరియు రిచర్డ్ మూడుసార్లు సాధించి మూడొవ స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాడైన మార్షల్ పదకొండు బౌండరీలు మరియు పన్నెండు సిక్సులు కొట్టి అందరికన్నాపెద్ద బాదుడు బాబుగా ముందున్నారు

3 స్పందనలు:

mmkodihalli said...

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్‌డే మాచ్‌లలో డబల్ సెంచరీ సాధించిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించిన సందర్భంగా అతనికి నా హృదయపూర్వక అభినందనలు!

చైతన్య.ఎస్ said...

జయహో సచిన్

Anonymous said...

365 రోజులో క్రికెట్టు ఆడుతాఉంటే బస్తాలు బస్తాలు రాకేమిజేస్తాయి. నిర్జీవమైనపిచ్చులమీద విరిచుకుపడటం ఏం గొప్ప. ఈ సచిన్ పిచ్చినుంచి రక్షిమ్చు దేవుడా

 
Clicky Web Analytics